- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
CM Revanth Reddy: అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా?
వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా ఎందుకు పెంచారని.. మౌఖిక ఆదేశాలతో ఏకంగా రూ.626 కోట్లు అదనంగా ఎలా ఖర్చు చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయం రూ.626 కోట్లు పెరగడంపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశం
ఓరుగల్లు అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష
మంత్రులతో కలిసి పర్యటన
వనమహోత్సవానికి శ్రీకారం
నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూకు ఆదేశాలిస్తున్న సీఎం రేవంత్రెడ్డి.చిత్రంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఈనాడు - వరంగల్, వరంగల్ కార్పొరేషన్, గీసుకొండ - న్యూస్టుడే: వరంగల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా ఎందుకు పెంచారని.. మౌఖిక ఆదేశాలతో ఏకంగా రూ.626 కోట్లు అదనంగా ఎలా ఖర్చు చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం ఆయన మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించారు. సీఎం మొదట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో నిర్మిస్తున్న కాకతీయ మెగా జౌళి పార్కుకు చేరుకున్నారు. కైటెక్స్ వస్త్ర పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటి ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. తర్వాత వివిధ అంశాలపై హనుమకొండ సమీకృత కలెక్టరేట్లో మంత్రులు, సంబంధిత అధికారులతో కలిసి సుమారు 2 గంటలసేపు సమీక్ష నిర్వహించారు.మొదట రూ.1100 కోట్లుగా అంచనా వేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయాన్ని.. ఏకంగా రూ.1726 కోట్లకు ఎలా పెంచారని రేవంత్రెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. వరంగల్ను ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. హైదరాబాద్లోని నిలోఫర్ తరహాలో ఓరుగల్లులోనూ పిల్లల చికిత్స కోసం అత్యాధునిక ఆసుపత్రి నిర్మించాలని, ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కంటి, క్షయ ఆసుపత్రులు ఇక్కడే ఉన్నందున అన్నిటినీ అనుసంధానం చేస్తూ హెల్త్సిటీని తీర్చిదిద్దాలని సూచించారు. ఇప్పుడున్న ఆటోనగర్ను మరోచోటుకు తరలించి, ఆ స్థలాన్ని హెల్త్సిటీ కోసం వినియోగించాలని చెప్పారు.
మాస్టర్ప్లాన్ 2050 రూపొందించండి
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని సీఎం తెలిపారు. తెలంగాణకు సాంస్కృతిక రాజధాని, వారసత్వ నగరమైన వరంగల్ విశిష్టతను, చారిత్రక వైభవాన్ని కాపాడుకుంటూ నిర్దిష్టమైన ప్రణాళికలు రచించాలని, సమగ్రాభివృద్ధికి ‘మాస్టర్ ప్లాన్ 2050’ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 20 రోజులకోసారి సమీక్షించాలని సూచించారు. భూసేకరణ పూర్తి చేశాకే ఇన్నర్, ఔటర్ రింగురోడ్డు పనులు మొదలుపెట్టాలని చెప్పారు. రెండు జాతీయ రహదారులు అనుసంధానమయ్యేలా ఔటర్ రింగు రోడ్డు ఉండాలని, ఔటర్ నుంచి మెగా జౌళి పార్కుకు కనెక్టివిటీ ఉండాలని సూచించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, డంపింగ్యార్డు తదితర అంశాలపై తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ వరంగల్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), ఇతర ప్రభుత్వ శాఖలు చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం అధికారులు రూ.6115 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించగా.. ఆ నిధులను విడతలవారీగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎస్ శాంతికుమారి, వరంగల్ మేయర్ సుధారాణి
వస్త్రపరిశ్రమ అభివృద్ధికి కృషి
కాకతీయ జౌళి వస్త్రపరిశ్రమ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. కాకతీయ మెగా జౌళి పరిశ్రమ (కేఎంటీపీ)ను సందర్శించిన అనంతరం రేవంత్రెడ్డి కైటెక్స్ కంపెనీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రులతో కలిసి తిలకించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్రంజన్ మూడు నిమిషాల వీడియో ద్వారా సీఎంకు వివరించారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో భారీ వర్షాల సమయంలో నీళ్లు బాగా నిలిచిపోతుండడంపై సీఎం స్పందించారు. వస్త్రపరిశ్రమ ఆవరణలో 10 ఎకరాల భూమిని ప్రత్యేకంగా కేటాయించి వరద నీరు పోయే వ్యవస్థను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు టీజీఐఐసీ అధికారులు తెలిపారు. వస్త్రపరిశ్రమకు భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు వెంటనే పంపిణీ చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సీఎంను కోరగా.. 1223 మంది భూనిర్వాసితులకు ప్లాట్లు సిద్ధం చేశామని, పైలాన్ సమీపంలో మిగిలిన 150 మందికి వాటిని కేటాయిస్తామని టీజీఐఐసీ అధికారులు వివరించారు. భూనిర్వాసితులకు రూ.5 లక్షల చొప్పున వెచ్చించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి, అన్ని వసతులతో కూడిన టౌన్షిప్పును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు.
సర్వపిండి బాగుంది..
మహిళా సంఘాల సభ్యులకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి
హనుమకొండ కలెక్టరేట్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ను సీఎం ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన వంటకాలను సీఎం, మంత్రులు రుచి చూశారు. బిర్యానీ, చిరుధాన్యాల వంటకాలు, అరిసెలు, సకినాలు, సర్వపిండి, లడ్డూలను క్యాంటీన్ నిర్వాహకులు వడ్డించగా.. సీఎం అరిసెలు, సకినాలు, సర్వపిండిని రుచి చూశారు. సర్వపిండి బాగుందంటూ మరికొంచెం అడిగి తిన్నారు. సీఎం పర్యటనకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుది దశకు మంత్రివర్గ విస్తరణ
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. -
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు ‘హైడ్రా’
హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా) అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. -
ఏటా ఉద్యోగాల భర్తీ!
రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. -
కమిషన్ చట్టబద్ధమే
విద్యుత్తు కొనుగోళ్లు.. యాదాద్రి, భదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కచ్చితత్వం, ఔచిత్యాన్ని తేల్చడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. -
నేరుగా జీపే, ఫోన్పే, పేటీఎంలో కరెంటు బిల్లు కట్టవద్దు
ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టేవారందరూ ఇకనుంచి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ పేర్కొంది. -
ఇలా తిందాం.. పదికాలాలు పచ్చగా ఉందాం
తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. ఆహారంలో సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. -
వరదలొచ్చినా.. విద్యుదుత్పత్తి ఉండనట్టే!
ప్రస్తుత వానాకాలంలో కృష్ణానదికి వరదలొచ్చినా శ్రీశైలం జల విద్యుత్కేంద్రంలో పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. -
సారూ.. వెళ్లొద్దు
నల్గొండ జిల్లా డిండి మండల పరిధిలోని వావిల్కోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు.. మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. -
క్రీడాకారులకు సీఎం అభినందన
ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్’ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో బంగారు పతకాలు సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసాలను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. -
బొగతలో జల సవ్వడి
తెలంగాణ నయాగరాగా పిలిచే ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. -
వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయంపై దృష్టి
రాష్ట్రంలో ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా వైద్య విభాగాల మధ్య మరింత సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. -
తమిళనాడుకు తెలంగాణ అధికారుల బృందం
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు తమిళనాడులో రవాణా విధివిధానాలపై అధ్యయనం చేయడానికి రంగారెడ్డి జిల్లా ఉప రవాణాధికారి (డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీవో వాణి, కామారెడ్డి ఎంవీఐ శ్రీనివాస్తో కూడిన అధికారుల బృందం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లింది. -
నాకు దక్కాల్సిన స్థలం.. బంధువులు పట్టా చేసుకున్నారు!
తనకు దక్కాల్సిన ఆస్తిని బంధువులు అక్రమంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కరీంనగర్లో ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు సోమవారం నిరసనకు దిగారు. -
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ గందరగోళానికి తెర!
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. -
సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు మార్గం సుగమం
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. -
7 నుంచి నేతన్న పోరుయాత్ర
రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలంటూ ‘మగ్గం నడవాలి-నేతన్న బతకాలి’ నినాదంతో ఈ నెల 7వ తేదీ నుంచి నేతన్న పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనుబంధ చేనేత, మరమగ్గాల కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. -
బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు ఉన్న బొగ్గు గనులకు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, ఈ తరహా చర్యలను తక్షణం విరమించుకోవాలని రాష్ట్రంలోని కార్మిక సంఘాలు విజ్ఞప్తిచేశాయి. -
‘గాంధీ’ ఎదుట నిరుద్యోగుల ఆందోళన
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు, వివిధ పార్టీల నేతలు, వారిని అడ్డుకునేందుకు మోహరించిన పోలీసులతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గాంధీ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత కొనసాగింది. -
రాష్ట్ర గవర్నర్తో మిజోరాం గవర్నర్ హరిబాబు భేటీ
తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. -
జన్యు సవరణతో నేత్ర వ్యాధులకు చెక్!
పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల జన్యు వ్యాధులకు సంబంధించి జీన్ ఎడిటింగ్ (జన్యు సవరణ)తో చెక్పెట్టే పరిశోధనలు జరుగుతున్నాయి. -
చరిత్రలో నిలిచిపోయేలా గిరిజన అమరవీరుల స్మృతివనం
పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు పోరాడిన గిరిజన అమరవీరుల స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలా స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం