- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
CM Revanth Reddy: ఎన్హెచ్ఎం నిధులు విడుదల చేయండి
జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ వినతి
రాహుల్ గాంధీ, రాష్ట్ర ఎంపీల ప్రమాణానికి సీఎం హాజరు
ఈనాడు - దిల్లీ
కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీనడ్డాకు పుష్పగుచ్ఛమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం దిల్లీలోని పార్లమెంటు భవనంలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో వైద్యసేవలను మెరుగుపరిచేందుకు, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం నిబంధనలన్నింటినీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 5,519 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఎం పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.323.73 కోట్లు, 2024-25లో మొదటి త్రైమాసికానికి సంబంధించి రూ.138 కోట్లు, 2023-24లో రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన రూ.231.40 కోట్లు కలిపి మొత్తం రూ.693.13 కోట్లు రావాల్సి ఉన్నట్లు కేంద్రమంత్రికి విన్నవించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమైనా అత్యవసర వైద్యసేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బంది ఇబ్బందులు పడకుండా 2023 అక్టోబరు నుంచి రాష్ట్ర వాటాతోపాటు కేంద్ర వాటానూ తామే విడుదల చేస్తూ వస్తున్నామని జేపీ నడ్డా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్కుమార్యాదవ్, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్రెడ్డి ఉన్నారు.
ఎంపీల ప్రమాణానికి హాజరైన సందర్భంగా లోక్సభ లాబీలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు
సోనియాగాంధీతో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో ప్రియాంకా గాంధీ
గ్యాలరీ నుంచి తిలకించి..
తెలంగాణ ఎంపీలు, రాహుల్గాంధీ ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు. 18వ లోక్సభ సభ్యులుగా వారి ప్రమాణాన్ని ఆయన లోక్సభ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా చూశారు. ఆయనతోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాజీ మంత్రి జానారెడ్డి ఉన్నారు. అనంతరం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీలను కలిశారు. సోనియాగాంధీతో కొంతసేపు మాట్లాడారు.
ఎంపీల ప్రమాణానికి హాజరైన సందర్భంగా కొత్త పార్లమెంటు భవనం ముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ రఘువీర్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీలు రాజీవ్శుక్లా, బలరాంనాయక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. -
పోలవరం విధ్వంసం.. రూ.వేల కోట్ల నష్టం
జగన్ దుస్సాహసంతోనే పోలవరం ప్రాజెక్టు సర్వనాశమైపోయిందని.. ఈ విధ్వంసం వల్ల ఇప్పటికే రూ.వేల కోట్ల నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన గవర్నర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమల-అలిపిరి మొదటి ఘాట్ రోడ్డుకు అతి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. -
కుటుంబానికి రూ.2 లక్షలు!
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. -
వీడుతున్న చిక్కుముడులు
హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) రెండు భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ పేర్కొంది. అయితే దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండకపోయినా.. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. -
ఊరూరా మీసేవ కేంద్రాలు
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవ కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
కృష్ణపట్టి ఏరియాలో పెద్దపులి సంచారం
కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని ఆవరించి ఉన్న నల్లమల అభయారణ్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కంబాలపల్లి రేంజ్, సర్కిల్తండా, కంబాలపల్లి గ్రామ శివార్లలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచరించినట్లు శుక్రవారం అధికారులు ధ్రువీకరించారు. -
ఆరోగ్య, ఆహార అలవాట్లపై ‘న్యూట్రిషన్ అట్లాస్’
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య పరిస్థితులపై తాజా సమగ్ర సమాచారాన్ని ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ (భారతీయ వైద్య పరిశోధన మండలి - జాతీయ పోషకాహార సంస్థ) అందుబాటులోకి తెచ్చింది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
కార్మికుల భద్రత గాల్లో దీపమే
రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత కొరవడుతోంది. -
బాసర ఆలయ ప్రసాదాల్లో చేతివాటం
బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని తయారీ కేంద్రం వద్ద రిజిస్టర్లో తక్కువ సంఖ్యలో ప్రసాదాలను నమోదు చేసి కౌంటర్లో ఎక్కువ సంఖ్యలో విక్రయిస్తూ వచ్చిన డబ్బును కాజేస్తున్న సిబ్బందిపై వేటు పడింది. -
నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. -
నీట్ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి
నీట్ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. -
రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు జగజీత్సింగ్ దల్లేవాల్, నల్లమల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. -
435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్లో 431, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)లో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఆర్ఎస్బీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
మహిళా సూపరింటెండెంట్ ఆరోపణలపై నేడు విచారణ
సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి తనను వేధించారంటూ మహిళా సూపరింటెండెంట్ డి.జయలక్ష్మి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. -
జీవో నం.317 కేటాయింపు సమస్యల పరిష్కారం
ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం.317 కింద ఉపాధ్యాయ, అధ్యాపకుల కేటాయింపులో ఆఫ్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది. -
ఏడుగురు తహసీల్దార్లకు ఎన్నికల తిరుగు బదిలీ
ఈ నెలతోపాటు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ఏడుగురు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ బదిలీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
-
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్ధాఖ్లో ఐదుగురు జవాన్లు గల్లంతు
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
పంచశీల ఒప్పందం భేష్.. నెహ్రూ విధానాలపై చైనా అధ్యక్షుడి ప్రశంసలు
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
-
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?