- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pavuluri Krishna Chaudhary: విజ్ఞాన గని.. డా.పావులూరి కృష్ణ చౌదరి
డా.పావులూరి కృష్ణ చౌదరికి అనేక అంశాలపై పరిజ్ఞానం ఉండేదని ‘ఈనాడు’ ఎండీ కిరణ్ అన్నారు. ఆయనతో తనకు 16 ఏట నుంచే సాన్నిహిత్యం ఉందని చెప్పారు.
‘ఈనాడు’ ఎండీ కిరణ్
వృత్తిలో ఆయనది అసాధారణ నైపుణ్యం: శైలజా కిరణ్
డా.కృష్ణ చౌదరి మనవరాలు రచించిన పుస్తకావిష్కరణ
‘డా.పావులూరి కృష్ణ చౌదరి డిటర్మైండ్ టు విన్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ‘ఈనాడు’ ఎండీ కిరణ్. చిత్రంలో ఇన్కం ట్యాక్స్ విశ్రాంత కమిషనర్ జాస్తి కృష్ణకిశోర్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, డా.అపర్ణా కొడాలి, మైనేని శ్రీనివాసరావు
రాయదుర్గం, న్యూస్టుడే: డా.పావులూరి కృష్ణ చౌదరికి అనేక అంశాలపై పరిజ్ఞానం ఉండేదని ‘ఈనాడు’ ఎండీ కిరణ్ అన్నారు. ఆయనతో తనకు 16 ఏట నుంచే సాన్నిహిత్యం ఉందని చెప్పారు. కృష్ణ చౌదరి మనవరాలు డా.అపర్ణా కొడాలి రచించిన ‘డా.పావులూరి కృష్ణ చౌదరి డిటర్మైండ్ టు విన్’ అనే పుస్తకాన్ని హైదరాబాద్ మాదాపూర్లోని ఓ హోటల్లో శనివారం రాత్రి కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ఆవిష్కరించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. డా.కృష్ణ చౌదరికి రాజకీయాలపై ఎంతో పరిజ్ఞానం ఉండేదన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ నుంచి ఆధునిక భారత రాజకీయాల వరకు పలు అంశాలపై విశ్లేషణలు చేసేవారని తెలిపారు. ఆయనకు తాను విద్యార్థినని... చిన్న, చిన్న అనారోగ్య సమస్యల లక్షణాలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన నుంచి తెలుసుకునేవాడినని చెప్పారు. రోగ లక్షణాలను గుర్తించడంలో కృష్ణ చౌదరిలాగే ఆయన మనవరాలు డా.అపర్ణకు మంచి నైపుణ్యం ఉందన్నారు. తన తాతపై పుస్తకం తీసుకురావడంలో ఆమె ఎంతో శ్రమించారన్నారు. శైలజా కిరణ్ మాట్లాడుతూ.. తన మామయ్య(రామోజీరావు) హోమియోపతి వైద్యంపై విశ్వాసం చూపించేవారన్నారు. కుటుంబంలో ఎవరికి బాగా లేకపోయినా కృష్ణచౌదరి వద్దకు వెళ్లేవారమని, ఆయనా తమ వద్దకు వచ్చి వైద్యసేవలు అందించేవారని తెలిపారు. తమ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారని చెప్పారు. కృష్ణచౌదరి.. వివేకం, పరిజ్ఞానం, వృత్తిలో నైపుణ్యం ఉన్న గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. తన పని చూసి.. ఇలాగే ముందుకు సాగాలని ప్రోత్సహించేవారన్నారు. డా.కృష్ణ చౌదరితో కలిసి 25 ఏళ్లపాటు ఉదయపు నడక సాగించిన మైనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జీవిత చరమాంకం వరకూ వైద్య సేవలందిస్తానని ఆయన చెప్పేవారన్నారు. పట్టుదల గల వ్యక్తి అని, విజ్ఞాన గని అని కొనియాడారు. హోమియోపతిపై ఆయన రాసిన మూడు పుస్తకాలను రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ప్రచురించారన్నారు. ఆంగ్లంలో రాసిన మరో పుస్తకాన్ని ప్రచురించాలని అపర్ణా కొడాలిని కోరారు. ఇన్కం ట్యాక్స్ విశ్రాంత కమిషనర్ జాస్తి కృష్ణకిశోర్ మాట్లాడుతూ.. డా.కృష్ణ చౌదరి ఇంటర్లో ఎంపీసీ చదివాక ఎంబీబీఎస్ చేశారన్నారు. ఓ రోగికి అల్లోపతి వైద్యంతో అనారోగ్య సమస్య తగ్గకపోవడంతో స్నేహితుడి ద్వారా హోమియోపతి వైద్యం గురించి తెలుసుకుని.. లండన్కు వెళ్లి ఆ వైద్య విధానంలో కోర్సు పూర్తి చేశారని వివరించారు. ఆయన వద్ద రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు వైద్యం చేయించుకునే వారన్నారు. రాష్ట్రంలో హోమియోపతి వైద్యవిద్య ప్రారంభించేలా చూశారని తెలిపారు. హోమియోపతి వైద్య ప్రాధాన్యాన్ని గుర్తించిన రామోజీరావు ఆదివారం ప్రత్యేక అనుబంధంలో డా.కృష్ణ చౌదరి వైద్యానికి చోటు కల్పించి ప్రోత్సహించారని చెప్పారు. రామోజీరావు, కృష్ణ చౌదరిలు తమ తమ రంగాల్లో దిగ్గజాలని కొనియాడారు. డా.అపర్ణ మాట్లాడుతూ.. కృష్ణ చౌదరి ఉత్సాహవంతుడు, కర్మయోగి అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. -
తుది దశకు మంత్రివర్గ విస్తరణ
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. -
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు ‘హైడ్రా’
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా) అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. -
ఏటా ఉద్యోగాల భర్తీ!
రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. -
కమిషన్ చట్టబద్ధమే
విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. -
నేరుగా జీపే, ఫోన్పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు
ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ పేర్కొంది. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. -
సారూ.. వెళ్లొద్దు
నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్కోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. -
క్రీడాకారులకు సీఎం అభినందన
ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. -
బొగతలో జల సవ్వడి
తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. -
వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయంపై దృష్టి
రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
తమిళనాడుకు తెలంగాణ అధికారుల బృందం
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది. -
నాకు దక్కాల్సిన స్థలం.. బంధువులు పట్టా చేసుకున్నారు!
తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు. -
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. -
7 నుంచి నేతన్న పోరుయాత్ర
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. -
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి. -
చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం
పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్