- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులు
రాష్ట్రంలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నం.43) జారీ చేసింది.
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ముగిసిన పాలకవర్గాల పదవీకాలం
జడ్పీలకు నేడు జీవో
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నం.43) జారీ చేసింది. వాటికి మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేకాధికారులు కొనసాగుతారని పేర్కొంది. తెలంగాణలో మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారుల నియామకం జరగడం ఇది రెండోసారి. గతంలో 2018లో ప్రత్యేకాధికారుల నియామకం జరిగింది. అనంతరం 2019 మేలో 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. 490 మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలకు అదే ఏడాది జులై 4న ఎన్నికలు నిర్వహించారు. అదేరోజు ఎంపీపీలు, ఉపాధ్యక్షులు ప్రమాణస్వీకారం చేశారు. వారి పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లోని అన్ని మండల ప్రజాపరిషత్లతో పాటు నాగర్కర్నూల్; మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల; మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం; ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట మినహా రాష్ట్రంలోని అన్ని మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమించాలని, గురువారం నుంచి వారు బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులుగా ఎంపీడీవో కంటే ఒక ర్యాంకు పైస్థాయిలో ఉన్న జిల్లాస్థాయి అధికారులు, ఉప కలెక్టర్లు, ఆర్డీవోలను నియమించాలని.. ఇంజినీరింగ్ అధికారులను దీని నుంచి మినహాయించాలని స్పష్టం చేసింది. ఆమేరకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్లు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
జడ్పీలకు కలెక్టర్లు..
రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్ పాలకవర్గాలకు, జడ్పీటీసీలకు పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ మేరకు జడ్పీలకు జిల్లా కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జడ్పీ పాలకవర్గాలకు ఆగస్టు 6 వరకు గడువు ఉంది. వాటికి పదవీకాలం ముగిసిన తర్వాత అక్కడ ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.40 వేల కోట్ల రుణసేకరణ!
రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. -
బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతి
అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు అనుమతిస్తూ శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
సీఎం, మంత్రులకు ప్రభుత్వం ఐటీ చెల్లింపు నిబంధన రద్దు చేయండి
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పొందే వేతనానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపు నిబంధనను రద్దు చేయాలంటూ హైకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. -
ఇక్కడ వంద మందికి ఒక్క సారు.. అక్కడ విద్యార్థులే లేరు
సర్కారు విద్యావ్యవస్థలో లోపాలకు కొన్ని పాఠశాలలు అద్దం పడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోగా.. మరికొన్ని బడుల్లో అసలు విద్యార్థులు లేకపోవడంతో సార్లు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
వైద్యుల మధ్య బదిలీల ఘర్షణ
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో వైద్యుల బదిలీల అంశం సంఘాల మధ్య ఘర్షణకు దారితీసింది. శుక్రవారం వైద్య విద్య డైరెక్టరేట్(డీఎంఈ) కార్యాలయంలోనే జరిగిన దాడి ఘటన వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం రేపింది. -
ఆర్టీసీ బస్సులో భూమ్మీదకు వచ్చిన ‘మహాలక్ష్మి’..!
ఆర్టీసీ సిటీ బస్సులో ఆసుపత్రికి బయలుదేరిన గర్భిణికి మార్గం మధ్యలోనే నొప్పులు మొదలయ్యాయి. ప్రసవవేదనతో విలవిల్లాడుతుండటంతో తోటి ప్రయాణికులు మహిళా కండక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో ఫార్మా క్లస్టర్లు
హైదరాబాద్లో బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్), ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) మధ్యలో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసి, ఔషధ పరిశ్రమను ప్రోత్సహిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. -
లవ్ యూ సిరాజ్ భాయ్!
టీ20 ప్రపంచకప్-2024 విజేత భారత్ జట్టులో సభ్యుడైన సిరాజ్కు శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, క్రికెట్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. -
కోర్ బ్రాంచీల్లో చేరితే స్కాలర్షిప్
మీరు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్, డిప్లొమాలో చేరాలనుకుంటున్నారా?.. అయితే మీకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సిద్ధంగా ఉంది. -
కవిత జ్యుడిషియల్ కస్టడీ 18 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. -
తోపులాట.. వాగ్వాదం!
నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ శుక్రవారం వివిధ సంఘాలు పిలుపునిచ్చిన టీజీపీఎస్సీ ముట్టడి పోలీసు పహారాలో తోపులాటలు, వాగ్వాదాల మధ్య కొనసాగింది. -
మేడిగడ్డ ఇసుక తవ్వకాలకు గుత్తేదారుల పోటాపోటీ
మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలో ఇసుక తవ్వితీసేందుకు గుత్తేదారులు పెద్దసంఖ్యలో బిడ్లు దాఖలు చేశారు. 14 బ్లాక్లకుగాను మొత్తం 383 బిడ్లు వచ్చాయి. -
జాతీయ రహదారులకు రూ.3,834 కోట్లు
రాష్ట్రంలోని జాతీయ రహదారుల పటిష్ఠం, మరమ్మతులకు కేంద్రం రూ.3,834 కోట్లు కేటాయించింది. పలు రహదారుల విస్తరణ, బైపాస్రోడ్లు, వంతెనల భద్రతకు ఈ నిధులు మంజూరు చేసేందుకు వీలుగా 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక ప్రణాళికలో చేర్చినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. -
మాది పరిశ్రమల ఫ్రెండ్లీ సర్కారు
ప్రపంచంలోనే రాష్ట్రాన్ని స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. -
2030 నాటికి 2.4 కోట్లకు గిగ్ కార్మికులు
డిజిటల్ ఎకానమీలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా కోటి మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని, 2030 నాటికి వీరి సంఖ్య 2.4 కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయని కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి సుమితాదావ్రా తెలిపారు. -
ఆగస్టు 11న నీట్-పీజీ పరీక్ష
నీట్-పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) శుక్రవారం ప్రకటించింది. -
ఉద్యాన పంటల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి
పండ్లు, కూరగాయలు ఇతర ఉద్యాన పంటల సాగులో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని, ఆయా తోటల సాగుకు ఊరూరా రైతులను చైతన్యపరచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. -
శాస్త్రీయ పద్ధతిలోనే భూముల ధరల సవరణ
భూముల బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ మార్కెట్ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ధరల సవరణ చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. -
పర్యాటక హబ్గా నల్లమల
నల్లమల ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. -
భూముల ధరల సవరణ ప్రతిపాదనలకు మరో వారం
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి మరో వారం రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి.