- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Telangana Cabinet: తుది దశకు మంత్రివర్గ విస్తరణ
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు.
రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్!
కొత్త అమాత్యులు ఎవరో తేల్చే అవకాశం
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో చర్చిస్తున్న సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగినా, ఈ వారంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చిన హామీలు, సామాజిక న్యాయం తదితర అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 3న దిల్లీకి వెళ్లే అవకాశముంది. గత వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ పాల్గొన్నారు. మళ్లీ వీరంతా పాల్గొంటారా... ముఖ్యమంత్రే అధిష్ఠానంతో చర్చించి ఖరారు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.
ఏడెనిమిది మందికి పదవులు
నిబంధనల ప్రకారం మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోవచ్చు. ప్రస్తుతం నలుగురు/ఐదుగురికి అవకాశం ఇస్తారని, మిగిలిన ఖాళీలను తర్వాత నింపుతారని తెలుస్తోంది. మంత్రులతోపాటు ఉప సభాపతి, చీఫ్ విప్, పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశముంది. మొత్తంగా ఏడెనిమిది మందికి ఈ పదవులు లభించొచ్చు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు.
- ఉమ్మడి రంగారెడ్డి నుంచి స్పీకర్ ఉన్నారు. ఇదే జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారెవ్వరూ లేరు. భారాస నుంచి దానం నాగేందర్ చేరినా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు.
- ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు ఉండగా, ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించినందున మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు అవకాశం రానుంది.
- ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.
- ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి పదవి దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్గొండ నుంచే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరు కూడా వినిపిస్తోంది.
- ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు అవకాశముండగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు గట్టిగా ప్రయత్నిస్తున్నారని పార్టీవర్గాలు తెలిపాయి.
- ఉమ్మడి వరంగల్ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
సామాజిక సమీకరణాలే కీలకం
ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా... మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు కీలక భూమిక పోషించనున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే... లంబాడాల నుంచి ఒకరికి ఉపసభాపతి లేదంటే చీఫ్ విప్ దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ పదవుల్లో ఒకదానికి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని ఎస్టీలకిస్తే ఇతర పదవుల్లో సమీకరణాలు మారతాయి. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై మంగళవారంతో చర్చ ముగియనుంది. బుధవారం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానంలోని ముఖ్య నాయకులు అందుబాటులో ఉంటారు. అదేరోజు సీఎంతో ఇతర నాయకులు దిల్లీకి వెళ్లి తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ సంగతి!
-
వినూత్న ఆలోచనలతో ముందుకు రండి
వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు. -
టీజీఎస్ఆర్టీసీలో 3,035 కొలువులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. -
అలాగే.. 6న కలుద్దాం
విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
బర్డ్ వాచింగ్.. నైట్ క్యాంపింగ్.. మధ్యలో బోటింగ్!
పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తైన కొండలు.. చెంతనే గలగల ప్రవాహాలు.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో.. చలిమంటలు కాగుతూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే.. ఆ ఆనంద పారవశ్యమే వేరు కదూ..! -
డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు
డబ్బులిచ్చి కోరుకున్న పోస్టింగ్ తెచ్చుకునేందుకు ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. అలాంటివారిని ఎవరూ కాపాడలేరని.. ఏసీబీ, విజిలెన్స్ వెంటాడుతాయని స్పష్టంచేశారు. -
తమిళనాడులో ముగిసిన తెలంగాణ అధికారుల అధ్యయనం
తమిళనాడులోని రవాణా విధానాలపై తెలంగాణ అధికారుల రెండు రోజుల అధ్యయనం మంగళవారం ముగిసింది. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా అధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, -
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ముట్టడి
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 700 మంది అలైడ్ హెల్త్సైన్స్ విద్యార్థులు మంగళవారం వరంగల్లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ముట్టడించారు. -
సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని నోకియా జర్మనీ ప్రతినిధి బృందం, హెటిరో గ్రూప్ ప్రతినిధి బృందం, ఇండియన్ పారాసైక్లింగ్ టీమ్ మంగళవారం వేర్వేరుగా కలిశాయి. -
గవర్నర్తో శాసన సభాపతి, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ
రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను రాజ్భవన్లో మంగళవారం శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
పరిహారంతో సరిపెట్టడంకాదు.. విధానాలు రూపొందించాలి
కుక్క కాటుతో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు సూచించింది. -
కొత్త బీటెక్ సీట్లు 20,500
రాష్ట్రంలో డిమాండ్ ఉన్న బీటెక్ సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అదీ... కేవలం జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లో మాత్రమే. -
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. -
మందుల కొరత ఉండొద్దు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. -
టీజీపీఎస్సీని స్వచ్ఛంగా తీర్చిదిద్దాం
గత ప్రభుత్వ హయాంలో కలుషితమైన టీఎస్పీఎస్సీ(ప్రస్తుత టీజీపీఎస్సీ)ని స్వచ్ఛమైన బంగారంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్ది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
దేవాదాయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
‘భూముల పరిరక్షణ, అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. -
సంక్షిప్త వార్తలు (14)
రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్లో 5.2, నర్సాపూర్లో 4.7, పాత మంచిర్యాలలో 3.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
రైతు ఆత్మహత్యపై సమగ్ర విచారణ.. సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ఆదేశాలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, -
వచ్చే మూడు నెలల్లో రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు
పంట రుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలకు వచ్చే మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు వెచ్చించనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో సమస్యలపై పోర్టల్
రాష్ట్రంలో తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అనంతరం ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించేందుకు త్వరలో ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నారు. -
సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్ ప్రారంభం
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ నిధులను వినియోగించాలని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి