- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.
రెండు రోజుల్లో తేదీలపై స్పష్టత
ఈనాడు, హైదరాబాద్: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఎన్ఎంసీ ఒకటి, రెండు రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలపై స్పష్టత ఇస్తుందని పేర్కొంటున్నాయి. కొందరికి నీట్-యూజీ పరీక్ష మళ్లీ నిర్వహించడం, ఫలితాలు వెల్లడించడంతోపాటు అందరికీ కొత్త ర్యాంకులను ఇచ్చిన అంశాన్ని ఎన్టీఏ సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉండనుంది. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు అయితే తప్ప రాష్ట్రాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కుదరదు. కాళోజీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర విద్యార్థుల ర్యాంకుల వివరాలు అందాల్సి ఉంది. అవి అందడానికి పది రోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే కౌన్సెలింగ్ తేదీలు ఖరారవుతాయని కాళోజీ వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. -
కొత్త బీటెక్ సీట్లు 20,500
రాష్ట్రంలో డిమాండ్ ఉన్న బీటెక్ సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అదీ... కేవలం జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లో మాత్రమే. -
ఇదీ సంగతి!
-
వినూత్న ఆలోచనలతో ముందుకు రండి
వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు. -
టీజీఎస్ఆర్టీసీలో 3,035 కొలువులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. -
అలాగే.. 6న కలుద్దాం
విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
బర్డ్ వాచింగ్.. నైట్ క్యాంపింగ్.. మధ్యలో బోటింగ్!
పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన కొండలు.. చెంతనే గలగల ప్రవాహాలు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో.. చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. ఆ ఆనంద పారవశ్యమే వేరు కదూ..! -
డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు
డబ్బులిచ్చి కోరుకున్న పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. అలాంటివారిని ఎవరూ కాపాడలేరని.. ఏసీబీ, విజిలెన్స్ వెంటాడుతాయని స్పష్టంచేశారు. -
తమిళనాడులో ముగిసిన తెలంగాణ అధికారుల అధ్యయనం
తమిళనాడులోని రవాణా విధానాలపై తెలంగాణ అధికారుల రెండు రోజుల అధ్యయనం మంగళవారం ముగిసింది. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా అధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, -
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ముట్టడి
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 700 మంది అలైడ్ హెల్త్సైన్స్ విద్యార్థులు మంగళవారం వరంగల్లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ముట్టడించారు. -
సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని నోకియా జర్మనీ ప్రతినిధి బృందం, హెటిరో గ్రూప్ ప్రతినిధి బృందం, ఇండియన్ పారాసైక్లింగ్ టీమ్ మంగళవారం వేర్వేరుగా కలిశాయి. -
గవర్నర్తో శాసన సభాపతి, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ
రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను రాజ్భవన్లో మంగళవారం శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
పరిహారంతో సరిపెట్టడంకాదు.. విధానాలు రూపొందించాలి
కుక్క కాటుతో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు సూచించింది. -
మందుల కొరత ఉండొద్దు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. -
టీజీపీఎస్సీని స్వచ్ఛంగా తీర్చిదిద్దాం
గత ప్రభుత్వ హయాంలో కలుషితమైన టీఎస్పీఎస్సీ(ప్రస్తుత టీజీపీఎస్సీ)ని స్వచ్ఛమైన బంగారంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్ది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
దేవాదాయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
‘భూముల పరిరక్షణ, అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. -
సంక్షిప్త వార్తలు (14)
రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్లో 5.2, నర్సాపూర్లో 4.7, పాత మంచిర్యాలలో 3.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణ.. సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఆదేశాలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, -
వచ్చే మూడు నెలల్లో రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు
పంట రుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు వెచ్చించనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో సమస్యలపై పోర్టల్
రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అనంతరం ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నారు. -
సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్ ప్రారంభం
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ నిధులను వినియోగించాలని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు