- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
EPF higher pension: లాభమా? నష్టమా?
ఒక సంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఒకరు అధిక పింఛను కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశారు. దాన్ని పరిశీలించిన ఈపీఎఫ్వో ఆయనకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఈపీఎస్కు బకాయిల కింద రూ.21 లక్షలు కట్టాలని అందులో పేర్కొంది.
పింఛను ఎంతొస్తుందో చెప్పకుండానే డిమాండ్ నోటీసులు
ఈపీఎఫ్ అధిక పింఛను దరఖాస్తుదారుల్లో ఆందోళన
ఒక సంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఒకరు అధిక పింఛను కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశారు. దాన్ని పరిశీలించిన ఈపీఎఫ్వో ఆయనకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఈపీఎస్కు బకాయిల కింద రూ.21 లక్షలు కట్టాలని అందులో పేర్కొంది. అయితే, నోటీసులో పేర్కొన్న మొత్తం చెల్లిస్తే ఎంత పింఛను వస్తుంది? పింఛనును ఏవిధంగా లెక్కిస్తారన్న వివరాలేమీ అందులో లేవు. దాంతో ‘అధిక పింఛను’ వల్ల లాభమా? నష్టమా? అనే స్పష్టత రాక ఆందోళనకు గురవుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: అధిక పింఛను దరఖాస్తుల పరిష్కారంలో ఈపీఎఫ్వో తీసుకుంటున్న నిర్ణయాలు చందాదారులు, విశ్రాంత ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)కు బకాయిలు చెల్లించాలా? వద్దా? నిర్ణయించుకోలేకపోతున్నారు. బకాయిల నోటీసులు జారీ చేస్తున్న ఈపీఎఫ్వో.. పింఛను లెక్కింపు ఫార్ములా, ప్రతినెలా ఎంత మొత్తం పింఛను వస్తుందో స్పష్టత ఇవ్వకపోవడంతో పథకంలో చేరేందుకు సగానికిపైగా చందాదారులు ఆసక్తి చూపడం లేదు.
నోటీసుల జారీలో జాప్యం
హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వివిధ సంస్థల పరిధిలోని 12,700 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో దరఖాస్తును పరిశీలించి.. డిమాండ్ నోటీసు జారీ చేసేందుకు ఒక్కో ఉద్యోగికి రెండు రోజుల సమయం పడుతోంది. అధిక పింఛను కోసం ఏర్పాటు చేసిన సెక్షన్లో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వివరాలన్నీ చూసి నోటీసులు జారీ చేయడం.. వారికి తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో అదనంగా 20 మంది అసిస్టెంట్లు, ఇద్దరు సహాయ పీఎఫ్ కమిషనర్లను నియమించాలని ఉన్నతాధికారులను కోరారు. కానీ, దీనిపై ఇప్పటివరకు సానుకూల నిర్ణయం వెలువడలేదు. తక్కువ మంది సిబ్బందితో ఈ ప్రక్రియను కొనసాగిస్తే అందరికీ డిమాండ్ నోటీసులు జారీ కావడానికి ఏళ్లకొద్దీ సమయం పట్టే అవకాశముందని ఈపీఎఫ్వో వర్గాలు చెబుతున్నాయి.
అంగీకరించిన వారికి స్పష్టత ఏదీ?
తమకు వచ్చిన డిమాండ్ నోటీసుల మేరకు పింఛను పథకం(ఈపీఎస్) బకాయిలను కొందరు చెల్లిస్తున్నారు. తమ భవిష్య నిధి ఖాతాలోని నిల్వ నుంచి ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలుపుతున్నారు. ఆ మేరకు నిల్వలు లేని ఉద్యోగులు, పింఛనుదారులు.. డిమాండ్ మొత్తానికి సమానమైన చెక్కులు అందిస్తున్నారు. అయితే, చెక్కుల చెల్లుబాటు అనంతరం అధిక పింఛను దరఖాస్తు ఆమోదించిన సమాచారాన్ని చందాదారులకు ఈపీఎఫ్వో తెలియజేయడం లేదు. ఆరు నెలల క్రితం డిమాండ్ నోటీసులు అందుకున్న చందాదారులు, పింఛనుదారులు కొందరు.. అప్పులు చేసి మరీ బకాయిలు చెల్లించేందుకు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు చెల్లుబాటైనా ఇప్పటివరకు సవరణ పింఛను చెల్లింపు పత్రా (పీపీఓ)లు జారీ చేయకపోవడంతో వడ్డీలు చెల్లించలేక, అధిక పింఛను అందక ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ నోటీసుల మేరకు భవిష్యనిధి ఖాతాల్లోని నిల్వల నుంచి నిధులు తీసుకునేందుకు అంగీకారపత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఈపీఎస్ నిబంధనల మేరకు పింఛను నిధికి యాజమాన్యం వాటా కింద 9.49 శాతం చందా జమ కావడం లేదు. యాజమాన్యాల నుంచి పాత పద్ధతిలోనే చలాన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగీకార పత్రాలు ఇచ్చినవారికి మరోసారి డిమాండ్ నోటీసులు జారీ అవుతాయా? లేక ఆటోమెటిక్గా నిధులు సర్దుబాటు చేస్తారా? అన్న అంశంపై గందరగోళం నెలకొంది.
ఆర్టీసీ పరిధిలో ఇలా..
హైదరాబాద్ ఈపీఎఫ్వో పరిధిలో 81 వేల మంది ఆర్టీసీ కార్మికులు అధిక పింఛనుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 30 వేల మందికే డిమాండ్ నోటీసుల మేరకు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. రూ.లక్షలు చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్న ఈపీఎఫ్వో అధికారులు.. కనీసం పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులకు సైతం అధిక పింఛను లెక్కింపు ఫార్ములా, పింఛను ఎంత వస్తుందో చెప్పకపోవడంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీలో ఇప్పటివరకు కేవలం ఒక్కరికి మాత్రమే పింఛను చెల్లింపు పత్రం(పీపీవో) జారీ అయినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక టెట్ ఏటా రెండుసార్లు
ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. -
విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం
హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎనుముల రేవంత్రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిల మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. -
కమిటీల ద్వారా పరిష్కారం
విభజన చట్టంలోని పెండింగు సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కారమార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్లు తెలిపారు. -
కాళేశ్వరం పంపుహౌస్లపైనా విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ కమిషన్ పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్.. -
నైనీ కరెంటు కొంటారా?
దేశంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు రవాణా కన్నా కరెంటు సరఫరా వ్యయం తక్కువ అవుతుందని తాజాగా కేంద్ర విద్యుత్శాఖ రాష్ట్రాలకు సూచించింది. బొగ్గు గనులున్న ప్రాంతాల్లోనే థర్మల్ విద్యుత్కేంద్రాలను నిర్మిస్తే కరెంటు చౌకగా లభిస్తుంది. -
బాధ్యతల భారం.. పరిష్కారం దూరం!
రాష్ట్రంలో కాలుష్య సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు భారీగా పెరిగిపోతున్నాయి. అయినా. వాటి పరిష్కారానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కృష్ణ జింకలను పట్టుకోవాల్సిందే!
రాష్ట్రంలోని కృష్ణా నదీ తీర మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలో ఉన్న కృష్ణా నదీ తీరంలో మూడు వేల పైచిలుకు కృష్ణ జింకలున్నాయి. -
విమానాశ్రయాల్లో భద్రతపై అధ్యయనం!
విమానాశ్రయాల్లో భద్రత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటి నిర్మాణాలకు సంబంధించి భద్రతా వ్యవస్థను అధ్యయనం చేయించాలని ఆదేశించింది. అనంతరం నివేదికను పంపాలని అధికారులకు స్పష్టం చేసింది. -
తిరుమల తరహాలో యాదాద్రి స్వయంభువుల దర్శనం
తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభువుల దర్శనం కలగనుంది. దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకొంటూ.. -
ధాన్యం లేదు.. డబ్బులిస్తాం!
అన్నదాతల నుంచి సేకరించిన వడ్లను మరాడించి బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న రైస్మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా కఠినంగా వ్యవహరిస్తుండటంతో రూ.వందల కోట్ల బకాయిలు వసూలవుతున్నాయి. -
కమ్యూనిటీ వాలంటీర్లతో మధ్యవర్తిత్వం
కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తిత్వ చట్టాలపై అవగాహన కల్పించి వివాహ వ్యవస్థలోని తగాదాలు పరిష్కరించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ అధ్యక్షుడు జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు. -
కలెక్టర్ల వద్దే ఏజెన్సీ భూ వివాదాల పరిష్కారం
ఏజెన్సీల్లోని భూ వివాదాలను జిల్లా కలెక్టర్ల వద్దనే పరిష్కరించుకోవచ్చని ఆదిలాబాద్ కోర్టుల పోర్ట్ఫోలియో జడ్జి అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు
డోర్నకల్-భద్రాచలం స్టేషన్ల మధ్య లైన్ డబ్లింగ్ కోసం భూసేకరణ చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ లైన్ కోసం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, గార్ల మండలాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. -
ఎస్సీ గురుకుల సొసైటీలో పూర్తికాని తుది కేటాయింపులు
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం. 317కు సంబంధించిన ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇతర సంక్షేమ సొసైటీల్లో సాంకేతిక పొరపాట్లకు అవకాశం లేకుండా తుది కేటాయింపులు పూర్తయ్యాయి. -
దండు మల్కాపూర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి
యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు వద్ద హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) కోరింది. -
దేవాదుల సొరంగం ప్రారంభమయ్యేనా?
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశలో నిర్మించిన సొరంగం పూర్తయితే లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఈ టన్నెలే. -
నిరుపయోగ బొగ్గు గనుల నుంచి జల విద్యుత్
విద్యుదుత్పత్తి పెంచేందుకు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు(పీఎస్పీపీ) నిర్మించాలని సింగరేణి సంస్థ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ యాజమాన్యంలో పీఎస్పీపీ నిర్మాణం కోసం కసరత్తు చేస్తోంది. -
ఉత్తర భాగానికి రూ.5వేల కోట్లు!
హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్కు ఆర్థిక అవస్థలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అవతల నుంచి 2 భాగాలుగా ప్రాంతీయ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)ను తలపెట్టిన విషయం తెలిసిందే. -
రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. -
ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు తెలంగాణ యాత్రికుల దుర్మరణం
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. చమోలీ జిల్లా కర్ణప్రయాగ, గౌచర్ల మధ్యలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు తెలంగాణవాసులు మృతి..
తాజా వార్తలు (Latest News)
-
గుడివాడలో క్షుద్రపూజల కలకలం
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు