- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rohit - Kohli: టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
టీ20 ప్రపంచకప్ ట్రోఫీ పట్టుకుని రోహిత్ శర్మతో కలిసి ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ మరోసారి పొట్టి కప్ను అందుకోవడంతో ఇటు ఆటగాళ్లు, అటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. కొంతమంది ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అనంతరం రోహిత్, కోహ్లీ జాతీయజెండాను తమ భుజాలపై కప్పుకుని టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో ఫొటోలు దిగారు. రోహిత్ శర్మ తన కుమార్తె సమైరాను భుజాలపైకి ఎత్తుకోగా.. విరాట్ వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకొని వారితో ఫొటోలు దిగాడు. ఈ చిత్రాలు రోహిత్, కోహ్లీల కెరీర్లోనేకాక భారత క్రికెట్ చరిత్రలోనూ మధుర జ్ఞాపకంగా ఉంటాయి.
రోహిత్తో ఈ ఐకానిక్ ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ బయటపెట్టాడు. వరల్డ్ కప్తో ఇద్దరం కలిసి ఫొటో దిగుదామని రోహిత్ను తానే కోరినట్లు కోహ్లీ చెప్పాడు. ‘‘టీ20 వరల్డ్ కప్ గెలవడం నాకే కాదు.. రోహిత్కు కూడా చాలా ప్రత్యేకం. అతని కుటుంబం ఇక్కడ ఉంది. సమైరా (రోహిత్ కుమార్తె) అతని భుజాలపై ఉంది. ఈ గెలుపు వెనక అతడి కృషి ఎంతో ఉంది. కాసేపు ట్రోఫీని పట్టుకోమని అతని (రోహిత్)కి చెప్పా. మా ఇద్దరి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అందుకే కలిసి ఫొటో దిగాం’’ అని కోహ్లీ స్టార్ స్పోర్ట్స్తో అన్నాడు.
రోహిత్, కోహ్లీ ఒకేసారి జట్టులో ఉండి వరల్డ్ కప్ సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రోహిత్ శర్మ భారత్ 2007 టీ20 ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అప్పటికి కోహ్లీ టీ20ల్లోకి అరంగేట్రం చేయలేదు. భారత్ 2011 ప్రపంచకప్ సాధించిన జట్టులో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అప్పుడు రోహిత్కు జట్టులో చోటు దక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
పదకొండేళ్లప్పుడు భారత్ ఓడిపోవడం చూసిన ఓ కుర్రాడు.. రెండు ప్రపంచ కప్లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్. -
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
వరల్డ్ కప్లో మ్యాచ్ ఆడేందుకు ప్రతి ఆటగాడూ ఉత్సాహం చూపిస్తాడు. ఇక పెద్ద జట్టుతో మ్యాచ్ అంటే సిద్ధంగా ఉంటారు. కానీ, బంగ్లాదేశ్ బౌలర్ మాత్రం అతి నిద్రతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. -
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. -
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
రోహిత్ వారసుడెవరు?
ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్.. మళ్లీ ఇప్పుడు భారత్ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్బై చెప్పాడు రోహిత్ శర్మ. -
అంతా కలలాగే..
టీ20 ప్రపంచకప్ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు. -
వింబుల్డన్ ఛాంపియన్కు చెక్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది. -
క్వార్టర్స్లో ఫ్రాన్స్
ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు యూరో 2024 క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. -
భారత జట్టులో సాయి, జితేష్
యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. -
పారిస్ ఒలింపిక్స్లో జ్యోతి!
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్ కోటాలో జ్యోతి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించాడు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!