- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రోడ్డు భద్రతకు ‘ట్రాఫిక్ వాలంటీర్లు’!
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న వాహనాలు.. నిబంధనలపై వాహనదారుల అవగాహనలేమి, నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాలూ పెరుగుతున్నాయి.
3 లక్షల మంది కళాశాలల విద్యార్థుల సేవ
ప్రతి నెలా ఒక గంటపాటు విధులు
విద్యా, పోలీసు శాఖలతో రవాణాశాఖ ప్రణాళిక
ట్రాఫిక్ నియంత్రణలో కళాశాలల విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న వాహనాలు.. నిబంధనలపై వాహనదారుల అవగాహనలేమి, నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాలూ పెరుగుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోంది. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించడంతోపాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో వారి సేవలు ఉపయోగించుకునేలా రవాణా, విద్యా, పోలీసు శాఖలు కార్యాచరణ రూపొందించాయి. రాష్ట్రవ్యాప్తంగా కళాశాల విద్యార్థులను ఆగస్టు ఒకటికల్లా ఇందులో భాగస్వాములను చేయబోతున్నారు.
300.. 30 వేలు..3 లక్షలు..
జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) విద్యార్థుల్లో 300 మందికి ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై పోలీసులతో శిక్షణ అందించారు. ప్రాథమిక శిక్షకులు అయిన వీరు ఒక్కొక్కరు మరో 100 మందికి శిక్షణ ఇస్తారు. అలా 30 వేల మంది సిద్ధం అవుతారు. వారంతా పది మందికి చొప్పున శిక్షణ ఇస్తే.. మొత్తం 3 లక్షల మంది తయారవుతారు. వీరంతా కళాశాలల విద్యార్థులు. వీరికి ట్రాఫిక్ వార్డెన్లు, వాలంటీర్లు, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్లు.. ఈ మూడు పేర్లను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ వాలంటీర్ల పేరు వైపు అధికారులు మొగ్గు చూపిస్తున్నారు.
ఉల్లంఘనల నియంత్రణకు
రోడ్లపై అతివేగంతో ప్రయాణం.. ఒకే బైక్పై ముగ్గురు.. ఫ్రీలెఫ్ట్ను వదిలేయకపోవడం..గట్టిగా హార్న్ కొట్టడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు రోజూ భారీ సంఖ్యలో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని, సమాజానికి ఉపయోగపడేలా రహదారి భద్రతలో భాగస్వాములను చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి ఇటీవల సూచించారు. దీంతో ఈ మేరకు కార్యాచరణ సిద్ధమవుతోంది. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పొందిన విద్యార్థులకు నెలలో ఒక గంట విధులు కేటాయిస్తారు. కళాశాల దగ్గర ప్రాంతంలో ఈ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీరు ట్రాఫిక్ సిబ్బందికి సహకారంగా ఉంటారు.
విద్యార్థి దశ నుంచే రహదారి భద్రతపై అవగాహన
రహదారి భద్రతపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలన్నది మా లక్ష్యం. కళాశాలల విద్యార్థుల సేవలను ట్రాఫిక్ కూడళ్లలో ఉపయోగించుకుంటాం. వాహనాల రద్దీ ఎక్కువ ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో వీరు భాగస్వాములు అవుతారు. జిల్లాలవారీగా డిప్యూటీ ట్రాన్స్పోర్టు అధికారులు(డీటీసీ) సమన్వయం చేస్తారు.
పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
తొలుత హైదరాబాద్లో.. తర్వాత రాష్ట్రమంతటా
పాఠశాలల విద్యార్థులను సమీపంలోని కూడలికి తీసుకెళ్లి.. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తాం. పాఠశాల మైదానంలోనూ తర్ఫీదు ఇస్తాం. ట్రాఫిక్ కట్టడి, రహదారి భద్రతలో కళాశాలల విద్యార్థుల సేవల్ని తొలుత హైదరాబాద్లో ఉపయోగించుకుంటాం. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం. ఈ విధానాన్ని 15, 20 రోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
బుర్రా వెంకటేశం, ముఖ్యకార్యదర్శి విద్యాశాఖ, ఎన్ఎస్ఎస్ చీఫ్ కోఆర్డినేటర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దారీతెన్నూలేని దేవుడి మాన్యాలు!
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవుడిమాన్యాలను గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. దేవాలయాల్లో నిత్య పూజా కైంకర్యాల నిర్వహణ, అర్చకుల జీవనోపాధి కోసం నిజాం, కాకతీయుల ప్రభువుల నుంచి సామాన్య భక్తుల వరకు వివిధ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు విరాళంగా ఇచ్చారు. -
అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్
అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వేగంగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంకల్పించారు. -
ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం
2047కి భారత్దేశం ప్రపంచంలోనే నంబర్-1గా ఉంటుంది. అందులో నంబర్ 1 కమ్యూనిటీగా తెలంగాణ, ఏపీలలోని తెలుగుజాతి ఉండాలి. ప్రపంచంలో భారతీయులు అగ్రగామిగా నిలవాలి. -
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రధాన పరీక్షకు 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. -
ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి
ఫార్మా విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోనే ఏర్పాటుచేసేలా తనవంతు కృషి చేస్తానన్నారు. -
కన్వీనర్ కోటా బీటెక్ సీట్లు 70,307
రాష్ట్రంలో తొలి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో ఈసారి బీటెక్ సీట్లు తగ్గాయి. వెబ్ ఆప్షన్లు సోమవారం ప్రారంభం కానుండగా కన్వీనర్ కోటా సీట్లు 70,307 మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. -
నాలుగేళ్ల సర్వీసుంటే దంపతులకూ స్థానచలనం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీచేసిన ఉత్తర్వుల్లోని సందేహాలపై ఆర్థికశాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి. -
జాతీయ రహదారులు, జలవనరులను విస్తరించాలి
రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వేలైన్ల విస్తరణకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. -
నేల పొరల్లోనే గంగమ్మ!
వానాకాలం ప్రారంభమై నెల దాటింది. అయినా అట్టడుగు నేల పొరలను దాటి భూగర్భజలం పైకి రావటం లేదు. ఆశించినంతగా వర్షాలు కురవకపోవడం.. భూగర్భ జలాల తోడివేత పెద్ద ఎత్తున ఉండటం వల్ల జలమట్టం పెరగడం లేదు. -
సర్వమత స్వేచ్ఛ, భావజాల వ్యాప్తికి ప్రభుత్వం సహకరిస్తుంది
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరిదని, మతసామరస్యాన్ని కాపాడడంతోపాటు సర్వమతాలకు స్వేచ్ఛ, వారి భావజాలాన్ని వివరించుకునేందుకు అవకాశం కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
మహిళలకు... పాడి పశువులు, కోళ్ల ఫారాలు
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
సంక్షిప్త వార్తలు
ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా వైద్య, ఆరోగ్యశాఖలో ఏడు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
వైభవంగా ఆషాఢ బోనాలు ప్రారంభం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. -
కొర్లపహాడ్ వద్ద ట్రామాకేర్ సెంటర్
రహదారి ప్రమాదాల్లో బాధితులకు అందించే అత్యవసర వైద్య సేవల్లో తొలిగంట(గోల్డెన్అవర్) అత్యంత కీలకం. సకాలంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. -
ప్రమాదకరంగా సామాజిక మాధ్యమ ప్రపంచం
సామాజిక మాధ్యమ ప్రపంచం క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయిందని, దీనిని నియంత్రించలేం కనుక తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలు, వీడియోలను వాటిల్లో పోస్టు చేసేటప్పుడు విచక్షణతో వ్యవహరించాలని నటుడు సాయిధరమ్తేజ్ సూచించారు. -
9 నెలలుగా జీతాలు లేవు!
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తించే బహుళవిధ కార్మికుల (మల్టీపర్పస్ వర్కర్స్) పరిస్థితి దయనీయంగా మారింది. -
నిలోఫర్లో ఎంఆర్ఐ యంత్రం లేదు
నగరంలోని నిలోఫర్ ఆసుపత్రి దేశంలోని ప్రముఖ.. పిల్లల ఆసుపత్రుల్లో ఒకటి. 1200 పడకలున్న ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం వేయి మందికి పైగా చిన్నారులకు ఓపీ చికిత్సలతో పాటు గర్భిణులకు సంక్లిష్టమైన డెలివరీలు చేస్తుంటారు. -
సైక్లిస్ట్ ఆశాకు సీఎం రేవంత్ అభినందన
కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాలవీయ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. -
డీఎస్ సేవలు మరువలేనివి
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (డీఎస్) చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ధర్మపురి శ్రీనివాస్ వివాదరహితుడు, స్నేహశీలి అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
పొలాల్లో, బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
పొలాల్లో, బీడు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
నేడు 11 జిల్లాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలో సోమవారం 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
స్నాక్స్ అంటే లొట్టలేస్తాం.. లేబుల్ చదివాకే పొట్టలోకేస్తాం
-
మెయిల్ హ్యాక్ చేసి రూ.11.4 కోట్లకు టోకరా
-
అలాంటి వారు సమాజానికి ప్రమాదకరం.. ప్రభుత్వానికి మంచు మనోజ్ విజ్ఞప్తి
-
భాజపాలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురి దుర్మరణం
-
ఓల్వో.. వసతులు వహ్వా!