- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
నీట్ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా ఎంపీల ఇళ్ల ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాల నేతల యత్నం
తీవ్ర ఉద్రిక్తత..ప లువురి అరెస్టు
కిషన్రెడ్డి ఇంటి సమీపంలో అరెస్టు చేసినవారిని వాహనాల్లోకి ఎక్కిస్తున్న పోలీసులు
బర్కత్పుర, జూబ్లీహిల్స్, మేడ్చల్ రూరల్, నల్లకుంట, న్యూస్టుడే: నీట్ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా ఐకాస ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహా భాజపా ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్ నివాసాల ముట్టడికి యత్నించారు. తొలుత శుక్రవారం ఉదయం బర్కత్పుర భూమన్నలేన్లోని కిషన్రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మద్య తోపులాటలు, వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని కాచిగూడ ఠాణాకు తరలించారు. వారిలో ఎన్ఎస్యూఐ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అభిజిత్యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితీశ్రావు, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ తదితరులు ఉన్నారు.
బహిరంగలేఖ ప్రతులు చూపుతున్న బల్మూరి వెంకట్ తదితరులు
- బంజారాహిల్స్లోని భాజపా ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి నివాసం ముందు ఎన్ఎస్యూఐ ఖైరతాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి, నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు.
- నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్, ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి రాహుల్యాదవ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్ తదితరులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.
అవకతవకలపై చర్చించేందుకు సమయమివ్వాలి
నీట్ నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వాలని ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు విద్యార్థి, యువజన సంఘాల నేతలు బహిరంగ లేఖ రాశారు. అనంతరం లేఖను మెయిల్ ద్వారా ఆయన కార్యాలయానికి పంపించి, ఆ ప్రతులను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని విద్యానగర్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(ఎన్ఎస్యూఐ), మూర్తి(ఎస్ఎఫ్ఐ), పెద్దింటి రామకృష్ణ(పీడీఎస్యూ), ఎండీ జావీద్(డీవైఎఫ్ఐ) కల్లూరు ధర్మేంద్ర(ఏఐవైఎఫ్), మహేశ్(పీడీఎస్యూ), కేఎస్ ప్రదీప్(పీవైఎల్) తదితరులు మాట్లాడారు. జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నీట్పై ప్రజల్లో నమ్మకం పోయిందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్యకు దూరంచేసేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నీట్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
వసతుల్లేని వర్సిటీలు!
ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. -
తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర కీలకం
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని.. ఆయన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
10 మంది విద్యార్థులు మించితే.. ఇద్దరు టీచర్లు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు. -
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1 సెం.మీటర్లు కురిసింది. -
అరుదైన రాజనీతిజ్ఞుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడికి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా. -
నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలం
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. -
సింగరేణి.. మొక్కల గని..!
అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం సింగరేణి పరిధి రామగుండం ఏరియాలో బొగ్గు తవ్వకం తాలూకు మట్టి కుప్పలు నిండిన ప్రదేశం అంటే నమ్మగలమా. -
పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దేశం పారిశ్రామికంగా సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
చుక్ చుక్ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!
నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది. -
న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి
దేశ న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అడిగే పరిస్థితి ఉందా.. అన్న అంశంపై చర్చ జరగాలన్నారు. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు. -
విజయవాడ హైవేపై.. ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్ల ప్రారంభం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఏకంగా 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. -
కోడింగ్కు కేంద్రంగా హైదరాబాద్
కోడింగ్లో హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్ రాయదుర్గం టీహబ్లో ఆదివారం ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్వుడ్ 2024 సమిట్ (ద్వి వార్షిక సదస్సు) నిర్వహించారు. -
మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలన!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు. -
రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి లక్ష్యం రూ.18,500 కోట్లు
ఖజానాకు కీలక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం రూ.18,500 కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్దేశించింది. -
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం (ఎంపీ లాడ్స్) వ్యయం ఇకపై ఆన్లైన్ వేదికగా జరగనుంది. -
‘సీతారామ’లో కొనసాగుతున్న సొరంగం పనులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ‘సీతారామ’ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా సొరంగం తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. -
అశ్వారావుపేట యువ ఎస్సై ఆత్మహత్యాయత్నం
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను(34) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం ఠాణాకు వెళ్లిన ఆయన సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు.