- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Crop Loan Waiver Scheme: కుటుంబానికి రూ.2 లక్షలు!
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు.
పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపదిక
బంగారంపై అప్పులకు పథకం వర్తించదు..
3, 4 రోజుల్లో మార్గదర్శకాలు
దీని తర్వాతే రూ.4 వేల పింఛనుపై దృష్టి
కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు
రుణాల రీస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం
దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు, దిల్లీ: రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత అయిదు రోజులుగా దిల్లీలో ఉన్న సీఎం.. శుక్రవారం తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్రెడ్డి తెలిపారు. పట్టాదారు పాస్పుస్తకాల ఆధారంగా పంట రుణాలను లెక్కిస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా.. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందన్నారు. రూ.2 లక్షల మేర తీసుకున్న రుణాలు రూ.6-7 వేల కోట్లు ఉండవచ్చని ఆయన అంచనాగా చెప్పారు. అత్యధికంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సన్న, చిన్నకారు రైతులు తీసుకున్న రుణాలే ఉంటాయన్నారు. రుణమాఫీ పూర్తయిన తర్వాత పింఛన్లు రూ.4 వేలకు పెంపుపై దృష్టి సారిస్తామన్నారు. ముఖ్యమంత్రి వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..
పదవుల్లో సామాజిక న్యాయం
‘‘మంత్రివర్గ విస్తరణపై చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఆరు పదవులను భర్తీ చేయాలా? లేదా? అనేది పరిశీలిస్తాం. పీసీసీ అధ్యక్ష నియామకం, మంత్రివర్గ విస్తరణ అన్నీ ఒకేసారి పూర్తి చేస్తాం. మంత్రులు, పీసీసీ పదవి విషయంలో సామాజిక న్యాయం పాటిస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు 50% పదవులు ఉండాలన్నది కాంగ్రెస్ నిబంధన. పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఉండవు. కాంగ్రెస్ బీ ఫాంపై గెలిచినవారికే ఇస్తాం. పీసీసీ అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలా? ఇప్పటికే పదవిలో ఉన్న వారికి ఇవ్వాలా? అనే అంశాలపై చర్చించలేదు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుల పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త సభ్యులను నియమించాక కులగణన మొదలుపెడతాం.
గతంలోనూ ఫిరాయింపులు జరిగాయి
పార్టీ ఫిరాయింపులు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. కేసీఆర్ హయాంలోనూ జరిగాయి. ఏపీలో చంద్రబాబు, జగన్మోహన్రెడ్డి హయాంలోనూ చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపుర్, అరుణాచల్ప్రదేశ్లో పెద్ద ఎత్తున జరిగాయి. తెలుగుదేశానికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను ఏకంగా భాజపాలోకి విలీనం చేసుకున్నారు.
కేంద్ర బడ్జెట్ తర్వాతే రాష్ట్రంలో..
కేంద్ర బడ్జెట్ పెట్టిన ఒకట్రెండు రోజుల్లోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తాం. గత బడ్జెట్లో చెప్పిన రాబడిలో 60 శాతమే వచ్చింది. 40% కాగితాలకే పరిమితమైంది. ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే వాస్తవ అంచనాలతో బడ్జెట్ రూపొందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిపై ఇదివరకే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడాం. ఎన్నికలు రావడంతో ఆ చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టాల్సి ఉంది. తక్కువ వడ్డీకి కొత్త అప్పులు తీసుకొని ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలను చెల్లించాలనుకుంటున్నాం. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పుంది. పెండింగ్ బిల్లులు రూ.లక్ష కోట్లు ఉన్నాయి. అప్పులపై 1% వడ్డీ భారం తగ్గినా ఏడాదికి రూ.7 వేల కోట్లు ఆదా అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన 2014లో రుణాల చెల్లింపు మొత్తం ఏడాదికి రూ.6,500 కోట్లు ఉంటే ఇప్పుడు నెలకే రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది.
ఉన్న అధికారులనే వినియోగించుకుంటాం
ఉన్నవారిలో ఉత్తమంగా పనిచేసే అధికారుల సేవలను వినియోగించుకుంటున్నాం. చూసేవారికి పెద్దమార్పు కనిపించకపోయినా ఫర్వాలేదు. ప్రజలకు నష్టం జరగకపోతే చాలు. మార్పు చూపించాలన్న అత్యుత్సాహంతో అడ్డదారులు తొక్కితే నష్టం జరుగుతుంది. నేను అధికారం చేపట్టిన 200 రోజుల్లో 100 రోజులు ఎన్నికలకే సరిపోయింది. గత పాలకులు ఏదో చేశారన్న కక్షతో దాన్ని చెడగొట్టాలని చూస్తే అమరావతిలో పిచ్చిచెట్లు పెంచినట్లే అవుతుంది. కలెక్టర్లు, ఎస్పీలతోనే క్షేత్రస్థాయిలో పరిపాలన జరుగుతుంది కనుక వారిని పూర్తిస్థాయిలో మార్చాం. ఉన్నతస్థాయిలో అందుబాటులో ఉన్న అధికారులను కొనసాగిస్తున్నాం.
జిల్లాలు, మండలాల పునర్విభజనకు కమిషన్
జిల్లాల సంఖ్య కుదిస్తామని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఉన్న వాటిని హేతుబద్ధీకరించేందుకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. ప్రస్తుత 33 జిల్లాల్లో ఒక దాంట్లో కోటి జనాభా ఉంటే మరో దాంట్లో మూడు లక్షల మందే ఉన్నారు. అందుకే వీటిని హేతుబద్ధీకరించాలి. మండలాలు కూడా ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొత్తగా వచ్చిన వాటన్నింటినీ తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పాటు చేశారు తప్ప.. ప్రస్తుత జనాభా, అభివృద్ధి, అవసరాల ప్రాతిపదికన చేయలేదు. వీటిపై బడ్జెట్ సమావేశాల్లో అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటాం.
ఉపసంఘం సిఫార్సుల మేరకు రైతు భరోసా
రైతుభరోసా పథకం విధివిధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం చేసే సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రైతుబంధు కింద కేసీఆర్ రూ.75 వేల కోట్లు ఇస్తే అందులో రూ.25 వేల కోట్లు అనర్హులకే వెళ్లింది. వారి నుంచి రికవరీ చేయడం గురించి ఆలోచించడంలేదు. ధరణి లోపాలను సరిదిద్దే పని జరుగుతోంది. దాని స్థానంలో భూభారతి వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లిస్తున్నందున ఆర్టీసీకి ఆదాయం పెరిగి నష్టాలు లేని స్థితికి చేరింది. త్వరలో లాభాల్లోకి వస్తుంది. ఆక్యుపెన్సీ 80%కి పెరిగింది. ఉచిత బస్సు సౌకర్యం వల్ల చాలామంది మహిళలు పుణ్యక్షేత్రాలకు వెళ్తుండడంతో ఆలయాల ఆదాయం పెరిగింది.
కొత్త విమానాశ్రయాలపై దృష్టి
వరంగల్, ఆదిలాబాద్లలో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్ జీఎంఆర్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్పోర్టు ఉండకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ 148 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల భద్రాచలంవైపు కొత్త ఎయిర్పోర్టు నిర్మిస్తే ఈ నిబంధన వర్తించదు. కొత్త ఎయిర్పోర్టులకు లాభదాయకత ఉంటుంది. వరంగల్ నుంచి తిరుపతి, వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా విమానాలు నడిపితే మంచి డిమాండ్ ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్తు కొరతే లేదు. ఎక్కడో సాంకేతిక కారణాల వల్ల తలెత్తే సమస్యను కొందరు కోత అని ప్రచారం చేస్తున్నారు.
ఉచితాలు ‘అనవసరం’ కాదు
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలను అనవసర ఖర్చుగా పరిగణించకూడదు. మోదీ ఈ పదేళ్లలో కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. దాంతో పోలిస్తే ఉచిత పథకాల కింద ప్రజలకు అందిస్తున్నందెంత? కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేస్తే ప్రోత్సాహకం, పేదలు, రైతులకు ఇస్తే సబ్సిడీ అంటున్నారు. ఇది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది.
అదానీకి ఆస్తులు రాసివ్వడంలేదు..
మోదీకి అదానీ మిత్రుడని మాట్లాడిన మేం.. ఇప్పుడు పాతబస్తీలో విద్యుత్తు పంపిణీని అప్పగిస్తే విమర్శలొస్తాయన్నది నిజమే. కానీ మేం మోదీలా ప్రభుత్వరంగ సంస్థలను అదానీకి రాసివ్వడంలేదు. అలా ఇవ్వడాన్ని రాహుల్గాంధీ ప్రశ్నించారు తప్ప.. అసలు వ్యాపారమే చేయకూడదని చెప్పలేదు. మేం అదానీనీ విద్యుత్తురంగంలో పెట్టుబడులు పెట్టమనే కోరుతున్నాం. ఆయనకు ఎలాంటి ఆస్తులూ రాసివ్వడంలేదు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా ఆహ్వానిస్తాం. ఆగస్టులో అమెరికాకు వెళ్లినప్పుడు రాష్ట్రంలో టెస్లా ప్లాంట్ పెట్టే అంశంపై ఎలాన్మస్క్తో మాట్లాడి ఆహ్వానించే ప్రయత్నం చేస్తా
కాంగ్రెస్లోకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్ఛం అందిస్తున్న
ఎమ్మెల్యే కాలె యాదయ్య. చిత్రంలో సంపత్కుమార్, దీపా దాస్మున్షీ
చేవెళ్ల భారాస ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అనంతరం ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీలు యాదయ్యను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఇప్పటికే భారాస నుంచి ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, సంజయ్కుమార్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు యాదయ్య చేరికతో ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. కాంగ్రెస్లో ఇంకా ఎంతమంది చేరబోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని విలేకరులు ప్రశ్నించగా.. చేరినప్పుడు మీకే చెబుతామని బదులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎన్హెచ్ఏఐ(జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. -
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. -
కోడింగ్కు కేంద్రంగా హైదరాబాద్
కోడింగ్లో హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్ రాయదుర్గం టీహబ్లో ఆదివారం ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్వుడ్ 2024 సమిట్ (ద్వి వార్షిక సదస్సు) నిర్వహించారు. -
కొత్త ద్వీపం అందం అదరహో..!
చుట్టూ నీరు.. మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అనడం సహజం. ఇలాంటి దృశ్యాలు నదులు, సముద్రాలు, సరస్సుల్లో కనిపిస్తుంటాయి. -
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం (ఎంపీ లాడ్స్) వ్యయం ఇకపై ఆన్లైన్ వేదికగా జరగనుంది. -
దార్శనిక నేత వెంకయ్యనాయుడు
దేశ ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజకీయాలను, అధికారాన్ని ప్రజలకు సేవచేసే మార్గంగాఎంచుకుని ముందుకు సాగిన నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
వసతుల్లేని వర్సిటీలు!
ఉన్నత చదువులు చదివి.. జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు, ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు వస్తున్న విద్యార్థులకు కనీస సదుపాయాల కొరత పరీక్ష పెడుతోంది. -
తెలంగాణ ఏర్పాటులో డీఎస్ పాత్ర కీలకం
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని.. ఆయన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
10 మంది విద్యార్థులు మించితే.. ఇద్దరు టీచర్లు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు. -
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో 5.1 సెం.మీటర్లు కురిసింది. -
అరుదైన రాజనీతిజ్ఞుడు
భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడికి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా. -
నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలం
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆసుపత్రిలో వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్తో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. -
సింగరేణి.. మొక్కల గని..!
అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతం సింగరేణి పరిధి రామగుండం ఏరియాలో బొగ్గు తవ్వకం తాలూకు మట్టి కుప్పలు నిండిన ప్రదేశం అంటే నమ్మగలమా. -
పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దేశం పారిశ్రామికంగా సుస్థిరాభివృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
చుక్ చుక్ బండి.. పట్టాల కింది నుంచీ వెళ్తుందండి..!
నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది. -
న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి
దేశ న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అడిగే పరిస్థితి ఉందా.. అన్న అంశంపై చర్చ జరగాలన్నారు. -
రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. దివంగత నేత ఎన్టీఆర్కూ ఆ అవార్డు ఇవ్వాలని అన్నారు. -
ఇదీ సంగతి!
అది ఉద్యోగులకే..మనకు కాదు!! -
1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఏకంగా 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. -
మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలన!
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లలోనూ ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్ల పదవీకాలం జులై 3, 4 తేదీల్లో ముగియనుండగా.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకం చేపట్టనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి