- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Degree Contract lecturers: క్రమబద్ధీకరణ ఆశ నెరవేరేదెప్పుడో!
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు.. తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) విషయమై ఎదురుచూపులు తప్పడం లేదు.
డిగ్రీ ‘కాంట్రాక్టు’ అధ్యాపకుల ఎదురుచూపులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు.. తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్) విషయమై ఎదురుచూపులు తప్పడం లేదు. కాంట్రాక్టు అధ్యాపకుల కొలువులను క్రమబద్ధీకరించే ప్రక్రియ ప్రారంభించి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు సగం మంది ఆశలు కూడా నెరవేరలేదు. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 797 మందిలో తొలివిడతగా 2022 మే నెలలో 270 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించింది. మిగిలినవారికి యూజీసీ నిబంధనల ప్రకారం అవసరమైన అదనపు విద్యార్హతలైన పీహెచ్డీ/నెట్/సెట్ లేవని వారి దరఖాస్తులను ప్రభుత్వం పక్కనబెట్టింది. తర్వాత అందులో ఏదో విద్యార్హతను సాధించిన అధ్యాపకులు కళాశాల విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోవడంతో వాటిని పరిశీలించిన ప్రభుత్వం 61 మందిని 2023 అక్టోబరులో రెగ్యులర్ చేసింది. ఈ మేరకు 331 మంది లబ్ధి పొందినా ఇంకా 466 మంది మిగిలిపోయారు. అప్పటికి అదనపు విద్యార్హతలు పొందలేకపోయారు. రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అధ్యాపకులు, లైబ్రేరియన్లు, పీడీలు కలిపి 4,098 పోస్టులు ఉండాలి. రెగ్యులర్ పోస్టుల్లో 1,255 మందే పనిచేస్తున్నారు. రెగ్యులర్ అయిన 331 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను కలిపితే ఆ సంఖ్య 1,586 మాత్రమే. ఖాళీ పోస్టుల్లో అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు.
ఎప్పటికో అవకాశం!
ఉద్యోగాలు క్రమబద్ధీకరించకుండా మిగిలిపోయిన 466 మందిలో దాదాపు 300 మంది గత అక్టోబరు తర్వాత అదనపు అర్హతలు సాధించారు. కొందరు పీహెచ్డీలు పూర్తిచేయగా మరికొందరు యూజీసీ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్), రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీఎస్సెట్లో అర్హత సాధించారు. వారంతా గత 9 నెలలుగా క్రమబద్ధీకరణకు ఎదురుచూస్తున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల్లోని పీహెచ్డీ పట్టాలను కొంటున్నారనే ఆరోపణలున్నాయి. అలాగని నిబంధనల ప్రకారం అదనపు అర్హతలను సాధించిన వారిని పక్కన పెట్టడం సమంజసం కాదన్న భావన వ్యక్తమవుతోంది. ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి.. అవసరమైతే ఆయా వర్సిటీలు, యూజీసీ వివరణ తీసుకొని క్రమబద్ధీకరణ పూర్తిచేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు కోరుతున్నారు. గత ఏప్రిల్, మే నెలల జీతాలు ఇంతవరకు అందలేదు. మానసిక ఆందోళనతో కొందరు చనిపోతున్నారని టీజీడీసీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్కుమార్ వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. -
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
కుటుంబానికి రూ.2 లక్షలు!
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. -
వీడుతున్న చిక్కుముడులు
హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. -
ఊరూరా మీసేవ కేంద్రాలు
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
కృష్ణపట్టి ఏరియాలో పెద్దపులి సంచారం
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
ఆరోగ్య, ఆహార అలవాట్లపై ‘న్యూట్రిషన్ అట్లాస్’
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ (భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
కార్మికుల భద్రత గాల్లో దీపమే
రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత కొరవడుతోంది. -
బాసర ఆలయ ప్రసాదాల్లో చేతివాటం
బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ వచ్చిన డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. -
నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. -
నీట్ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. -
రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు జగజీత్సింగ్ దల్లేవాల్, నల్లమల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్లో 431, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఆర్ఎస్బీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
మహిళా సూపరింటెండెంట్ ఆరోపణలపై నేడు విచారణ
సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి తనను వేధించారంటూ మహిళా సూపరింటెండెంట్ డి.జయలక్ష్మి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
ఏడుగురు తహసీల్దార్లకు ఎన్నికల తిరుగు బదిలీ
ఈ నెలతోపాటు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
-
చంద్రబాబు కార్యసాధకుడు.. అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు: సుమన్
-
మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్ వైరల్
-
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్
-
‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రజనీకాంత్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్కు తీవ్ర అస్వస్థత