Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.

Published : 29 Jun 2024 05:30 IST

మల్యాల, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శనివారం ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక భద్రత ఎస్పీ అర్జున్‌ శుక్రవారం మధ్యాహ్నం కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని