- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్ హఠాన్మరణం
భాజపా నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్(57) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఉన్నట్టుండి అస్వస్థతకు గురై కన్నుమూత
ఉట్నూరు, న్యూస్టుడే: భాజపా నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్(57) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం ఒక్కసారిగా రక్తపోటు పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గంమధ్యలో ఇచ్చోడ వద్ద మధ్యాహ్నం 12.20 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అంచెలంచెలుగా ఎదిగి..
ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం తాడిహత్నూర్కు చెందిన రమేశ్ రాఠోడ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన 1988లో తెదేపాలో చేరారు. 1995లో నార్నూరు జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 1999లో ఖానాపూర్ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2006లో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ పదవి చేపట్టారు. 2009లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. 2018లో తెరాస(ప్రస్తుత భారాస)లో చేరారు. ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత భాజపాలో చేరారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్లో భాజపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి. ఓటమి పాలయ్యారు. రమేశ్కు భార్య సుమన్ రాఠోడ్ (మాజీ ఎమ్మెల్యే), కుమారులు రితేశ్ రాఠోడ్, రాహుల్ రాఠోడ్, కుమార్తె సొనాలి ఉన్నారు. ఆయన పార్థివదేహానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఉట్నూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేశ్ రాఠోడ్ మృతిపై సీఎం రేవంత్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమేశ్ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంతాపం ప్రకటించారు.
తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. తెదేపాతో రమేష్కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ ఛైర్మన్, ఖానాపూర్ ఎమ్మెల్యేగా గిరిజన ప్రజలకు ఆయన విశేష సేవలు అందించారని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగతలో జల సవ్వడి
తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. -
వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయంపై దృష్టి
రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
తమిళనాడుకు తెలంగాణ అధికారుల బృందం
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది. -
నాకు దక్కాల్సిన స్థలం.. బంధువులు పట్టా చేసుకున్నారు!
తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు. -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. -
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. -
7 నుంచి నేతన్న పోరుయాత్ర
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. -
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి. -
చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం
పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. -
వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. -
బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట
పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
వర్సిటీల్లో సదుపాయాలు కల్పించండి
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను కల్పించాలని, అందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. -
యువ ఐపీఎస్లకు స్థానచలనం
యువ ఐపీఎస్లు (2020-21 బ్యాచ్) 8 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావు!
ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావని.. ఆదాయం పెంచుకోవడానికి ఆలయాలు వ్యాపార దృక్పథంతో పనిచేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. -
కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదుకు ‘ఎస్వోపీ’
రాష్ట్రంలో కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. -
నిమ్స్కు రూ.2.1 కోట్ల విరాళం
పీడియాట్రిక్ ఎపిలెప్సీ సెంటర్ స్థాపనతో పాటు వివిధ వసతుల కోసం నిమ్స్కు ‘ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్’ సంస్థ రూ.2.1 కోట్ల విరాళం అందజేసింది. -
ములుగు జిల్లాకు ‘సమ్మక్క సారలమ్మ’ పేరు!
ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (8)
ఎయిర్ఫోర్స్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధ్యక్షుడిగా విశ్రాంత గ్రూపు కెప్టెన్ పెమ్మసాని రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు.