- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
యుద్ధప్రాతిపదికన జాతీయ రహదారుల భూసేకరణ!
జాతీయ రహదారుల నిర్మాణానికి పీటముడిగా ఉన్న భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రవాణా,
జాప్యాన్ని నియంత్రిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ
రాష్ట్రానికి త్వరలో కేంద్ర బృందం
ఈనాడు, హైదరాబాద్: జాతీయ రహదారుల నిర్మాణానికి పీటముడిగా ఉన్న భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అనుమతులిచ్చినా ఆశించిన స్థాయిలో ముందడుగు పడటం లేదు. భూసేకరణకు అధిక సమయం పడుతుండటంతో నిర్మాణ వ్యయమూ పెరిగిపోతోంది. మరోవైపు సింహభాగం భూసేకరణ పూర్తి చేసిన తరవాతే నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. భూసేకరణ కొలిక్కి రాకుండా శంకుస్థాపన చేసేది లేదని కూడా స్పష్టం చేసింది. సుమారు 949 కి.మీ. మేర 27 రహదారుల ప్రాజెక్టులను కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి మంజూరు చేసింది. మరో 1,200 కి.మీ.కు సంబంధించిన ప్రాజెక్టులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇప్పటికే మంజూరు చేసిన వాటికి జాతీయ రహదారుల హోదాను సైతం కేటాయించింది. భూసేకరణ చేయాల్సిన రెవెన్యూ అధికారులు గడిచిన ఏడాదిగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల క్రతువులో ఉండటంతో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయారు. దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల వరకు సేకరించాల్సి ఉన్నట్లు అంచనా.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీలో..
రాష్ట్రానికి సంబంధించిన రహదారుల ప్రాజెక్టుల విషయంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇటీవల దిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అవసరమైన భూమిని త్వరితంగా అప్పగిస్తే ప్రాజెక్టులను వేగంగా చేపడతామని కేంద్ర మంత్రి చెప్పగా... ‘యుద్ధప్రాతిపదికన భూసేకరణ చేపడతామని, లేనిపక్షంలో రహదారుల విషయంపై మరోసారి మీ వద్దకు రాను’ అని సీఎం స్పష్టం చేసినట్లు సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి ‘ఈనాడు’తో చెప్పారు. ఈ నేపథ్యంలో పెండింగులో ఉన్న జాతీయ రహదారుల వారీగా ఎంత భూసేకరణ చేశారు, ఇంకా ఎంత చేయాలి, ఆలస్యానికి కారణాలు తదితర అంశాలపై నివేదిక తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై సీఎం త్వరలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఇదే విషయంపై సమీక్షించేందుకు కేంద్ర అధికారుల బృందం కూడా త్వరలో రాష్ట్రానికి రానుంది. ఈ సందర్భంగా ప్రాంతీయ రింగు రోడ్డు త్రైపాక్షిక ఒప్పందానికీ తుది రూపు ఇవ్వనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి. -
చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం
పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. -
వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. -
బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట
పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
వర్సిటీల్లో సదుపాయాలు కల్పించండి
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను కల్పించాలని, అందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. -
యువ ఐపీఎస్లకు స్థానచలనం
యువ ఐపీఎస్లు (2020-21 బ్యాచ్) 8 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావు!
ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావని.. ఆదాయం పెంచుకోవడానికి ఆలయాలు వ్యాపార దృక్పథంతో పనిచేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. -
కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదుకు ‘ఎస్వోపీ’
రాష్ట్రంలో కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. -
నిమ్స్కు రూ.2.1 కోట్ల విరాళం
పీడియాట్రిక్ ఎపిలెప్సీ సెంటర్ స్థాపనతో పాటు వివిధ వసతుల కోసం నిమ్స్కు ‘ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్’ సంస్థ రూ.2.1 కోట్ల విరాళం అందజేసింది. -
ములుగు జిల్లాకు ‘సమ్మక్క సారలమ్మ’ పేరు!
ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
ఎయిర్ఫోర్స్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధ్యక్షుడిగా విశ్రాంత గ్రూపు కెప్టెన్ పెమ్మసాని రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. -
సారూ.. వెళ్లొద్దు
నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్కోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. -
క్రీడాకారులకు సీఎం అభినందన
ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. -
బొగతలో జల సవ్వడి
తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. -
వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయంపై దృష్టి
రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ నేడు
అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశం కానునున్నట్లు సమాచారం.