యువ ఐపీఎస్‌లకు స్థానచలనం

యువ ఐపీఎస్‌లు (2020-21 బ్యాచ్‌) 8 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Published : 02 Jul 2024 04:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: యువ ఐపీఎస్‌లు (2020-21 బ్యాచ్‌) 8 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. భద్రాచలం ఏఎస్పీగా ఉన్న పరితోష్‌ పంకజ్‌ను కొత్తగూడెం ఓఎస్డీగా.. ఏటూరునాగారం ఏఎస్పీ గీతేమహేశ్‌ బాబాసాహెబ్‌ను ములుగు ఓఎస్డీగా.. నిర్మల్‌ జిల్లా భైంసా ఏఎస్పీ పాటిల్‌కాంతిలాల్‌ సుభాష్‌ను హైదరాబాద్‌ సౌత్‌ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా.. జనగామ ఏఎస్పీ అంకిత్‌కుమార్‌ శంక్వార్‌ను భద్రాచలం ఏఎస్పీగా నియమించారు. గ్రేహౌండ్స్‌లో అసాల్ట్‌ కమాండర్లుగా పనిచేసిన అవినాశ్‌కుమార్‌ను భైంసా ఏఎస్పీగా.. శేషాద్రినీరెడ్డిని వేములవాడ ఏఎస్పీగా.. శివం ఉపాధ్యాయను ఏటూరునాగారం ఏఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. గవర్నర్‌కు ఏడీసీగా పనిచేసిన సిరిశెట్టి సంకీర్త్‌ను అదే పోస్టులో ఓఎస్డీ హోదాలో నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని