- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి.
శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో మళ్లీ పాడైన 4వ యూనిట్
రూ.68 కోట్లతో మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం
ఆ గుత్తేదారు కంపెనీని బ్లాక్లిస్ట్లో పెట్టిన జెన్కో
కొత్తగా టెండర్లు పిలిచినా ఈ వానాకాలంలో ఉత్పత్తి కష్టమే
ఈనాడు - హైదరాబాద్
శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పాడైన 4వ యూనిట్
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒక్కోదాని స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 150 మెగావాట్లు. అగ్నిప్రమాదంతో 2020లో ఈ ప్లాంటులో 4వ యూనిట్ కాలిపోయింది. మొత్తం రూ.68 కోట్లతో మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2022లో తిరిగి కరెంటు ఉత్పత్తి ప్రారంభించినా..80 గంటలు పనిచేశాక వైండింగ్ కాలిపోయింది. ఏడాదిలోగా పాడైతే మరమ్మతులు చేసిన గుత్తేదారు కంపెనీనే ఉచితంగా రిపేరు చేసి ఇవ్వాలనే ఒప్పందంతో పనులు అప్పగించారు. కానీ తాము బాగు చేసిన తరవాత వెంటనే ఉత్పత్తి ప్రారంభించకుండా ఆలస్యంగా ఆన్ చేసినందున తిరిగి వైండింగ్ ఉచితంగా చేసి ఇవ్వలేం అని కాంట్రాక్టు కంపెనీ సతాయించింది. ఎలాగైనా ఉచితంగా చేయించాలని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆరునెలలుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ కంపెనీని బ్లాక్లిస్ట్లో పెడుతూ జెన్కో తాజాగా ఆదేశాలిచ్చింది. మళ్లీ రిపేరు చేయాలంటే రూ.2 కోట్ల వరకూ వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా.
వార్షిక మరమ్మతులు వేసవిలోనే పూర్తిచేసి ఉంటే...
సాధారణంగా జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో జులై నుంచి డిసెంబరు దాకా కరెంటును ఉత్పత్తి చేయడం ఆనవాయితీ. గతేడాది(2023)లో వర్షాలు లేక శ్రీశైలం జలవిద్యుత్కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి సాధ్యం కాలేదు. ఆ పరిస్థితుల్ని వినియోగించుకుని మరమ్మతులు చేసి ఉంటే ఇప్పుడు వర్షాకాలంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి అవకాశం ఉండేది. ఇప్పుడు దాదాపుగా ఆ అవకాశం లేకుండా పోయింది. వెంటనే టెండర్లు పిలిచి కొత్త గుత్తేదారుకు పనులు అప్పగించాలని విద్యుత్శాఖ మంత్రి భట్టి విక్రమార్క జెన్కో అధికారులను ఆదేశించారు. ఇంతకాలం జెన్కో సీఎండీగా ఉన్న రిజ్వీని ప్రభుత్వం బదిలీ చేయడంతో బుధవారం ఇన్ఛార్జి సీఎండీగా రొనాల్డ్రాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మళ్లీ పనులన్నీ పరిశీలించి.. టెండర్లు పిలిచి.. కాంట్రాక్టు అప్పగించి.. పనులు చేయించేసరికి కనీసం 2 నెలలకు పైగా సమయం పడుతుందని విద్యుత్ ఇంజినీర్ల అంచనా. ఆ పరిస్థితుల్లో 4వ యూనిట్లో విద్యుదుత్పత్తి కష్టమేనని వారు భావిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో సైతం 120 మెగావాట్ల యూనిట్ రిపేరు చేయాల్సి ఉంది. వార్షిక మరమ్మతులు వేసవిలోనే చకచకా పూర్తిచేసి ఉంటే ప్రస్తుత వానాకాలంలో పూర్తిస్థాయిలో కరెంటు ఉత్పత్తి జరిగేది. రాష్ట్రంలో కరెంటు కొరత కారణంగా డిమాండు ఉన్న సమయంలో ఒక్కో యూనిట్ను ఇంధన ఎక్స్ఛేంజీలో రూ.6 నుంచి రూ.10 వరకూ వెచ్చించి డిస్కంలు కొంటున్నాయి. గతేడాది(2023-24) వరదలు లేక కేవలం 1,500 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తి జరిగింది. అంతకుముందు ఏడాది(2022-23)లో తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 6,500 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్రావుకు భాగమున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్!
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా... రాష్ట్రంలోని ప్రజలందరి సమగ్ర ఆరోగ్య సమాచారం (హెల్త్ ప్రొఫైల్) సేకరించేందుకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. -
పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో వనరులు అనేకం
రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని.. ఆరు నెలల్లోనే పురోగతి సాధిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలుచేయాలని స్పష్టం చేసింది. -
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమే, అలాగని కార్యాలయాలకు ఆలస్యంగా వస్తే ఎలాగంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. -
ఇదీ సంగతి!
ఇదీ సంగతి! -
వరదనీటి చేరికతో వడివడిగా గోదావరి
వానాకాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక నదులు, నీరు లేక చెరువులు వెలవెలబోయాయి. గోదావరిలో ఇసుక మేటలు తేలాయి. -
నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
వరంగల్లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ (ఈసీఈ) విద్యార్థి రవిషాకు రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
నేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
శస్త్రచికిత్స అవసరం లేకుండానే..దెబ్బతిన్న మోకాలి భాగం తిరిగి అమరిక
శస్త్రచికిత్స అవసరం లేకుండానే 40 సంవత్సరాల వ్యక్తికి మోకాలిలో దెబ్బతిన్న భాగాన్ని తిరిగి అమర్చిన అరుదైన చికిత్సను హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. -
నాలుగు జిల్లాలకే సగం ‘బాసర’ సీట్లు
బాసర ఆర్జీయూకేటీలోని మొత్తం సీట్లలో సగం నాలుగు జిల్లాల విద్యార్థులే దక్కించుకున్నారు. ఆ వర్సిటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదివేందుకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికైన విద్యార్థుల ప్రాథమిక జాబితాను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇన్ఛార్జి ఉపకులపతి వి.వెంకటరమణ, వర్సిటీ అధికారులు బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. -
గురువెక్కడో.. మేమూ అక్కడే
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి గురవుతారు. వారిని చుట్టుముట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. -
శిక్షణ ఇచ్చి ఖైదీల్లో మార్పు తెచ్చాం
తెలిసో తెలియకో తప్పుచేసి కారాగారానికి వచ్చిన ఖైదీలకు శిక్షకు బదులు.. శిక్షణ ఇచ్చి మార్పు తీసుకొచ్చామని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్ర తెలిపారు. -
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బ్యాంకు లాకర్లు తెరిచిన ఈడీ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం తెరిచారు. -
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశించేందుకు ఎప్సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
కళ్లెదుటే తిరుగుతున్నా సమన్లు అందించలేరా!
ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ జరుగుతున్న తీరుపై బుధవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్కు ప్రత్యామ్నాయం సూచించండి
జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు గాను నమూనాల సేకరణకు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భారీగా నీరు, ఇసుక బయటకు వస్తుండటంతో పరీక్షలను నిలిపివేశామని.. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో సూచించాలని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)ని నీటిపారుదలశాఖ కోరింది. -
ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ వర్సిటీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయండి
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ సెంటర్ను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్రాన్ని కోరారు. -
మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులు
రాష్ట్రంలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మండల ప్రజాపరిషత్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నం.43) జారీ చేసింది. -
ప్రభుత్వాసుపత్రుల్లోని ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
సంక్షేమ కార్పొరేషన్లలో సిబ్బంది ఎంతమంది?
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం కొత్తగా ప్రకటించిన 16 కార్పొరేషన్లు, బోర్డులు, సమాఖ్యలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ