- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సన్నిహితుల ఖాతాల్లోకి లంచం సొమ్ము!
గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఒక్కో యూనిట్కు రూ.2 వేలు పక్కదారి పట్టించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు ఓఎస్డీగా వ్యవహరించిన గుండమరాజు కల్యాణ్కుమార్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించిన ఏసీబీ, మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో పలు అంశాలు బహిర్గతమయ్యాయి. దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు కల్యాణ్కుమార్ లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా షీప్ రియరింగ్ డిస్ట్రిబ్యూషన్ (ఎస్ఆర్డీ) పథకాన్ని పర్యవేక్షించిన కల్యాణ్కుమార్తో పాటు మరికొందరు ఒక్కో యూనిట్కు రూ.2 వేల చొప్పున అనధికారికంగా లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలింది. నగదు బదిలీ అయిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలను విశ్లేషించడం ద్వారా కీలక ఆధారాలను సేకరించింది.
రెండు ఖాతాలకు రూ.2.5 లక్షల బదిలీ...
గొర్రెల పథకంలో రామరాజు అనే వ్యక్తి దాదాపు 380 యూనిట్లను సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈక్రమంలోనే రామరాజు వద్ద పనిచేసిన వినయ్ బ్యాంకు ఖాతాను ఏసీబీ అధికారులు పరిశీలించారు. గతేడాది నవంబరు 4న మధ్యాహ్నం 1.47 గంటలకు రామరాజు ఫోన్ చేసినట్లు తెలిసింది. రెండు ఫోన్ నంబర్లను సమకూర్చి వాటికి నగదు బదిలీ చేయాలని వినయ్కు సూచించినట్లు గుర్తించారు. ఈక్రమంలోనే వినయ్ బ్యాంకు ఖాతా ద్వారా పశుసంవర్ధకశాఖలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఫోన్నంబర్కు ఆన్లైన్లో రూ.50 వేలు బదిలీ చేసినట్లు గుర్తించారు. అలాగే కల్యాణ్ సన్నిహితుడి భార్య ఖాతాకు రూ.2 లక్షలు బదిలీ చేసినట్లు వెల్లడైంది. నగదు బదిలీ జరిగిన రోజు సదరు సన్నిహితుడు 10.59 గంటలకు కల్యాణ్కుమార్కు ఫోన్ చేసినట్లు తేలింది.
1,894 ఇన్కమింగ్.. 1,311 ఔట్గోయింగ్ కాల్స్...
కల్యాణ్కుమార్ తరచూ ఓ ఉద్యోగితో ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. మరోవైపు వినయ్, రామరాజు నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్కాల్స్ లేవని దర్యాప్తులో తేలింది. దీన్నిబట్టి గొర్రెలను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన రామరాజు నుంచి కల్యాణ్కుమార్ అనధికారికంగా నగదు సమకూరినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రామరాజు తన ఉద్యోగి వినయ్ ద్వారా కల్యాణ్కుమార్కు సన్నిహితంగా ఉన్న మహిళా ఉద్యోగి ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అదే రోజు మహిళాఉద్యోగికి కల్యాణ్కుమార్ రెండుసార్లు ఫోన్ చేయగా.. ఆమె మరో రెండుసార్లు అతడికి ఫోన్ చేసినట్లు రికార్డుల్లో ఉంది. కల్యాణ్కుమార్ సీడీఆర్ను విశ్లేషించగా ఆమె నుంచి 1,894 ఇన్కమింగ్ కాల్స్ ఉన్నట్లు.. కల్యాణ్ నుంచి మహిళా ఉద్యోగికి 1311 ఔట్గోయింగ్ కాల్స్ ఉన్నట్లు వెల్లడైంది.
తరచూ నగదు రూపంలోనూ అందజేత
రామరాజు డ్రైవర్ నుంచి 161 సీఆర్పీసీ కింద ఏసీబీ వాంగ్మూలం సేకరించింది. ఈ క్రమంలో రామరాజు తరచూ కల్యాణ్కుమార్ను కలిసేవాడని తేలింది. అలాంటి సమయాల్లో రామరాజు నగదురూపంలో కల్యాణ్కు డబ్బు ముట్టజెప్పేవాడని తేలింది. రామరాజుతోపాటు ఇదే కేసులో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్లాంటి మరికొందరు దళారులు బృందంగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల యూనిట్లను సరఫరా చేసినట్లు తేలింది. ఇలాంటి వారితోనే కల్యాణ్కుమార్ దందా నడిపించినట్లు వెల్లడైంది. ఈ బృందం క్షేత్ర, జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులతోపాటు కీలక ప్రజాప్రతినిధులకు స్థాయులవారీగా లంచాలు ముట్టజెప్పినట్లు వెల్లడైంది. ఒక్కో యూనిట్కు రూ.2వేల చొప్పున కల్యాణ్కుమార్తోపాటు మరికొందరు లబ్ధి పొందినట్లు తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. -
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
కుటుంబానికి రూ.2 లక్షలు!
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. -
వీడుతున్న చిక్కుముడులు
హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. -
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. -
ఊరూరా మీసేవ కేంద్రాలు
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
కృష్ణపట్టి ఏరియాలో పెద్దపులి సంచారం
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
ఆరోగ్య, ఆహార అలవాట్లపై ‘న్యూట్రిషన్ అట్లాస్’
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ (భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
కార్మికుల భద్రత గాల్లో దీపమే
రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత కొరవడుతోంది. -
బాసర ఆలయ ప్రసాదాల్లో చేతివాటం
బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ వచ్చిన డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. -
నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. -
నీట్ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. -
రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు జగజీత్సింగ్ దల్లేవాల్, నల్లమల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్లో 431, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఆర్ఎస్బీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
మహిళా సూపరింటెండెంట్ ఆరోపణలపై నేడు విచారణ
సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి తనను వేధించారంటూ మహిళా సూపరింటెండెంట్ డి.జయలక్ష్మి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
ఏడుగురు తహసీల్దార్లకు ఎన్నికల తిరుగు బదిలీ
ఈ నెలతోపాటు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త