- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
NMDC: ఎన్ఎండీసీ సీఎండీ పోస్టుకు శ్రీధర్ పేరును తిరస్కరించిన కేంద్రం
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) సీఎండీ పోస్టులో తెలంగాణ ఐఏఎస్ అధికారి నడిమట్ల శ్రీధర్ను నియమించేందుకు కేంద్ర క్యాబినెట్ కమిటీ తిరస్కరించిందని అధికారవర్గాలు తెలిపాయి.
సింగరేణిలో అవినీతిపై ఫిర్యాదులే కారణం!
ఈనాడు, హైదరాబాద్: జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) సీఎండీ పోస్టులో తెలంగాణ ఐఏఎస్ అధికారి నడిమట్ల శ్రీధర్ను నియమించేందుకు కేంద్ర క్యాబినెట్ కమిటీ తిరస్కరించిందని అధికారవర్గాలు తెలిపాయి. గతేడాది మార్చిలో సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్ను ఎన్ఎండీసీ సీఎండీగా నియమించేందుకు.. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పీఈఎస్బీ) కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే కేంద్ర మంత్రివర్గ కమిటీ దీనిపై అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. తాజాగా జూన్ 30న జరిగిన సమావేశంలో శ్రీధర్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గ కమిటీ రద్దు చేసింది. మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. గతంలో సింగరేణి సీఎండీగా పనిచేసిన సమయంలో శ్రీధర్ అవినీతికి పాల్పడినట్లు కేంద్రానికి అందిన ఫిర్యాదులే ఈ తిరస్కరణకు కారణమని సమాచారం. ఆయన పనితీరుపై అప్పట్లోనే కేంద్ర బొగ్గు శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. -
లాభమా? నష్టమా?
ఒక సంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఒకరు అధిక పింఛను కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేశారు. దాన్ని పరిశీలించిన ఈపీఎఫ్వో ఆయనకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఈపీఎస్కు బకాయిల కింద రూ.21 లక్షలు కట్టాలని అందులో పేర్కొంది. -
మొత్తం పోస్టులా? పనిచేస్తున్న వారి సంఖ్యా?
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలపై స్పష్టత కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో.. వైద్య, ఆరోగ్యశాఖలో ఎలా అమలు చేస్తారన్న అంశంపై ఆ శాఖలో చర్చ జరుగుతోంది. -
‘సీఎస్ఈ సీట్లు ఇలా పెంచితే ఎలా..’
రాష్ట్రంలో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను తగ్గిస్తూ.. సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో సీట్లను ఏటేటా విపరీతంగా పెంచడం మంచిది కాదని, ఇది భవిష్యత్తులో పలు విపరిణామాలకు దారితీస్తుందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి జేఎన్టీయూహెచ్ గురువారం లేఖ రాసింది. -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేం
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వివాదాల్లో విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని హైకోర్టు గురువారం తేల్చి చెప్పింది. పదోన్నతులు, బదిలీలు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉంటాయని, మధ్యలో చేపట్టినట్లయితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. -
సత్వరం.. అత్యవసర వైద్యం!
ప్రజలకు సత్వరం అత్యవసర వైద్య సేవలు అందేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వ వైద్య వసతులను మ్యాపింగ్ చేయనుంది. భవిష్యత్తులో ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ వైద్య వసతి ఉండాలనే ప్రణాళిక నేపథ్యంలో ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమం చేపట్టింది. -
మల్లారెడ్డి ‘ఆఫ్ క్యాంపస్ కేంద్రం’పై చర్యలు తీసుకోండి: హైకోర్టు
అనుమతుల్లేకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ.. హైదరాబాద్ బాలానగర్లో ఏర్పాటు చేసిన ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. -
క్యూఆర్ కోడ్తో విద్యుత్తు బిల్లు
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) బిల్లు చెల్లింపులో కొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. -
రోడ్డు భద్రతకు ‘ట్రాఫిక్ వాలంటీర్లు’!
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న వాహనాలు.. నిబంధనలపై వాహనదారుల అవగాహనలేమి, నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాలూ పెరుగుతున్నాయి. -
‘విశ్వంభర’ పురస్కారానికి శివశంకరి ఎంపిక
ప్రతిష్ఠాత్మకమైన ‘విశ్వంభర’ డా.సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం సుప్రసిద్ధ తమిళ రచయిత్రి, సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత శివశంకరి ఎంపికయ్యారు. -
గురుకులాల్లో ఉమ్మడి టైంటేబుల్ను తొలగించాలి
సంక్షేమ గురుకులాల్లో ఉమ్మడి టైంటేబుల్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ ఎస్సీ గురుకుల టీచర్లు, -
న్యాయవాదుల పరిహారం రూ.4 నుంచి రూ.6 లక్షలకు పెంపు
రాష్ట్ర బార్ కౌన్సిల్లో నమోదై సంక్షేమ నిధిలో సభ్యత్వం ఉన్న న్యాయవాదులు మృతిచెందితే వారి కుటుంబసభ్యులకు ఇచ్చే పరిహారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి గురువారం వెల్లడించారు. -
7, 8 తేదీల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 7న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్,
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?