సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నోకియా జర్మనీ ప్రతినిధి బృందం, హెటిరో గ్రూప్‌ ప్రతినిధి బృందం, ఇండియన్‌ పారాసైక్లింగ్‌ టీమ్‌ మంగళవారం వేర్వేరుగా కలిశాయి.

Updated : 03 Jul 2024 04:09 IST

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిలను సన్మానించిన హెటిరో గ్రూప్‌ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి, సంస్థ ప్రతినిధులు

చివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నోకియా జర్మనీ ప్రతినిధి బృందం, హెటిరో గ్రూప్‌ ప్రతినిధి బృందం, ఇండియన్‌ పారాసైక్లింగ్‌ టీమ్‌ మంగళవారం వేర్వేరుగా కలిశాయి. ఆయా భేటీల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హెటిరో గ్రూప్‌ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పాల్గొన్నారు. నోకియా జర్మనీ బృందం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబును కూడా మర్యాదపూర్వకంగా కలిసింది. నోకియా గ్లోబల్‌ హెడ్‌ మార్టిన్, సేల్స్‌ హెడ్‌ మ్యాన్క్, గ్లోబల్‌ డైరెక్టర్‌ వెంకట్, రాజేష్, సీఎస్‌ రావు, పద్మజ తదితరులు ఉన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చిస్తున్న నోకియా జర్మనీ ప్రతినిధులు. చిత్రంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు 

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు