- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
PM Modi - Olympics: 2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్ 2036 పోటీలకు ఆతిథ్య ఇచ్చేందుకు భారత్ బిడ్డింగ్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మరికొద్ది రోజుల్లో పారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్ 2024 కోసం ఎంపికైన అథ్లెట్లతో ప్రధాని గురువారం భేటీ అయిన సంగతి తెలిసిందే. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే భారత్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత క్రీడల పండుగను నిర్వహించేందుకు విలువైన సలహాలు ఇవ్వాలని కోరారు. అథ్లెట్లతో మోదీ భేటీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘‘మనం ఒలింపిక్స్ను సమర్థవంతంగా నిర్వహించగలమనే నమ్మకం ఉంది. దీని వల్ల దేశ క్రీడా రంగం మరింత విస్తరించేందుకు అవకాశం కలుగుతుంది. అందుకోసం మౌలికవసతుల కల్పన కొనసాగుతోంది. మీరు (అథ్లెట్లను) ఈవెంట్లతో బిజీగా ఉన్నప్పుడు కాకుండా.. విరామం సమయంలో క్రీడా రంగం కోసం ఏదైనా చేయమని కోరుతున్నా. సదుపాయాలకు సంబంధించి మీ పరిశీలనకు వచ్చిన విషయాలను పంచుకోండి. మీరిచ్చే సూచనలు, సలహాలు 2036 బిడ్డింగ్కు ఉపయోగపడతాయి. మరింత ఉత్తమంగా ఎలా సిద్ధం కావచ్చనే దానిపై మాకూ అవగాహన వస్తుంది’’ అని ప్రధాని మోదీ తెలిపారు.
చుర్మా రుచి చూపిస్తా: ప్రధానికి నీరజ్ హామీ
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో నీరజ్ చోప్రా మాట్లాడాడు. ఈ సందర్భంగా ప్రధానికి ‘చుర్మా’ (మిఠాయి) తినిపిస్తానని ప్రామిస్ చేశాడు. ‘‘ట్రైనింగ్ బాగా సాగుతోంది. గాయాల బారిన పడకుండా ఉండాలని మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం లేదు. ఇటీవల ఫిన్ల్యాండ్లో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించా. అథ్లెట్లు నిర్భయంగా ఆడేయండి. నేను బంగారం పతకం సాధించిన గేమ్స్లో అలానే ఆడా. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగితే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈసారి ఒలింపిక్స్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. మెరుగైన ఫలితం సాధించి మళ్లీ మిమ్మల్ని (ప్రధానిని) కలుస్తాం. అప్పుడు మీకు ‘చుర్మా’ రుచి చూపిస్తాను’’ అని నీరజ్ చోప్రా తెలిపాడు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ.. ‘మీ అమ్మగారి చేతితో తయారు చేసే చుర్మా అంటే నాకు ఇష్టం’ అని అన్నారు.
ఇది నాకు మూడో ఒలింపిక్స్: సింధు
‘‘కొత్తగా బరిలోకి దిగుతున్న క్రీడాకారులకు ఆల్ది బెస్ట్. దేశం తరఫున ఆడటం ఎప్పుడూ ఒత్తిడితో కూడుకున్నదే. అయితే, దీనిని ఒక టోర్నీలా భావించి వంద శాతం కష్టపడితే సత్ఫలితాలు సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మూడో ఒలింపిక్స్ ఆడబోతున్నా. అయితే, ఈ గేమ్స్లో ఆడటం అంత సులువేం కాదు’’ అని తెలుగు తేజం పీవీ సింధు తెలిపింది. ‘‘ఇది డెబ్యూ ఒలింపిక్స్. ఎంతో ఉత్సాహంగా ఉన్నా. అదే సమయంలో నా దృష్టంతా గేమ్పైనే ఉంది. అభిమానుల అంచనాలను అందుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తా’’ అని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఆశాభావం వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
ఇటీవల టీమ్ఇండియాతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
భారత జెర్సీని ధరించే అవకాశం వస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. అయితే, యువ క్రికెటర్ నితీశ్కు పిలుపు వచ్చినా.. గాయం కారణంగా జింబాబ్వే సిరీస్కు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న రెండో టీ20 ప్రపంచ కప్ను రోహిత్ శర్మ అందించాడు. వచ్చే ఏడాది మరో రెండు కీలక లక్ష్యాలు హిట్మ్యాన్ ముంగిట ఉన్నాయి. -
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
టెన్నిస్ క్రీడాకారుల ఆన్లైన్ ప్రైవసీని కాపాడేందుకు వింబుల్డన్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘ఏఐ’ని పరిచయం చేశారు. -
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల్లో ఏకంగా 2 కోట్ల లైక్స్ను సొంతం చేసుకొంది. -
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు వేడుకను భార్య సాక్షి, మిత్రులతో కలిసి చేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. -
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా రిషభ్ పంత్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. -
యువ భారత్ బోల్తా
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది. -
పోర్చుగల్ షూటౌట్
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్షిప్ను ఓటమితో ముగించాడు. -
రజావత్ సంచలనం
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలన విజయం సాధించాడు. -
ఇంగ్లాండ్ గట్టెక్కింది
ఫుట్బాల్లో స్విట్జర్లాండ్తో పోరంటే ఇంగ్లాండ్ను ఫేవరెట్గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్షిప్ గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్లో ఆ జట్టు ఫేవరెట్గానే బరిలోకి దిగింది. -
స్వైటెక్కు షాక్
వింబుల్డన్లో పెద్ద సంచలనం! టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్సీడ్కు కజకిస్థాన్ అన్సీడెడ్ ప్లేయర్ యూలియా పుటిన్సెవా చెక్ పెట్టింది. -
నేను ఆ తరహా కాదు
టీమ్ఇండియా కోచ్గా తాను కెప్టెన్ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. -
వినేశ్కు స్వర్ణం
గ్రాండ్ప్రి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్
-
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
-
సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్ఆర్ ఆంజనేయులు చక్కర్లు
-
ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్ సేన్
-
కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు