ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భూపాలపల్లి జిల్లా కొంపెల్లి భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు
కుట్రపూరితంగా అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై విచారణ జరపాలని ఆదేశం
ఈనాడు, దిల్లీ: భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఏఎస్ నం.145/1994కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునరుద్ధరిస్తూ, రివ్యూ పిటిషన్పై ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు తనకు అధికారంలేని విషయంలో జోక్యం చేసుకొందని.. హక్కులు నిరూపించుకోలేని ప్రైవేటు వ్యక్తికి అటవీభూమిని బహుమతిగా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరునూ సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. భిన్న విధానాలు అనుసరించిన ప్రభుత్వంతోపాటు, ప్రతివాది రూ.5 లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సంబంధిత కోర్టుల ముందు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కుట్రపూరితంగా అఫిడవిట్లు దాఖలుచేసిన అంశంపై విచారణ జరిపి, అందుకు బాధ్యులైన వారి నుంచి ఖజానాకు జరిగిన నష్టాన్ని వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంది. ఇదే అంశంపై హైకోర్టుముందు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు 624/2021ని మూసేయాలని ఆదేశించింది. అలాగే మరో వ్యాజ్యకాలీన దరఖాస్తును డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది.
1971లో నోటిఫికేషన్ జారీ..
కొంపెల్లి గ్రామ శివారులో జాతీయ రహదారికి అతి సమీపంలోని 106.34 ఎకరాలు తనదేనంటూ మహ్మద్ అబ్దుల్ ఖాసీం అనే వ్యక్తి క్లెయిమ్ చేసుకోగా, అది అతనిది కాదు.. రిజర్వ్ఫారెస్ట్ భూమి అని ఏపీ ప్రభుత్వం 1971 నవంబర్ 11న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. సదరు భూమి తనదేనని ఖాసీం దాఖలు చేసుకున్న దరఖాస్తును రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. తర్వాత ఆ కేసు జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లడంతో అక్కడా అతనికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత రిజర్వ్ఫారెస్ట్గా ప్రకటిస్తూ జారీచేసిన నోటిఫికేషన్ను రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా 1984 సెప్టెంబర్ 1న దాన్ని డిస్మిస్ చేశారు. దాంతో అబ్దుల్ఖాసీం 1985 ఏప్రిల్ 23న వరంగల్ అదనపు సబ్ జడ్జి-1 ముందు సూట్ దాఖలుచేసి ఆ భూమిపై హక్కులు కల్పిస్తూ శాశ్వత ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 1993 డిసెంబరు 6న ఆ కోర్టు సదరు వ్యక్తికి టైటిల్ మంజూరుచేస్తూనే, దాన్ని స్వాధీనంచేస్తూ ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. దానిపై దాఖలైన అప్పీల్పై విచారించిన హైకోర్టు.. ట్రయల్కోర్టు అతనికి టైటిల్ మంజూరుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను పక్కన పెట్టడంతోపాటు, ఆ కేసులో అతనికి అనుకూలంగా ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించడాన్ని సమర్థించింది. మొత్తంగా ఆ సూట్లోని భూమి అంతా అటవీభూమేనని 2018 జులై 20న తీర్పు వెలువరించింది. దాన్ని సవాల్చేస్తూ అదే ఏడాది నవంబర్ 18న ఖాసీం తరఫున హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలుచేయగా దాన్ని విచారించి అతనికి అనుకూలంగా 2021 మార్చి 19న తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాల్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021 మే 4న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలుచేసింది. కేసు పూర్వాపరాలు, ఇరుపక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు తొలి అప్పీల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. రివ్యూ పిటిషన్పై ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ కేసులో రెవెన్యూ అధికారులు జారీచేసిన ప్రొసీడింగ్స్ను ప్రతివాది ఏపీ ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 15 కింద సవాలే చేయలేదు. తన పేరిట హక్కులు ఖరారు చేయాలని, ఆ భూమిలోకి ప్రభుత్వ అధికారులు అడుగుపెట్టకుండా శాశ్వతంగా ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని మాత్రమే కోరారు. కాబట్టి ట్రయల్కోర్టులో అతను దాఖలుచేసిన సూట్కు విచారణార్హతే లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదు
ఈ కేసులో ప్రభుత్వ అధికారులు స్పష్టమైన విధానం తీసుకోకుండా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ప్రతివాదులకూ రూ.5లక్షల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. ‘‘సూట్లో పేర్కొన్న ఆస్తి అటవీభూమి అని స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భిన్న విధానాలు అనుసరించింది. అంతిమంగా సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్లో ఆ తప్పును సరిదిద్దుకొంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అందుకే ప్రతివాదితోపాటు ప్రభుత్వానికి జరిమానా విధిస్తున్నాం. ఆ మొత్తాన్ని వారు రెండునెలలలోపు జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలి’ అని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి