క్రీడాకారులకు సీఎం అభినందన

ఎయిర్‌ గన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్‌ రైఫిల్‌ అండ్‌ పిస్టల్‌ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు.

Published : 02 Jul 2024 06:09 IST

క్రీడాకారులను అభినందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కొండా సురేఖ, సుధారాణి తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎయిర్‌ గన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్‌ రైఫిల్‌ అండ్‌ పిస్టల్‌ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. సోమవారం మంత్రి కొండా సురేఖ, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణితో కలిసి సచివాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసారు. రైఫిల్‌ అండ్‌ పిస్టల్‌ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిపై సీఎం ప్రశంసలు కురిపించారు. పట్టుదలతో ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తాను చాటాలని సీఎం వారిని ప్రోత్సహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని