- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
వచ్చే మూడు నెలల్లో రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు
పంట రుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు వెచ్చించనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
వ్యవసాయ మంత్రి తుమ్మల
సమీకృత ప్రయోగశాలల సముదాయ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రఘునందన్రావు తదితరులు
ఈనాడు, హైదరాబాద్: పంట రుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు వెచ్చించనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. మంగళవారం రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలనూ అమలుచేస్తాం. ఈ సీజన్లో రాష్ట్రమంతటా విత్తనాల సరఫరా బాగున్నప్పటికీ ఒకటి రెండు కంపెనీల విత్తనాల విషయంలో కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు తలెత్తాయి. వ్యవసాయ, ఉద్యాన అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలి. పెండింగ్లో ఉన్న రైతుబీమా క్లెయిమ్లను పరిష్కరించాలి. ఆయిల్పామ్ ప్రాజెక్టుపై క్షేత్రస్థాయిలో సమన్వయం లేదు. శాస్త్రవేత్తలు, అధికారులు బృందంగా వారానికి రెండు మండలాలు సందర్శించి సలహాలివ్వాలి. ఉద్యాన పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలి’’ అని మంత్రి సూచించారు. రాజేంద్రనగర్లో నూతనంగా నిర్మించిన సమీకృత ప్రయోగశాలల భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఇక్కడ ఎరువుల నాణ్యత ప్రయోగశాలలో ఏటా 6,000 నమూనాలు, విత్తన ప్రయోగశాలలో 8,000, భూసార పరీక్ష కేంద్రంలో 20,000 నమూనాలు పరీక్షించే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విలీన గ్రామాలను భద్రాచలం మండలంలో కలపాలి
సీఎం రేవంత్కు తుమ్మల లేఖ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామాలను తిరిగి భద్రాచలం మండలంలో కలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు లేఖ రాశారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారు. భద్రాచలం పట్టణ శివారు నుంచి ఏపీలో విలీనమవడంతో డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేదు. అంతర్ రాష్ట్ర సరిహద్దు సమస్యలు, రవాణా, పాలనకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ ఐదు గ్రామాల వారు తెలంగాణలో కలపాలని తీర్మానాలు చేశారు. ఈ నెల ఆరో తేదీన భేటీ దృష్ట్యా ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలన సౌలభ్యం, ప్రజాసంక్షేమం కోసం ఐదు గ్రామాలను భద్రాచలం మండలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలి’’ అని తుమ్మల కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. -
25 లక్షల ఇళ్లు ఇవ్వండి
సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఇదీ సంగతి!
-
కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షాలను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రధానమంత్రిని, -
కాళేశ్వరం విచారణలో జోక్యం చేసుకోం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ విచారణతోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.సి.ఘోష్ నేతృత్వంలోనూ న్యాయ విచారణ జరుగుతోందని, ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. -
ఈ ఏడాది పూర్తయ్యే నిర్మాణాలకే పెద్దపీట!
ఈ ఏడాది పనులు పూర్తయ్యి, ఆయకట్టుకు సాగునీరు అందించగల ప్రాజెక్టుల నిర్మాణాలకు బడ్జెట్లో పెద్దపీట వేసేందుకు నీటిపారుదలశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. -
ఒకే కారణంతో పలుమార్లు రిజిస్ట్రేషన్లు తిరస్కరించడం సరికాదు
న్యాయస్థానం ఒకసారి యథాతథ స్థితి లేదా స్టే ఉత్తర్వులు జారీ చేసిన కేసుల్లో.. ఆ తర్వాత ఆ ఉత్తర్వులను కోర్టు రద్దు చేసినా, సవరించినా.. వాటిపై ఎలాంటి అప్పీళ్లు పెండింగ్లో లేనప్పుడు రిజిస్ట్రేషన్లను తిరస్కరించడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
200 ఇంజినీరింగ్ కళాశాలలకు పచ్చజెండా
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను అందించే 200 విద్యాసంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి జారీ చేసింది. -
రెండేళ్లలో 10 వేల నాన్ ఏసీ కోచ్ల తయారీ
రైళ్లలో నాన్ ఏసీ కోచ్ల ఉత్పత్తిని వేగవంతం చేసినట్లు.. రెండేళ్లలో 10 వేల కోచ్ల ఉత్పత్తికి ప్రణాళిక చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇందులో 5,300 జనరల్ కోచ్లు ఉంటాయని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
పురపాలికల్లో పొరుగు సేవల సిబ్బందికి మళ్లీ విధులు!
రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్ల విధుల నుంచి తొలగించిన పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు ఆ శాఖ సిద్ధమవుతోంది. -
ఏడో బ్లాక్ సమస్యలపై అప్రమత్తం
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి వరద పెరుగుతుండడంతో ఏడో బ్లాక్లో మళ్లీ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. తాత్కాలిక మరమ్మతు పనుల్లో కొంతమేర ఇబ్బంది తలెత్తినట్లు తెలిసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 465 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉదయశ్రీ, -
తమిళనాడులో ‘రూ.లక్ష వరకూ ఉచిత వైద్యం’పై అధ్యయనం
ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు అందుబాటులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్ష వరకు ఉచితంగా అత్యవసర వైద్య సేవలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
వరద నుంచి వరంగల్కు విముక్తి కల్పిస్తాం
వరద ముంపు సమస్య నుంచి వరంగల్ నగరానికి విముక్తి కలిగేలా అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూశాఖ, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
విప్లవ పోరాటాల అణచివేతకు కేంద్రం కుట్ర: విరసం
దండకారణ్యంలో విప్లవ పోరాటాలతోపాటు ప్రజాసంఘాలను అణచివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విరసం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ ఆరోపించారు. -
ఐటీలో ఓరుగల్లుకు పెద్దపీట
ఐటీ రంగంలో ఓరుగల్లుకు పెద్దపీట వేసి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
సహకార రంగాన్ని బలోపేతం చేస్తాం: తుమ్మల
తెలంగాణలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసి, సేవలను విస్తరిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల సంఖ్యను పెంచుతామన్నారు. -
మరో 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించండి
‘‘రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిపాలన అవసరాల దృష్ట్యా మరో 29 పోస్టులు కేటాయించండి’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్షాను కోరారు. -
లాభమా? నష్టమా?
ఒక సంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఒకరు అధిక పింఛను కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశారు. దాన్ని పరిశీలించిన ఈపీఎఫ్వో ఆయనకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఈపీఎస్కు బకాయిల కింద రూ.21 లక్షలు కట్టాలని అందులో పేర్కొంది. -
మొత్తం పోస్టులా? పనిచేస్తున్న వారి సంఖ్యా?
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలపై స్పష్టత కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో.. వైద్య, ఆరోగ్యశాఖలో ఎలా అమలు చేస్తారన్న అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. -
‘సీఎస్ఈ సీట్లు ఇలా పెంచితే ఎలా..’
రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్లను ఏటేటా విపరీతంగా పెంచడం మంచిది కాదని, ఇది భవిష్యత్తులో పలు విపరిణామాలకు దారితీస్తుందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి జేఎన్టీయూహెచ్ గురువారం లేఖ రాసింది.