- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు (8)
ఎయిర్ఫోర్స్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధ్యక్షుడిగా విశ్రాంత గ్రూపు కెప్టెన్ పెమ్మసాని రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు.
ఎయిర్ఫోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పీఆర్ ప్రసాద్
ఈనాడు, హైదరాబాద్: ఎయిర్ఫోర్స్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధ్యక్షుడిగా విశ్రాంత గ్రూపు కెప్టెన్ పెమ్మసాని రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. జాతీయ ఎయిర్ఫోర్స్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎయిర్ మార్షల్ జగ్జీత్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఎయిర్ఫోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పీఆర్ ప్రసాద్ జులై 1, 2024 నుంచి జూన్ 30, 2027 వరకు కొనసాగనున్నారు. గుంటూరు జిల్లా వెంకటపాలెం గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా శ్రీనగర్లోని అవంతీపూర్, అసోం, మేఘాలయ, దిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ప్రభుత్వ సలహాదారుగా శ్రీనివాసరాజు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ఎస్.శ్రీనివాసరాజును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల రూపకల్పన, అమలుతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం కింద చేపట్టే ప్రాజెక్టులను పర్యవేక్షిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వన మహోత్సవం ప్రణాళిక రూపొందించండి: సురేఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి అమలు చేయనున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్, పీసీబీ సభ్య కార్యదర్శిగా జి.రవి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం వారు మంత్రి సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
డిస్కంలో నలుగురు ఎస్ఈల బదిలీ
ఈనాడు, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ డిస్కంలో పనిచేస్తున్న నలుగురు పర్యవేక్షక ఇంజినీర్(ఎస్ఈ)లను పరిపాలనా కారణాలతో బదిలీ చేస్తూ సీఎండీ ముషారఫ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్ఈ పి.వి.రమేశ్ను మహబూబ్నగర్కు, హైదరాబాద్ సెంట్రల్ విభాగం ఎస్ఈ బ్రహ్మంను హబ్సిగూడకు, సిద్దిపేట జిల్లా ఎస్ఈ మోహన్రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ విభాగానికి, హైదరాబాద్ దక్షిణ విభాగం ఎస్ఈ ఖాజా అబ్దుల్ రహమాన్ను ప్రధాన కార్యాలయానికి బదిలీచేసినట్లు సీఎండీ తెలిపారు.
పవర్గ్రిడ్ దక్షిణ భారత సీజీఎంగా అఖిలేష్
ఈనాడు, హైదరాబాద్: జాతీయ పవర్గ్రిడ్ సంస్థ దక్షిణ భారత రాష్ట్రాల చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం)గా అఖిలేష్ పాఠక్ సోమవారం బాధ్యతలు స్వీకరించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలలో పవర్గ్రిడ్ విద్యుత్ లైన్ల వ్యవహారాలను ఆయన పర్యవేక్షించనున్నారు.
ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే పనులకు ప్రాధాన్యం
ఈనాడు, హైదరాబాద్: ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టుల నిర్మాణాలకు ఈ ఏడాది ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఆమేరకు ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులపై సీఈలు అంచనాలు తయారు చేస్తున్నారు. శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం వనపర్తి, నాగర్కర్నూల్, గజ్వేల్, సంగారెడ్డి, రామగుండం, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్నగర్ సర్కిళ్ల సీఈలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రాధాన్యం కింద గుర్తించిన ప్రాజెక్టుల పూర్తికి కేటాయింపుల అంచనాలు పంపేందుకు సీఈలకు ప్రత్యేకంగా నమూనాను అందజేశారు. 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసేందుకు వీలుగా ప్రతిపాదనల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరిచ్చే నిర్మాణాలకు సైతం పెద్దపీట వేస్తున్నారు. మంగళవారం మరికొన్ని సర్కిళ్ల సీఈలతో సమీక్ష జరగనుంది.
ఎక్సైజ్ అధికారులకు కొత్త చట్టాలపై అవగాహన
ఈనాడు, హైదరాబాద్: నార్కొటిక్ డ్రగ్స్ (ఎన్డీపీఎస్) చట్టంలో సంతరించుకున్న మార్పులపై ఎక్సైజ్ అధికారులకు సోమవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీజీన్యాబ్) డైరెక్టర్ సందీప్శాండిల్య, ఇతర నిపుణులు జూమ్ యాప్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడే సెక్షన్లతో నమోదయ్యే కేసుల దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాంటి కేసుల్లో వాంగ్మూలాల నమోదును వీడియోగ్రఫీ తీసి న్యాయస్థానానికి సమర్పించడంపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణలో జీహెచ్ఎంసీ పరిధిలోని 139 ఎక్సైజ్ స్టేషన్ల ఎస్హెచ్వోలతోపాటు ఎస్టీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి శిక్షణను పర్యవేక్షించారు.
జంతు నిర్వహణ నిబంధనల అమలుపై హైకోర్టు నోటీసులు
ఈనాడు, హైదరాబాద్: జంతువుల రవాణాకు, వాటి నిర్వహణకు సంబంధించి 2017లో రూపొందించిన నిబంధనల అమలుపై ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. పశువులు, జంతువుల రవాణా సమయంలో నిబంధనలను అమలు చేయడంలేదంటూ అందిన లేఖను న్యాయస్థానం ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నిబంధనల అమలుపై వివరణ ఇవ్వాలంటూ హోం, రవాణా, పశుసంవర్ధక శాఖల ముఖ్యకార్యదర్శులు, డీజీపీ, రవాణాశాఖ కమిషనర్, జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమే, అలాగని కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఎలాగంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. -
నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
వరంగల్లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ (ఈసీఈ) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. -
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశించేందుకు ఎప్సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్!
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా... రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం (హెల్త్ ప్రొఫైల్) సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. -
పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో వనరులు అనేకం
రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని.. ఆరు నెలల్లోనే పురోగతి సాధిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది. -
ఇదీ సంగతి!
ఇదీ సంగతి! -
వరదనీటి చేరికతో వడివడిగా గోదావరి
వానాకాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక నదులు, నీరు లేక చెరువులు వెలవెలబోయాయి. గోదావరిలో ఇసుక మేటలు తేలాయి. -
నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
నేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
శస్త్రచికిత్స అవసరం లేకుండానే..దెబ్బతిన్న మోకాలి భాగం తిరిగి అమరిక
శస్త్రచికిత్స అవసరం లేకుండానే 40 సంవత్సరాల వ్యక్తికి మోకాలిలో దెబ్బతిన్న భాగాన్ని తిరిగి అమర్చిన అరుదైన చికిత్సను హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. -
నాలుగు జిల్లాలకే సగం ‘బాసర’ సీట్లు
బాసర ఆర్జీయూకేటీలోని మొత్తం సీట్లలో సగం నాలుగు జిల్లాల విద్యార్థులే దక్కించుకున్నారు. ఆ వర్సిటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదివేందుకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికైన విద్యార్థుల ప్రాథమిక జాబితాను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇన్ఛార్జి ఉపకులపతి వి.వెంకటరమణ, వర్సిటీ అధికారులు బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. -
శిక్షణ ఇచ్చి ఖైదీల్లో మార్పు తెచ్చాం
తెలిసో తెలియకో తప్పుచేసి కారాగారానికి వచ్చిన ఖైదీలకు శిక్షకు బదులు.. శిక్షణ ఇచ్చి మార్పు తీసుకొచ్చామని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్ర తెలిపారు. -
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బ్యాంకు లాకర్లు తెరిచిన ఈడీ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం తెరిచారు. -
కళ్లెదుటే తిరుగుతున్నా సమన్లు అందించలేరా!
ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ జరుగుతున్న తీరుపై బుధవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్కు ప్రత్యామ్నాయం సూచించండి
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు గాను నమూనాల సేకరణకు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భారీగా నీరు, ఇసుక బయటకు వస్తుండటంతో పరీక్షలను నిలిపివేశామని.. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో సూచించాలని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)ని నీటిపారుదలశాఖ కోరింది. -
ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ వర్సిటీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయండి
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ సెంటర్ను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని కోరారు. -
మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులు
రాష్ట్రంలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నం.43) జారీ చేసింది. -
ప్రభుత్వాసుపత్రుల్లోని ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
సంక్షేమ కార్పొరేషన్లలో సిబ్బంది ఎంతమంది?
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం కొత్తగా ప్రకటించిన 16 కార్పొరేషన్లు, బోర్డులు, సమాఖ్యలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్