- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
‘సీఎస్ఈ సీట్లు ఇలా పెంచితే ఎలా..’
రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్లను ఏటేటా విపరీతంగా పెంచడం మంచిది కాదని, ఇది భవిష్యత్తులో పలు విపరిణామాలకు దారితీస్తుందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి జేఎన్టీయూహెచ్ గురువారం లేఖ రాసింది.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్లను ఏటేటా విపరీతంగా పెంచడం మంచిది కాదని, ఇది భవిష్యత్తులో పలు విపరిణామాలకు దారితీస్తుందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి జేఎన్టీయూహెచ్ గురువారం లేఖ రాసింది. సీట్లు పెంచితే అధ్యాపకుల కొరత తలెత్తుతుందని లేఖలో పేర్కొంది. ఇన్ఛార్జి ఉపకులపతి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచన మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావు ఈ లేఖ రాశారు. వాస్తవానికి అనుమతుల విధివిధానాలపై ఏఐసీటీఈ గత జనవరిలోనే హ్యాండ్బుక్ విడుదల చేసింది. అపరిమిత సీట్లు మంజూరు చేస్తామని అందులో పేర్కొంది. ఈ క్రమంలోనే ఆయా కళాశాలలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోగా ఇటీవల అనుమతులిచ్చింది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత జేఎన్టీయూహెచ్ లేఖ రాయడంపై ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 8 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ పరిధిలో దాదాపు 88 వేల సీట్లకు విశ్వవిద్యాలయం అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఇతర బ్రాంచీల్లోని సుమారు 7 వేల సీట్లను కుదించుకొని సీఎస్ఈ తదితర డిమాండ్ ఉన్న బ్రాంచీల్లో పెంచుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్సీ గురుకుల సొసైటీలో పూర్తికాని తుది కేటాయింపులు
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం. 317కు సంబంధించిన ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇతర సంక్షేమ సొసైటీల్లో సాంకేతిక పొరపాట్లకు అవకాశం లేకుండా తుది కేటాయింపులు పూర్తయ్యాయి. -
దండు మల్కాపూర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి
యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు వద్ద హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) కోరింది. -
దేవాదుల సొరంగం ప్రారంభమయ్యేనా?
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశలో నిర్మించిన సొరంగం పూర్తయితే లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఈ టన్నెలే. -
నిరుపయోగ బొగ్గు గనుల నుంచి జల విద్యుత్
విద్యుదుత్పత్తి పెంచేందుకు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు(పీఎస్పీపీ) నిర్మించాలని సింగరేణి సంస్థ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ యాజమాన్యంలో పీఎస్పీపీ నిర్మాణం కోసం కసరత్తు చేస్తోంది. -
రుణం ద్వారా రూ.3,000 కోట్లు
హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్కు ఆర్థిక అవస్థలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అవతల నుంచి 2 భాగాలుగా ప్రాంతీయ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)ను తలపెట్టిన విషయం తెలిసిందే. -
రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. -
ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు తెలంగాణ యాత్రికుల దుర్మరణం
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. చమోలీ జిల్లా కర్ణప్రయాగ, గౌచర్ల మధ్యలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు తెలంగాణవాసులు మృతి.. -
సింగపూర్లో కోదాడ యువకుడి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ యువకుడు సింగపూర్లో మృతి చెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ (30) సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో లోటు వర్షపాతం
రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గత నెలలో అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురిశాయి. జూన్లో సాధారణ వర్షపాతం 131.4 మి.మీ. కాగా.. సగటున 17 శాతం అధిక వర్షపాతం (153.5 మి.మీ.) నమోదైనప్పటికీ 6 జిల్లాల్లో తీవ్రమైన లోటు నెలకొంది. -
దండిగా పన్నుల ఆదాయం
రాష్ట్రంలో పన్నుల ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పన్నుల ద్వారా రూ.20,097.73 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే సమయంలో రూ.22,419.13 కోట్లు వచ్చినట్లు ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) వెల్లడించింది. -
విశ్వసనీయతకు.. క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు
విశ్వసనీయతకు, నిబద్ధతకు, క్రమశిక్షణకు రామోజీరావు మారుపేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని కొండాపూర్లో శనివారం సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
గ్రూప్-1లో ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులు!
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉప విద్యాశాఖ అధికారుల (డిప్యూటీ ఈఓ) పోస్టులను గ్రూప్-1 ద్వారా భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. -
సిబ్బంది కొరత ఉన్న కళాశాలల ధ్రువీకరణ దరఖాస్తు గడువు 12
జేఎన్టీయూ అనుబంధ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు పునరుద్ధరణ క్రతువు ముగింపు దశకు చేరింది. మొత్తం 138 ఇంజినీరింగ్ కళాశాలలకుగాను 78 చోట్ల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. -
పేరుకే తెలుగు విశ్వవిద్యాలయం
భాషాభివృద్ధి... సాహిత్యం.. సంస్కృతి.. పరిశోధనలతో తెలుగుకు మరింత వన్నె తెచ్చేందుకు ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఆ భాషకు ప్రాధాన్యమే లేదు. -
పింఛన్లకు రూ.22 వేల కోట్లు కేటాయించండి
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.51 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ మంత్రి సీతక్క ఆర్థిక శాఖను కోరారు. -
మూడో విడతలో 73,662 మందికి డిగ్రీ సీట్లు
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) మూడో విడతలో 73,662 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. వారిలో 9,630 మంది గత రెండు విడతల్లో సీట్లు పొందినవారే. మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుని కొత్త కళాశాలలు, కోర్సుల కోసం ప్రయత్నించారు. -
తెలంగాణలో భారీగా మొక్కజొన్న సాగు
రాష్ట్రంలో మొక్కజొన్న సాగు భారీగా పెరగనుంది. ప్రస్తుత వానాకాలం సీజన్లో 6,09,458 ఎకరాల లక్ష్యానికి గాను జూన్ నెలలో 1,25,235 (20.55 శాతం) ఎకరాలు సాగైనట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. -
సాంకేతికతను సక్రమంగా వాడాలి
సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమమైన పద్ధతిలో వినియోగించకపోతే ప్రయోజనాల కంటే చెడు ప్రభావం అధికంగా ఉంటుందని అటార్నీ జనరల్్ ఆఫ్ ఇండియా ఆర్.వెంకటరమణి అన్నారు. -
సికింద్రాబాద్-గోవా మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్
ప్రముఖ పర్యాటక ప్రదేశం గోవాకు వెళ్లి వచ్చేందుకు కొత్తగా మరో రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్ (17039/17040)ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. -
ఈవీల ఉత్పత్తిలో అగ్రస్థానమే లక్ష్యం
విద్యుత్ వాహనా(ఈవీ)ల ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. శనివారం గోల్డ్స్టోన్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనను కలిసిన ఈటో త్రిచక్ర (ఆటో) విద్యుత్ వాహనాల సంస్థ ప్రతినిధులకు ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. -
అమిత్షా, కిషన్రెడ్డిలపై ఎన్నికల కేసు ఉపసంహరణ
ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని కేంద్ర మంత్రులు అమిత్షా, కిషన్రెడ్డిలపై నమోదు చేసిన కేసును పాతబస్తీ మొఘల్పురా పోలీసులు ఉపసంహరించుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
ఓటీటీలో ఫహద్ ఫాజిల్ ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?