- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
SGT Transfers: 10 మంది విద్యార్థులు మించితే.. ఇద్దరు టీచర్లు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు.
పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు
ఎస్జీటీ బదిలీల్లో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం
పాక్షికంగా హేతుబద్ధీకరణ అమలు చేసినట్లే..!
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల సందర్భంగా పాఠశాల విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయం ఇది. 2015, 2021లలో ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం.. 19 మంది విద్యార్థులు దాటితేనే ఇద్దరు టీచర్లను కేటాయించాలి. అయితే, విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా 10 మంది పిల్లలకు మించి ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్ను కేటాయించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అలా కేటాయించకున్నా సర్కారు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో చదువుల పరిస్థితి కొంత మెరుగవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం..
పిల్లల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2015లో జీఓ 17, 2021లో జీఓ 25 జారీ చేసింది. ఆ ప్రకారం 0-19 మంది పిల్లలకు ఒక టీచర్, 20-60కి ఇద్దరు, 61-90కి ముగ్గురు, 91-120కి నలుగురు, 121-150కి అయిదుగురు, 151-200కి ఆరుగురు, 201-240కి ఏడుగురు, 241-280 మంది విద్యార్థులకు ఎనిమిది మంది ఉపాధ్యాయులను కేటాయించారు. 361-400 మంది విద్యార్థులకు ఏకంగా 11 మంది టీచర్లు ఉంటారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఇది అమలు జరగడం లేదు.
తాజా బదిలీల్లో ఇలా..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్జీటీల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో 2015లో టీచర్ల హేతుబద్ధీకరణ చేశారు. అంటే పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించారు. తర్వాత 2021లో కొత్త మార్గదర్శకాలు ఇచ్చినా ఆ ప్రక్రియ కొనసాగలేదు. ప్రస్తుతం పిల్లలున్న చోట టీచర్లు లేరు.. ఉపాధ్యాయులు ఉన్న చోట పిల్లలు తక్కువగా ఉన్నారు. దీంతో తాజా బదిలీల్లో కొంత మార్పు తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందుకే ఈ సారి ఒక్క విద్యార్థి కూడా లేని బడులకు టీచర్లను ఇవ్వలేదు. 1-10 మంది ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 11-40 వరకు ఇద్దరు, 41-60 వరకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా ఖాళీలు చూపారు. ఆ ప్రకారం 10 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రస్తుతం ఇద్దరు పనిచేస్తుంటే ఒక్క ఖాళీనే చూపారు. 11 మంది ఉన్న చోట ఒక్కరే పనిచేస్తుంటే రెండో టీచర్ను ఇచ్చేలా ఖాళీ చూపారు. 60 మంది కంటే ఎక్కువ పిల్లలున్న చోట మాత్రం అన్ని ఖాళీలను చూపామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం గతంలో ఉన్న మాదిరిగానే అన్ని బడుల్లో ఖాళీలన్నింటిని చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. పిల్లలు అధికంగా ఉన్న చోట కొత్తగా ఖాళీలను పెంచలేదని ఎస్సీ, ఎస్టీ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు వీలుగా బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని సీఎం కార్యాలయం పేర్కొంది. అందుకు గతంలో ఉన్న నిబంధనలను కొంత సవరించినట్లు వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తమిళనాడుకు తెలంగాణ అధికారుల బృందం
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది. -
నాకు దక్కాల్సిన స్థలం.. బంధువులు పట్టా చేసుకున్నారు!
తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు. -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. -
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. -
7 నుంచి నేతన్న పోరుయాత్ర
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. -
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి. -
చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం
పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. -
వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ
మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలను ముమ్మురం చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. -
బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట
పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
వర్సిటీల్లో సదుపాయాలు కల్పించండి
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను కల్పించాలని, అందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. -
యువ ఐపీఎస్లకు స్థానచలనం
యువ ఐపీఎస్లు (2020-21 బ్యాచ్) 8 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. -
ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావు!
ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావని.. ఆదాయం పెంచుకోవడానికి ఆలయాలు వ్యాపార దృక్పథంతో పనిచేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. -
కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదుకు ‘ఎస్వోపీ’
రాష్ట్రంలో కొత్త చట్టాల ప్రకారం కేసుల నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. -
నిమ్స్కు రూ.2.1 కోట్ల విరాళం
పీడియాట్రిక్ ఎపిలెప్సీ సెంటర్ స్థాపనతో పాటు వివిధ వసతుల కోసం నిమ్స్కు ‘ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్’ సంస్థ రూ.2.1 కోట్ల విరాళం అందజేసింది. -
ములుగు జిల్లాకు ‘సమ్మక్క సారలమ్మ’ పేరు!
ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
ఎయిర్ఫోర్స్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధ్యక్షుడిగా విశ్రాంత గ్రూపు కెప్టెన్ పెమ్మసాని రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి.