- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Revanth Reddy: కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షాలను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రధానమంత్రిని,
రాజకీయాలు ఎన్నికల వరకే
అందుకే ప్రధాని మోదీ, అమిత్షాలను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం
నాడు కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది
మా పాలనకు మార్క్గా మూసీ నది అభివృద్ధి
దిల్లీ ఇష్టాగోష్ఠిలో రేవంత్రెడ్డి
ఈనాడు, దిల్లీ: తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షాలను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రధానమంత్రిని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చామన్నారు. వారివైపు నుంచి కూడా సానుకూల స్పందన కన్పించిందని తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాలను కలిసిన తర్వాత ఆయన గురువారం ఇక్కడి తన అధికార నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ ఫలానా తేదీన చేపడతామని తాను ఎప్పుడూ చెప్పలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం గురించి ఏఐసీసీ అధ్యక్షుడికి చెప్పామని, ఈ రెండు విషయాలు ఆయన పరిశీలనలో ఉన్నాయని మాత్రమే ఇదివరకు తాను అన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బంతి ఏఐసీసీ అధ్యక్షుడి కోర్టులో ఉందన్నారు. తర్వాత ఆయన విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
గ్రూప్ 1 పోస్టుల భర్తీని అడ్డుకోవడానికి కొందరి ఎత్తులు
‘‘గ్రూప్ 1 పరీక్షల్లో అభ్యర్థుల నిష్పత్తిని 1:100కి మార్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 2022లో అప్పటి ప్రభుత్వం 1:50 అని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం పరీక్షలు నిర్వహించారు. పేపర్లు లీక్ కావడంతో ఆ పరీక్షలు రద్దయ్యాయి. ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను జతచేసి 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించాం. పరీక్షలు పూర్తయిన తర్వాత అభ్యర్థుల నిష్పత్తిని 1:100 చేస్తూ ఉత్తర్వులిస్తే కోర్టు అయిదు నిమిషాల్లో వాటిని కొట్టేస్తుంది. మేం గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయకుండా అడ్డుకోవడానికే కొందరు ఈ ఎత్తులు వేస్తున్నారు. అన్ని ఉద్యోగ పరీక్షలను యూపీఎస్సీ తరహాలో నిర్వహించడానికి నిపుణుల చేత అధ్యయనం చేయిస్తున్నాం. ఒక పరీక్షకు మరోటి అడ్డురాకుండా క్యాలెండర్ తయారు చేస్తున్నాం.
తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రాకు వదిలిపెట్టిందే కేసీఆర్. ఇప్పుడు అవి కలపాలని డిమాండ్ చేయడం ఆయన చేతకానితనానికి నిదర్శనం. కేసీఆర్ తెలంగాణ సీఎం అయిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏపీలో విలీనం చేసింది. కె.కేశవరావు సేవలను రాష్ట్రంలో ఉపయోగించుకుంటాం. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తాం.
36 నెలల్లో మూసీ నది అభివృద్ధి
రాష్ట్రంలో మా ప్రభుత్వ పాలనకు మార్క్గా మూసీ నదిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. గండిపేట నుంచి రింగ్ రోడ్ వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవున దీని అభివృద్ధి ఉంటుంది. దీని నీటి అవసరాలు తీర్చడానికి గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు 15 టీఎంసీలు తరలించేలా పెద్ద లైన్ వేస్తాం. త్వరలో టెండర్లు పిలుస్తాం. ఇప్పటికే లండన్ థేమ్స్ నదిని చూశాం. ఆగస్టులో జపాన్, కొరియాకు వెళ్తున్నాం. నదికి రెండువైపుల ఉన్న ఆక్రమణలను తొలగించి భూమిని అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం అక్కడ 10,500 నిర్మాణాలున్నాయి. వాటిని ఖాళీ చేయించాలి. బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం. లేదంటే సమీపంలో భూసమీకరణ చేసి భూమి ఇస్తాం. అదీ కాదంటే టీడీఆర్ బాండ్లు జారీ చేస్తాం. ఇవేవీ కాదంటే పరిహారం అందిస్తాం. ప్రస్తుతం హైదరాబాద్లో ఎవ్వరికీ కేటాయించని డబుల్ బెడ్ రూం ఇళ్లు 35 వేల వరకు ఉన్నాయి. ఇక్కడ పదివేల మంది అంగీకరిస్తే ఆ ఇళ్లు కేటాయించేస్తాం. ఈ మార్గంలో పైన మెట్రో రైలు వెళ్లేలా డిజైన్ చేస్తున్నాం. ఇందుకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలను ఎంపిక చేశాం. మొత్తం 36 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది మా ఉద్దేశం. మొత్తం మూడు, నాలుగు క్లస్టర్లుగా దీన్ని అభివృద్ధి చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బడ్జెట్ సమావేశాల తర్వాతే దానిపై ఆలోచిస్తాం.
నాడు కేంద్ర పథకాలను పక్కన పెట్టిన కేసీఆర్
గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అనుసరించడంవల్ల రాష్ట్రానికి విపరీతమైన నష్టం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను వాడుకోకపోవడంవల్ల తెలంగాణకు నిధులే అక్కర్లేదని కేంద్రం సున్నా చేసింది. కేసీఆర్ తన మొదటి టర్మ్లో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించినా రాష్ట్రానికి నిధులేమీ తేలేదు. ఆయన చేపట్టిన కాళేశ్వరం, మిషన్భగీరథ, మిషన్కాకతీయ తప్ప ప్రజలకు మరేమీ గుర్తుకురాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర పథకాలను పక్కనపెట్టారు. ప్రతిష్ఠ పెంచుకోవడానికి చేసిన ఆ మూడు పథకాలే కేసీఆర్ను దెబ్బతీశాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడంలేదు. కేసీఆర్ అన్ని ఫోన్లు ట్యాప్ చేసి చివరకు ఏం చేయగలిగారు! అలాంటి తప్పుడు పనులు చివరకు వాళ్లనే మింగేస్తాయి.
లోక్సభ ఎన్నికల్లో..
లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లో మంచి బలం ఉన్న నాయకులంతా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. దానివల్ల కొత్తవారిని ఎంచుకోవాల్సి వచ్చింది. అదే భాజపాలో ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అర్వింద్తోపాటు, ఈటల రాజేందర్ ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఎంపీగా పోటీచేశారు. వారికి అప్పటికే ప్రజల్లో గుర్తింపు ఉండటంవల్ల ఎంపీ ఎన్నికల్లో సానుకూలంగా మారింది. ఒకవేళ వారంతా ఎమ్మెల్యేలుగా గెలిచి ఉంటే భాజపాకు ఎంపీ అభ్యర్థులు దొరకడం కష్టమయ్యేది. ఈ ఎన్నికల్లో వ్యక్తిగత పోటీ కనిపించింది. కంటోన్మెంట్లో కాంగ్రెస్ను 13వేలతో గెలిపించిన ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో భాజపాకు 18వేల మెజార్టీ ఇచ్చారు. దాన్నిబట్టి ఎంత క్రాస్ ఓటింగ్ జరిగిందో ఊహించుకోవచ్చు.
ఈవీఎంలను తారుమారు చేయొచ్చేమో!
ఈవీఎంలను తారుమారు చేయడానికి అవకాశం ఉందనిపిస్తోంది. అయితే వాటిని ఎక్కడో కూర్చొని రిమోట్ ద్వారా మార్చవచ్చా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రతి ఎన్నికకు 15% ఈవీఎంలను అధికంగా పంపుతారు. వాటితో కూడా ఏదైనా చేయొచ్చేమో! ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కలెక్ట్ చేసుకొని ఎన్నిక పూర్తయిన తర్వాత మళ్లీ అదే సెంటర్లో ఒక రోజంతా పెడతారు. ఆ తర్వాత స్ట్రాంగ్రూమ్కు తరలిస్తారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద వాటిని ఉంచినప్పుడు పెద్దగా బందోబస్తు ఉండదు కాబట్టి అక్కడ అవకతవకలు చేయడానికి అవకాశం ఉందనిపిస్తోంది.
కొత్త రేషన్కార్డులు ఇస్తాం...
త్వరలో ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేసి కొత్త రేషన్కార్డులు ఇస్తాం. రాష్ట్రంలో వరి పండించే రైతులకు రూ.500 ప్రోత్సాహకం ఇస్తాం. సన్న వడ్లు పండించేలా వారిని ప్రోత్సహిస్తాం. వాటినే మిల్లింగ్ చేయించి రేషన్కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తాం. ఆ బియ్యాన్ని వినియోగదారులే తింటారు కాబట్టి బయట అమ్ముకొనే పరిస్థితి ఉండదు. దానివల్ల రీసైక్లింగ్ ఆగిపోతుంది’’ అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
భారాసకు చరిత్ర ఉంది.. భవిష్యత్తు లేదు
ప్రస్తుతం లోక్సభలో భారాసకు ఒక్క సీటుకూడా లేదని, ఆ పార్టీ పుట్టిన 25 ఏళ్లలో ఇంత దీనావస్థ ఎప్పుడూ కనిపించలేదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలే కాకుండా కేసీఆర్కూడా భారాస కోసం టార్చ్లైట్ వేసుకొని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు భారాస అన్నది గత చరిత్ర అన్నారు. ఆ పార్టీకి చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు లేదన్నారు. సమావేశంలో ఎంపీలు బలరాంనాయక్, అనిల్కుమార్యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పదవుల కోసం కొత్తగా గవర్నర్కు ప్రతిపాదనలు
ఎమ్మెల్సీ పదవులకు గత భారాస ప్రభుత్వం, అలాగే మేం వచ్చిన తర్వాత చేసిన సిఫార్సులన్నింటినీ రద్దు చేసి కొత్తగా గవర్నర్కు ప్రతిపాదనలు పంపుతాం. దానివల్ల సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
ఇప్పుడు రైతులు సన్న వడ్లు పండిస్తారు
గతంలో కేసీఆర్ దొడ్డు, సన్న వడ్లకు ఒకే రేటు ఇస్తామని చెప్పడంవల్లే రైతులు సన్న వడ్లు వేయలేదు. ఇప్పుడు మేం రూ.500 ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల రైతులు సన్న వడ్లు పండిస్తారు.
సీఎం రేవంత్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం
హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎనుముల రేవంత్రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిల మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. -
కమిటీల ద్వారా పరిష్కారం
విభజన చట్టంలోని పెండింగు సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కారమార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్లు తెలిపారు. -
కాళేశ్వరం పంపుహౌస్లపైనా విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ కమిషన్ పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్.. -
నైనీ కరెంటు కొంటారా?
దేశంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు రవాణా కన్నా కరెంటు సరఫరా వ్యయం తక్కువ అవుతుందని తాజాగా కేంద్ర విద్యుత్శాఖ రాష్ట్రాలకు సూచించింది. బొగ్గు గనులున్న ప్రాంతాల్లోనే థర్మల్ విద్యుత్కేంద్రాలను నిర్మిస్తే కరెంటు చౌకగా లభిస్తుంది. -
బాధ్యతల భారం.. పరిష్కారం దూరం!
రాష్ట్రంలో కాలుష్య సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు భారీగా పెరిగిపోతున్నాయి. అయినా. వాటి పరిష్కారానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కృష్ణ జింకలను పట్టుకోవాల్సిందే!
రాష్ట్రంలోని కృష్ణా నదీ తీర మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలో ఉన్న కృష్ణా నదీ తీరంలో మూడు వేల పైచిలుకు కృష్ణ జింకలున్నాయి. -
విమానాశ్రయాల్లో భద్రతపై అధ్యయనం!
విమానాశ్రయాల్లో భద్రత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటి నిర్మాణాలకు సంబంధించి భద్రతా వ్యవస్థను అధ్యయనం చేయించాలని ఆదేశించింది. అనంతరం నివేదికను పంపాలని అధికారులకు స్పష్టం చేసింది. -
తిరుమల తరహాలో యాదాద్రి స్వయంభువుల దర్శనం
తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభువుల దర్శనం కలగనుంది. దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకొంటూ.. -
ధాన్యం లేదు.. డబ్బులిస్తాం!
అన్నదాతల నుంచి సేకరించిన వడ్లను మరాడించి బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న రైస్మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా కఠినంగా వ్యవహరిస్తుండటంతో రూ.వందల కోట్ల బకాయిలు వసూలవుతున్నాయి. -
కమ్యూనిటీ వాలంటీర్లతో మధ్యవర్తిత్వం
కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తిత్వ చట్టాలపై అవగాహన కల్పించి వివాహ వ్యవస్థలోని తగాదాలు పరిష్కరించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ అధ్యక్షుడు జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు. -
కలెక్టర్ల వద్దే ఏజెన్సీ భూ వివాదాల పరిష్కారం
ఏజెన్సీల్లోని భూ వివాదాలను జిల్లా కలెక్టర్ల వద్దనే పరిష్కరించుకోవచ్చని ఆదిలాబాద్ కోర్టుల పోర్ట్ఫోలియో జడ్జి అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు
డోర్నకల్-భద్రాచలం స్టేషన్ల మధ్య లైన్ డబ్లింగ్ కోసం భూసేకరణ చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ లైన్ కోసం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, గార్ల మండలాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. -
ఎస్సీ గురుకుల సొసైటీలో పూర్తికాని తుది కేటాయింపులు
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం. 317కు సంబంధించిన ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇతర సంక్షేమ సొసైటీల్లో సాంకేతిక పొరపాట్లకు అవకాశం లేకుండా తుది కేటాయింపులు పూర్తయ్యాయి. -
దండు మల్కాపూర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి
యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు వద్ద హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) కోరింది. -
దేవాదుల సొరంగం ప్రారంభమయ్యేనా?
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశలో నిర్మించిన సొరంగం పూర్తయితే లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఈ టన్నెలే. -
నిరుపయోగ బొగ్గు గనుల నుంచి జల విద్యుత్
విద్యుదుత్పత్తి పెంచేందుకు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు(పీఎస్పీపీ) నిర్మించాలని సింగరేణి సంస్థ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ యాజమాన్యంలో పీఎస్పీపీ నిర్మాణం కోసం కసరత్తు చేస్తోంది. -
ఉత్తర భాగానికి రూ.5వేల కోట్లు!
హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్కు ఆర్థిక అవస్థలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అవతల నుంచి 2 భాగాలుగా ప్రాంతీయ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)ను తలపెట్టిన విషయం తెలిసిందే. -
రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. -
ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు తెలంగాణ యాత్రికుల దుర్మరణం
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. చమోలీ జిల్లా కర్ణప్రయాగ, గౌచర్ల మధ్యలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు తెలంగాణవాసులు మృతి.. -
సింగపూర్లో కోదాడ యువకుడి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ యువకుడు సింగపూర్లో మృతి చెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ (30) సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ