- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణ.. సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఆదేశాలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,
ఈనాడు, హైదరాబాద్- చింతకాని, న్యూస్టుడే: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. రైతులు పొలం పంచాయితీలతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని, కాంగ్రెస్ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా రైతు ప్రభాకర్ అంత్యక్రియలు ఆయన సొంత గ్రామంలో పోలీసు బందోబస్తు మధ్య జరిగాయి. ఈ ఘటనపై మృతుని తండ్రి వీరభద్రయ్య ఫిర్యాదు మేరకు పది మందిపై ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. -
25 లక్షల ఇళ్లు ఇవ్వండి
సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఇదీ సంగతి!
-
కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షాలను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రధానమంత్రిని, -
కాళేశ్వరం విచారణలో జోక్యం చేసుకోం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ విచారణతోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.సి.ఘోష్ నేతృత్వంలోనూ న్యాయ విచారణ జరుగుతోందని, ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. -
ఈ ఏడాది పూర్తయ్యే నిర్మాణాలకే పెద్దపీట!
ఈ ఏడాది పనులు పూర్తయ్యి, ఆయకట్టుకు సాగునీరు అందించగల ప్రాజెక్టుల నిర్మాణాలకు బడ్జెట్లో పెద్దపీట వేసేందుకు నీటిపారుదలశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. -
ఒకే కారణంతో పలుమార్లు రిజిస్ట్రేషన్లు తిరస్కరించడం సరికాదు
న్యాయస్థానం ఒకసారి యథాతథ స్థితి లేదా స్టే ఉత్తర్వులు జారీ చేసిన కేసుల్లో.. ఆ తర్వాత ఆ ఉత్తర్వులను కోర్టు రద్దు చేసినా, సవరించినా.. వాటిపై ఎలాంటి అప్పీళ్లు పెండింగ్లో లేనప్పుడు రిజిస్ట్రేషన్లను తిరస్కరించడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
200 ఇంజినీరింగ్ కళాశాలలకు పచ్చజెండా
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది. -
రెండేళ్లలో 10 వేల నాన్ ఏసీ కోచ్ల తయారీ
రైళ్లలో నాన్ ఏసీ కోచ్ల ఉత్పత్తిని వేగవంతం చేసినట్లు.. రెండేళ్లలో 10 వేల కోచ్ల ఉత్పత్తికి ప్రణాళిక చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇందులో 5,300 జనరల్ కోచ్లు ఉంటాయని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
పురపాలికల్లో పొరుగు సేవల సిబ్బందికి మళ్లీ విధులు!
రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్ల విధుల నుంచి తొలగించిన పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు ఆ శాఖ సిద్ధమవుతోంది. -
ఏడో బ్లాక్ సమస్యలపై అప్రమత్తం
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి వరద పెరుగుతుండడంతో ఏడో బ్లాక్లో మళ్లీ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. తాత్కాలిక మరమ్మతు పనుల్లో కొంతమేర ఇబ్బంది తలెత్తినట్లు తెలిసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 465 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉదయశ్రీ, -
తమిళనాడులో ‘రూ.లక్ష వరకూ ఉచిత వైద్యం’పై అధ్యయనం
ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు అందుబాటులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్ష వరకు ఉచితంగా అత్యవసర వైద్య సేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
వరద నుంచి వరంగల్కు విముక్తి కల్పిస్తాం
వరద ముంపు సమస్య నుంచి వరంగల్ నగరానికి విముక్తి కలిగేలా అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూశాఖ, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
విప్లవ పోరాటాల అణచివేతకు కేంద్రం కుట్ర: విరసం
దండకారణ్యంలో విప్లవ పోరాటాలతోపాటు ప్రజాసంఘాలను అణచివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విరసం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ ఆరోపించారు. -
ఐటీలో ఓరుగల్లుకు పెద్దపీట
ఐటీ రంగంలో ఓరుగల్లుకు పెద్దపీట వేసి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
సహకార రంగాన్ని బలోపేతం చేస్తాం: తుమ్మల
తెలంగాణలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసి, సేవలను విస్తరిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల సంఖ్యను పెంచుతామన్నారు. -
మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించండి
‘‘రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిపాలన అవసరాల దృష్ట్యా మరో 29 పోస్టులు కేటాయించండి’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్షాను కోరారు. -
లాభమా? నష్టమా?
ఒక సంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఒకరు అధిక పింఛను కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశారు. దాన్ని పరిశీలించిన ఈపీఎఫ్వో ఆయనకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఈపీఎస్కు బకాయిల కింద రూ.21 లక్షలు కట్టాలని అందులో పేర్కొంది. -
మొత్తం పోస్టులా? పనిచేస్తున్న వారి సంఖ్యా?
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలపై స్పష్టత కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో.. వైద్య, ఆరోగ్యశాఖలో ఎలా అమలు చేస్తారన్న అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. -
‘సీఎస్ఈ సీట్లు ఇలా పెంచితే ఎలా..’
రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్లను ఏటేటా విపరీతంగా పెంచడం మంచిది కాదని, ఇది భవిష్యత్తులో పలు విపరిణామాలకు దారితీస్తుందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి జేఎన్టీయూహెచ్ గురువారం లేఖ రాసింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
-
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
-
‘అంతా మీరే చేశారు’.. కాదు మీ వల్లే జిల్లాలో పార్టీ నాశనమైంది
-
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
-
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
-
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ