- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Saurabh Netravalkar: పాక్కు ‘సూపర్’ షాకిచ్చిన ముంబయి ఇంజినీర్.. ఎవరీ సౌరభ్ నేత్రావల్కర్?
Saurabh Netravalkar: పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే అమెరికా సంచలన విజయాన్ని అందుకుంది. సూపర్ ఓవర్లో పాకిస్థాన్పై అద్భుతంగా బౌలింగ్ చేసిన సౌరభ్ నేత్రావల్కర్ సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ టోర్నీ (T20 World Cup 2024)లో అమెరికా అద్భుత విజయం వెనుక ఓ భారత హీరో ఉన్నాడు. పద్నాలుగేళ్ల కిందటే తన బౌలింగ్తో పాకిస్థాన్ (USA vs PAK)కు చుక్కలు చూపించిన అతడు.. ఇప్పుడు మళ్లీ బాబర్ జట్టును కంగుతినిపించాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ కూల్గా బౌలింగ్ చేసి అమెరికాకు ‘సూపర్’ విక్టరీ అందించాడు. అతడే సౌరభ్ నేత్రావల్కర్ (Saurabh Netravalkar). వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన అతడు క్రికెట్పై మమకారంతో బంతి అందుకుని సంచలనం సృష్టించాడు. దీంతో సౌరభ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఇంతకీ ఎవరీ నేత్రావల్కర్..?
ముంబయిలో పుట్టి.. భారత్కు ఆడి
భారత్కు చెందిన సౌరభ్ నరేశ్ నేత్రావల్కర్ 1991 అక్టోబరు 16న ముంబయిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్పై ఆసక్తి పెంచుకోవడమే గాక భారత్ తరఫున అండర్ -19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2010లో జరిగిన ఈ టోర్నీలో టీమ్ఇండియా (Team India) సభ్యుడిగా ఉన్నాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయ్దేవ్ ఉనద్కత్, సందీప్ శర్మ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ముంబయికి రంజీల్లో ప్రాతినిధ్యం వహించాడు. భారత్లో తీవ్రమైన పోటీ కారణంగా ఆ తర్వాత టీమ్ఇండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు.
చదువు కోసం అమెరికా వెళ్లి..
ప్రొఫెషనల్ క్రికెట్లో అవకాశాలు రాకపోవడంతో తిరిగి చదువుపై దృష్టి సారించాడు. 23 ఏళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఆ మరుసటి ఏడాది కార్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. అయినా ఆటపై ఇష్టాన్ని వదులుకోలేకపోయాడు. అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని ఎట్టకేలకు 2019లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై తొలి మ్యాచ్ ఆడాడు. అమెరికా జట్టుకు కొంతకాలం కెప్టెన్గానూ వ్యవహరించాడు. ఇప్పటి వరకు 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్లు ఆడాడు.
టీ20 ప్రపంచకప్లో పెను సంచలనం.. పాక్పై అమెరికా ‘సూపర్’ విక్టరీ
నాటి ఓటమికి ప్రతీకారం..
టీ20 ఫార్మాట్లో పాకిస్థాన్తో అమెరికా తలపడటం ఇదే తొలిసారి. నేత్రావల్కర్ (Software Engineer Saurabh Netravalkar)కు మాత్రం గతంలోనే బాబర్ జట్టును ఎదుర్కొన్న అనుభవం ఉంది. 2010 అండర్-19 ప్రపంచకప్ ఎడిషన్లో ఆడిన అతడు.. ఆ టోర్నీలో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం ఆరు మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ టోర్నీలో దాయాది చేతిలో భారత్కు ఓటమి ఎదురైంది. ఆ తర్వాత టీమ్ఇండియాకు దూరమైన సౌరభ్.. ఇప్పుడు అమెరికా జట్టులో ఆడి నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
గురువారం నాటి మ్యాచ్లోనూ నేత్రావల్కర్ పాక్ను అద్భుతంగా కట్టడి చేశాడు. అత్యంత పొదుపైన బౌలింగ్తో నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వేసిన తొలి మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చాడంటే బాబర్ జట్టును మనోడు ఎంత కంగారుపెట్టాడో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా జట్టు తరఫున ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైన తర్వాత నేత్రావల్కర్ మాట్లాడుతూ..‘‘ఇది చాలా భావోద్వేగ క్షణం. ఉన్నత చదువుల కోసం బ్యాగ్ సర్దుకుని అమెరికా వచ్చేశా. మళ్లీ క్రికెట్ ఆడుతానని కలలో కూడా ఊహించలేదు. నా క్రికెట్ షూ కూడా తెచ్చుకోలేదు’’ అని అన్నాడు. ప్రస్తుతం అతడు ఒరాకిల్ (Oracle)లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్స్ రికార్డు.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు!
-
‘ఇది కదా అసలైన గురుదక్షిణ’.. టీమ్ఇండియా విజయంపై ఆనంద్ మహీంద్రా
టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న సందర్భంగా భారత జట్టును ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. -
ఉత్కంఠ రేకెత్తించిన మ్యాచ్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే..
T20 World Cup: తీవ్ర ఉత్కంఠ మధ్య దక్షిణాఫ్రికాపై గెలుపొంది కప్పు కైవసం చేసుకుంది భారత క్రికెట్ టీమ్. ఈ పొట్టి కప్ కోసం జరిగిన తుది మ్యాచ్లో జట్టు అన్ని విభాగాల్లో రాణించింది. ఈ సందర్భంగా బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఎవరికొచ్చిందో చూద్దాం.. -
‘పిచ్’ టేస్ట్.. రోబో వాక్.. సూపర్ ఎండింగ్.. ఫన్ మూమెంట్స్!
దాదాపు పదిహేడేళ్ల తర్వాత భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో సఫారీ జట్టును ఓడించింది. -
కోచ్ ద్రవిడ్కు ఘనంగా వీడ్కోలు పలికిన టీమ్ఇండియా
దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో భారత్ విజయం సాధించి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకుంది. జట్టు గెలుపులో కోచ్ రాహుల్ ద్రవిడ్ది కీలక పాత్ర. కోచ్గా ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో.. మ్యాచ్ అనంతరం ఆయనకు టీమ్ఇండియా ఘనంగా వీడ్కోలు పలికింది.
-
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
కోహ్లీ, రోహిత్ టీ20 రిటైర్మెంట్.. ఇంతకంటే మంచి సందర్భం ఏం ఉంటుంది?: గౌతమ్ గంభీర్
భారత ప్రజలు గర్వించేలా టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ను గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
-
టీ20 ప్రపంచకప్ కైవసం.. కోహ్లీ, రోహిత్ భావోద్వేగం
టీ20 ప్రపంచ కప్ గెలిచేందుకు టీమ్ ఇండియాకు 17 ఏళ్ల నిరీక్షణ తప్పలేదు. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో విజయం సాధించి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకుంది. ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన విజయం దక్కడంతో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు.
-
‘‘ఆదర్శప్రాయమైన విజయం’’.. టీమ్ఇండియాకు ప్రధాని మోదీ ఫోన్
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న సందర్భంగా భారత జట్టును ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లతో ఆయన స్వయంగా మాట్లాడి అభినందించారు. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
నేనెప్పుడూ గణాంకాలు చూడను.. భారత్ గెలుపే ముఖ్యం: రోహిత్
టీ20ల నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు పలికేశాడు. పొట్టి కప్ విజేతగా నిలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ స్పందించాడు. -
టీమ్ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియాకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరికి టీమ్ఇండియా మహిళల జట్టు శుభాకాంక్షలు తెలిపింది.
-
ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్
ఐపీఎల్ సందర్భంగా ఎదురైనా అవమానాలను తట్టుకొని.. వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్య తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. -
గెలుపు సంబురంలో కోహ్లీ.. ఫ్యామిలీకి వీడియో కాల్!
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన ఆనందాన్ని కుటుంబంతో పంచుకున్నాడు.
-
టీమ్ఇండియా గెలుపు సంబరాలు.. అల్లరి పిల్లాడిలా మారిన రాహుల్ ద్రవిడ్!
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం జట్టు సభ్యులతో కలసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.
-
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..! -
కోహ్లీ డ్యాన్స్.. టీమ్ఇండియా ఆటగాళ్ల జోష్
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం టీమ్ సభ్యుతో కలసి విరాట్ కోహ్లీ చిందేశాడు.
-
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్, విరాట్ విజయ దరహాసం
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ట్రోఫీతో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.
-
రోహిత్ భుజాలపై కుమార్తె.. గుండె నిండా ఆనందం!
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్ అనంతరం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆకర్షించింది.
-
టీమ్ఇండియా దేశ ప్రజలందరినీ గర్వించేలా చేసింది: ఆమిర్ ఖాన్ ప్రశంసలు
టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్ఇండియాకు ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
-
కుటుంబంతో కలిసి బుమ్రా గెలుపు సంబరాలు
టీమ్ఇండియా ఆపద్బాంధవుడు జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటాడు. తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి, ఓ వికెట్ తీసి బుమ్రా గెలుపు వైపు మళ్లించాడు. ట్రోఫీని కైవసం చేసుకున్న అనంతరం బుమ్రా తన కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్స్ రికార్డు.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు!
-
ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలు: ఈవో రామారావు
-
‘ఇది కదా అసలైన గురుదక్షిణ’.. టీమ్ఇండియా విజయంపై ఆనంద్ మహీంద్రా
-
చనిపోయాక ‘గేట్స్’కు విరాళాలు ఉండవు - వారెన్ బఫెట్
-
స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించిన కేంద్రం
-
వినతుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా