- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
‘సీతారామ’లో కొనసాగుతున్న సొరంగం పనులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘సీతారామ’ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా సొరంగం తవ్వకం పనులు కొనసాగుతున్నాయి.
ఏడాదిన్నరలో 8 కి.మీ. పూర్తిచేయాలన్నది లక్ష్యం
తిరుమలాయపాలెం మండలం బీరోలు వద్ద టన్నెల్ పనులను పరిశీలిస్తున్న ఇంజినీరింగ్ అధికారి రమేశ్
ఖమ్మం-ఈనాడు-తిరుమలాయపాలెం, న్యూస్టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘సీతారామ’ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా సొరంగం తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా ఉన్న కూసుమంచి మండలంలోని ‘పాలేరు జలాశయం’ ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుకు నీరందిస్తోంది. సీతారామ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను పాలేరు జలాశయానికి చేర్చి సుమారు 2.52 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్త ఆయకట్టుకు నీరందించవచ్చన్న ఉద్దేశంతో పాలేరు లింక్ కెనాల్ నిర్మిస్తున్నారు. రూ.433 కోట్ల వ్యయంతో సీతారామ ప్రధాన కాలువ 113వ కిలోమీటరు నుంచి 75 కిలోమీటర్ల మేర ఈ పనులు చేపడుతున్నారు. ఇందులో ఆఖరి ప్యాకేజీ అయిన నం.16లో 8 కిలోమీటర్ల మేర సొరంగం కాలువ (టన్నెల్) తవ్వుతున్నారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద సొరంగం ప్రారంభమై కూసుమంచి మండలం పోచారం వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి మరో 4 కిలోమీటర్లు కాలువ తవ్వకం చేపట్టి పాలేరు జలాశయానికి అనుసంధానిస్తారు. ఎనిమిది కిలోమీటర్ల సొరంగ కాలువను గత కొన్ని రోజులుగా రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తున్నారు. దమ్మాయిగూడెం వద్ద ఇప్పటికే 420 మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. రాతిబండ కావడంతో బ్లాస్టింగ్ తప్పనిసరి అవుతోంది. 8 కి.మీ. టన్నెల్ తవ్వకం ఏడాదిన్నరలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఏడాదిలోనే పూర్తి చేసేందుకు మరో ఆడిట్ కేంద్రం(తవ్వకం పాయింట్) ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లాయి.
దమ్మాయిగూడెం వద్ద కొనసాగుతున్న సొరంగం తవ్వకం పనులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తమిళనాడులో ముగిసిన తెలంగాణ అధికారుల అధ్యయనం
తమిళనాడులోని రవాణా విధానాలపై తెలంగాణ అధికారుల రెండు రోజుల అధ్యయనం మంగళవారం ముగిసింది. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా అధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, -
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ముట్టడి
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 700 మంది అలైడ్ హెల్త్సైన్స్ విద్యార్థులు మంగళవారం వరంగల్లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ముట్టడించారు. -
సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని నోకియా జర్మనీ ప్రతినిధి బృందం, హెటిరో గ్రూప్ ప్రతినిధి బృందం, ఇండియన్ పారాసైక్లింగ్ టీమ్ మంగళవారం వేర్వేరుగా కలిశాయి. -
గవర్నర్తో శాసన సభాపతి, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ
రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను రాజ్భవన్లో మంగళవారం శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
పరిహారంతో సరిపెట్టడంకాదు.. విధానాలు రూపొందించాలి
కుక్క కాటుతో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు సూచించింది. -
కొత్త బీటెక్ సీట్లు 20,500
రాష్ట్రంలో డిమాండ్ ఉన్న బీటెక్ సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అదీ... కేవలం జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లో మాత్రమే. -
డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు
డబ్బులిచ్చి కోరుకున్న పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. అలాంటివారిని ఎవరూ కాపాడలేరని.. ఏసీబీ, విజిలెన్స్ వెంటాడుతాయని స్పష్టంచేశారు. -
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. -
మందుల కొరత ఉండొద్దు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. -
టీజీపీఎస్సీని స్వచ్ఛంగా తీర్చిదిద్దాం
గత ప్రభుత్వ హయాంలో కలుషితమైన టీఎస్పీఎస్సీ(ప్రస్తుత టీజీపీఎస్సీ)ని స్వచ్ఛమైన బంగారంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్ది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
దేవాదాయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
‘భూముల పరిరక్షణ, అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్లో 5.2, నర్సాపూర్లో 4.7, పాత మంచిర్యాలలో 3.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణ.. సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఆదేశాలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, -
వచ్చే మూడు నెలల్లో రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు
పంట రుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు వెచ్చించనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో సమస్యలపై పోర్టల్
రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అనంతరం ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నారు. -
సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్ ప్రారంభం
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ నిధులను వినియోగించాలని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వినూత్న ఆలోచనలతో ముందుకు రండి
వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు. -
అలాగే.. 6న కలుద్దాం
విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
బర్డ్ వాచింగ్.. నైట్ క్యాంపింగ్.. మధ్యలో బోటింగ్!
పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన కొండలు.. చెంతనే గలగల ప్రవాహాలు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో.. చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. ఆ ఆనంద పారవశ్యమే వేరు కదూ..! -
231 మంది ఖైదీలకు క్షమాభిక్ష
సత్ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరంతా బుధవారం జైళ్ల నుంచి విడుదల కానున్నారు. -
టీజీఎస్ఆర్టీసీలో 3,035 కొలువులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది.