- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Revanth Reddy: 25 లక్షల ఇళ్లు ఇవ్వండి
సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలి
హైదరాబాద్కు ఐటీఐఆర్ను పునరుద్ధరించాలి
2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి
ఈనాడు - దిల్లీ
ప్రధాని మోదీకి జ్ఞాపికను బహూకరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్ 3 గనులనూ సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనులు కీలకమైనందున అన్నింటినీ సింగరేణికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి గురువారం మధ్యాహ్నం ఇక్కడి లోక కల్యాణ్ మార్గ్లో సీఎం ప్రధానమంత్రి మోదీతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై ప్రధానితో సీఎం చర్చించారు. అంతక్రితం హోంమంత్రి అమతిషాను కలిశారు.
ప్రధానికి సీఎం వినతులు ఇలా...
- 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్కు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) మంజూరు చేసింది. 2014 తర్వాత అది ముందుకు సాగలేదు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలి.
- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో తగినంత భూమి అందుబాటులో ఉన్నందున అక్కడ ఐఐఎం ఏర్పాటుచేయాలి. అక్కడ కాకుండా మరెక్కడైనా ఏర్పాటు చేస్తామన్నా భూ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రానికి కొత్తగా 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలి.
- రాష్ట్ర పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. కోచ్ తయారీ కేంద్రానికి బదులు ఇక్కడ పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం దాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం భావ్యంకాదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేయండి.
- హైదరాబాద్లో సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో తెలంగాణను చేర్చాలి.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తలపెట్టిన 3 కోట్ల గృహాల్లో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- రాజధాని హైదరాబాద్లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్-నాగ్పుర్ రహదారి (ఎన్హెచ్-44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి వీలుగా మార్గంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. అలాగే హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని 2,450 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాలను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయి. అందువల్ల వెంటనే ఉక్కు కర్మాగార ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి.
- భారత్మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు)లో జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆ రహదారి భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. అందువల్ల ఈ రహదారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలి. హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉపయోగంగా ఉండే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) జాతీయ రహదారిగా గుర్తించి, వెంటనే భారత్మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలి.
- తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలి. జగిత్యాల-పెద్దపల్లి-కాటారం, డిండి-దేవరకొండ-మల్లెపల్లి-నల్గొండ, భువనగిరి-చిట్యాల, చౌటుప్పల్-ఆమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి, మరికల్-నారాయణపేట-రామసముద్ర, వనపర్తి-కొత్తకోట-గద్వాల-మంత్రాలయం, మన్నెగూడ-వికారాబాద్-తాండూరు-జహీరాబాద్-బీదర్, కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్-గద్వాల-రాయచూర్, కొత్తపల్లి-హుస్నాబాద్-జనగామ-హైదరాబాద్, సారపాక-ఏటూరునాగారం, దుద్దెడ-కొమురవెల్లి-యాదగిరిగుట్ట-రాయగిరి క్రాస్ రోడ్, జగ్గయ్యపేట-వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక టెట్ ఏటా రెండుసార్లు
ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. -
విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం
హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎనుముల రేవంత్రెడ్డి, నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిల మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. -
కమిటీల ద్వారా పరిష్కారం
విభజన చట్టంలోని పెండింగు సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కారమార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్లు తెలిపారు. -
కాళేశ్వరం పంపుహౌస్లపైనా విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ కమిషన్ పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్.. -
నైనీ కరెంటు కొంటారా?
దేశంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు రవాణా కన్నా కరెంటు సరఫరా వ్యయం తక్కువ అవుతుందని తాజాగా కేంద్ర విద్యుత్శాఖ రాష్ట్రాలకు సూచించింది. బొగ్గు గనులున్న ప్రాంతాల్లోనే థర్మల్ విద్యుత్కేంద్రాలను నిర్మిస్తే కరెంటు చౌకగా లభిస్తుంది. -
బాధ్యతల భారం.. పరిష్కారం దూరం!
రాష్ట్రంలో కాలుష్య సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు భారీగా పెరిగిపోతున్నాయి. అయినా. వాటి పరిష్కారానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కృష్ణ జింకలను పట్టుకోవాల్సిందే!
రాష్ట్రంలోని కృష్ణా నదీ తీర మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలో ఉన్న కృష్ణా నదీ తీరంలో మూడు వేల పైచిలుకు కృష్ణ జింకలున్నాయి. -
విమానాశ్రయాల్లో భద్రతపై అధ్యయనం!
విమానాశ్రయాల్లో భద్రత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటి నిర్మాణాలకు సంబంధించి భద్రతా వ్యవస్థను అధ్యయనం చేయించాలని ఆదేశించింది. అనంతరం నివేదికను పంపాలని అధికారులకు స్పష్టం చేసింది. -
తిరుమల తరహాలో యాదాద్రి స్వయంభువుల దర్శనం
తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభువుల దర్శనం కలగనుంది. దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకొంటూ.. -
ధాన్యం లేదు.. డబ్బులిస్తాం!
అన్నదాతల నుంచి సేకరించిన వడ్లను మరాడించి బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న రైస్మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా కఠినంగా వ్యవహరిస్తుండటంతో రూ.వందల కోట్ల బకాయిలు వసూలవుతున్నాయి. -
కమ్యూనిటీ వాలంటీర్లతో మధ్యవర్తిత్వం
కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తిత్వ చట్టాలపై అవగాహన కల్పించి వివాహ వ్యవస్థలోని తగాదాలు పరిష్కరించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ అధ్యక్షుడు జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు. -
కలెక్టర్ల వద్దే ఏజెన్సీ భూ వివాదాల పరిష్కారం
ఏజెన్సీల్లోని భూ వివాదాలను జిల్లా కలెక్టర్ల వద్దనే పరిష్కరించుకోవచ్చని ఆదిలాబాద్ కోర్టుల పోర్ట్ఫోలియో జడ్జి అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు
డోర్నకల్-భద్రాచలం స్టేషన్ల మధ్య లైన్ డబ్లింగ్ కోసం భూసేకరణ చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ లైన్ కోసం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, గార్ల మండలాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. -
ఎస్సీ గురుకుల సొసైటీలో పూర్తికాని తుది కేటాయింపులు
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం. 317కు సంబంధించిన ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇతర సంక్షేమ సొసైటీల్లో సాంకేతిక పొరపాట్లకు అవకాశం లేకుండా తుది కేటాయింపులు పూర్తయ్యాయి. -
దండు మల్కాపూర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించండి
యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు వద్ద హైదరాబాద్- విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) కోరింది. -
దేవాదుల సొరంగం ప్రారంభమయ్యేనా?
దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడో దశలో నిర్మించిన సొరంగం పూర్తయితే లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఈ టన్నెలే. -
నిరుపయోగ బొగ్గు గనుల నుంచి జల విద్యుత్
విద్యుదుత్పత్తి పెంచేందుకు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు(పీఎస్పీపీ) నిర్మించాలని సింగరేణి సంస్థ తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ యాజమాన్యంలో పీఎస్పీపీ నిర్మాణం కోసం కసరత్తు చేస్తోంది. -
ఉత్తర భాగానికి రూ.5వేల కోట్లు!
హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్కు ఆర్థిక అవస్థలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అవతల నుంచి 2 భాగాలుగా ప్రాంతీయ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)ను తలపెట్టిన విషయం తెలిసిందే. -
రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. -
ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు తెలంగాణ యాత్రికుల దుర్మరణం
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. చమోలీ జిల్లా కర్ణప్రయాగ, గౌచర్ల మధ్యలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు తెలంగాణవాసులు మృతి..