- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సంక్షిప్త వార్తలు (8)
షాద్నగర్ సౌత్గ్లాస్ ప్రైవేటు కంపెనీ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: సీపీఎం
ఈనాడు, హైదరాబాద్: షాద్నగర్ సౌత్గ్లాస్ ప్రైవేటు కంపెనీ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున చెల్లించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
జులై 31 వరకు ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రకాల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు గడువును జులై 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
డీఓపీటీ కార్యదర్శిగా అజయ్ భల్లాకు అదనపు బాధ్యతలు
మైనార్టీ కమిషన్ కార్యదర్శిగా కె.శ్రీనివాస్
ఈనాడు, దిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్కుమార్ భల్లాకు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ(డీఓపీటీ) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాచౌహాన్ ఆదివారం పదవీ విరమణ చేస్తుండటంతో అజయ్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బాధ్యతలను ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ కార్యదర్శి సంజీవ్ చోప్డాకు అదనంగా అప్పగించారు. వ్యవసాయశాఖకు తదుపరి కార్యదర్శి నియమితులయ్యే వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. జాతీయ మైనార్టీల కమిషన్ కార్యదర్శిగా కతికితల శ్రీనివాస్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న అంజలి భావ్ర పదవీ విరమణ పొందారు.
ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా వర్షాలు
ఈనాడు, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో శనివారం 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిశాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో 5.3, జైనూరు 4.9, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి 4.6, వరంగల్ జిల్లా ఖానాపూర్ 4.5 సెం.మీ. వర్షం కురిసింది.మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లోనూ వానలు పడ్డాయి. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో జులై 1 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
ఈనాడు, అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్కు కన్వీనర్ నవ్య శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. జులై 1 నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8-12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇచ్చారు. 13న ఐచ్ఛికాల మార్పు, 16న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 17-22లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
కృష్ణా బోర్డు ఛైర్మన్గా అతుల్ జైన్
ఈనాడు, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఛైర్మన్గా అతుల్ జైన్ను నియమిస్తూ కేంద్ర జలశక్తిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జల సంఘంలో పనిచేస్తున్న జైన్కు పదోన్నతి కల్పించి.. బోర్డు ఛైర్మన్గా నియమించారు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న శివ్ నందన్ కుమార్ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు.
విద్యుత్పై విచారణ కమిషన్ గడువు పొడిగింపు!
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్పై జస్టిస్ నరసింహారెడ్డి ఛైర్మన్గా ఉన్న విచారణ కమిషన్ గడువును మరో నెల రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కమిషన్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించిన గడువు నేటి(ఈ నెల 30)తో ముగియనుండగా విచారణ పూర్తికానందున గడువును పొడిగించాలని ప్రభుత్వానికి రాష్ట్ర ఇంధనశాఖ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. నేడో, రేపో ఉత్తర్వులు జారీకానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
నీట్ రద్దు కోరుతూ రేపు ‘చలో రాజ్భవన్’
విద్యార్థి, యువజన సంఘాల ఐకాస పిలుపు
నల్లకుంట, న్యూస్టుడే: నీట్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో.. సంబంధిత ఫలితాలను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా జులై 1న ‘చలో రాజ్భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేశ్ అధ్యక్షతన జరిగిన ఐకాస నేతల సమావేశంలో ఎస్వీ శ్రీకాంత్(పీడీఎస్యూ), విష్ణువర్ధన్రెడ్డి(ఎన్ఎస్యూఐ), రజనీకాంత్(ఎస్ఎఫ్ఐ), అరుణ్(వీజేఎస్), ఆజాద్(పీడీఎస్యూ), జావీద్(డీవైఎఫ్ఐ), శ్రీకాంత్(ఏఐవైఎఫ్), సాగర్, ప్రదీప్(పీవైఎల్), సలీం(వైజేఎస్) తదితర నేతలు మాట్లాడారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించి తరచూ పేపర్ లీకేజీ అవుతున్నా.. నిందితులపై కఠిన చర్యలు చేపట్టడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. నీట్ను తిరిగి నిర్వహించకపోతే ఆందోళనలనూ తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. -
తుది దశకు మంత్రివర్గ విస్తరణ
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. -
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు ‘హైడ్రా’
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా) అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. -
ఏటా ఉద్యోగాల భర్తీ!
రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. -
కమిషన్ చట్టబద్ధమే
విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. -
నేరుగా జీపే, ఫోన్పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు
ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ పేర్కొంది. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. -
సారూ.. వెళ్లొద్దు
నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్కోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. -
క్రీడాకారులకు సీఎం అభినందన
ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. -
బొగతలో జల సవ్వడి
తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. -
వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయంపై దృష్టి
రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
తమిళనాడుకు తెలంగాణ అధికారుల బృందం
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది. -
నాకు దక్కాల్సిన స్థలం.. బంధువులు పట్టా చేసుకున్నారు!
తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు. -
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. -
7 నుంచి నేతన్న పోరుయాత్ర
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. -
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి. -
చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం
పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్