- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Virat-Bumrah: బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ను (T20 World Cup 2024) టీమ్ఇండియా సొంతం చేసుకోవడంలో జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. పదునైన బౌలింగ్తో ప్రత్యర్థులను వణికించిన అతడు అత్యుత్తమ ఎకానమీతో బంతులేశాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అందుకే, అతడిని జాతి సంపదగా గుర్తించాలని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్నాడు. పొట్టి కప్ను నెగ్గిన తర్వాత స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబయిలో భారీ రోడ్షో జరిగింది. వాంఖడే మైదానంలో క్రికెటర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బుమ్రా గురించి కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఫైనల్ సందర్భంగా నేను కూడా ఒక దశలో మరోసారి కప్ చేజారిపోతుందా? అనుకున్నా. అయితే, చివరి ఐదు ఓవర్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వేసిన ఆ రెండు ఓవర్లు అద్భుతం. ఎంతో ప్రత్యేకం. ప్రతిసారి మ్యాచ్లో మనల్ని విజయం వైపు నడిపించిన బుమ్రాపై వెల్లువెత్తిన ప్రశంసలు ఆనందం కలిగించాయి. ఎంతకాలం భారత జట్టు తరఫున ఆడాలని అతడు అనుకుంటాడో.. అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించాలి. అంతేకాకుండా బుమ్రాను ఎనిమిదో వింతగా ప్రకటించాలనే పిటిషన్పై నేను సంతకం చేస్తా. తరానికి ఒక్కరు మాత్రమే ఇలాంటి బౌలర్ ఉంటాడు’’ అని విరాట్ తెలిపాడు.
ఫ్యాన్స్కు అంకితం: రోహిత్
నాయకుడిగా దేశానికి కప్ అందించిన తన కుమారుడిని రోహిత్ శర్మ (Rohit Sharma) తల్లి పూర్ణిమ ఆప్యాయంగా ముద్దాడారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నాయి. టీ20 వరల్డ్ కప్తో కలిసి ముంబయిలో రోడ్షోలో పాల్గొన్న అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ‘‘దేశం కోసం ఈ ట్రోఫీ సాధించాం. దాదాపు 11 ఏళ్ల నుంచి వరల్డ్ కప్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు దీనిని అంకితం చేస్తున్నాం. పొట్టి కప్తో స్వదేశానికి చేరుకున్నాక అపూర్వ స్వాగతం లభించింది. ఇక ముంబయిలోనూ ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. భారీగా అభిమానులు తరలిరావడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
ఇటీవల టీమ్ఇండియాతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలకు విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
భారత జెర్సీని ధరించే అవకాశం వస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. అయితే, యువ క్రికెటర్ నితీశ్కు పిలుపు వచ్చినా.. గాయం కారణంగా జింబాబ్వే సిరీస్కు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న రెండో టీ20 ప్రపంచ కప్ను రోహిత్ శర్మ అందించాడు. వచ్చే ఏడాది మరో రెండు కీలక లక్ష్యాలు హిట్మ్యాన్ ముంగిట ఉన్నాయి. -
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్లో తొలిసారి ‘AI’
టెన్నిస్ క్రీడాకారుల ఆన్లైన్ ప్రైవసీని కాపాడేందుకు వింబుల్డన్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘ఏఐ’ని పరిచయం చేశారు. -
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు ఇన్స్టాగ్రామ్ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల్లో ఏకంగా 2 కోట్ల లైక్స్ను సొంతం చేసుకొంది. -
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు వేడుకను భార్య సాక్షి, మిత్రులతో కలిసి చేసుకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించాడు. -
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా రిషభ్ పంత్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. -
యువ భారత్ బోల్తా
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి వారం రోజులే అయింది. ఇంకా అభిమానులు ఆ మత్తు నుంచి బయటికి రాలేదు. ఈలోపు దిమ్మదిరిగే షాక్! అదే టీ20 ఫార్మాట్లో జింబాబ్వే జట్టు చేతిలో భారత జట్టు పరాభవం చవిచూసింది. -
పోర్చుగల్ షూటౌట్
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో.. తన చివరి యూరో ఛాంపియన్షిప్ను ఓటమితో ముగించాడు. -
రజావత్ సంచలనం
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలన విజయం సాధించాడు. -
ఇంగ్లాండ్ గట్టెక్కింది
ఫుట్బాల్లో స్విట్జర్లాండ్తో పోరంటే ఇంగ్లాండ్ను ఫేవరెట్గానే పరిగణిస్తారు ఎవరైనా. యూరో ఛాంపియన్షిప్ గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్స్లో ఆ జట్టు ఫేవరెట్గానే బరిలోకి దిగింది. -
స్వైటెక్కు షాక్
వింబుల్డన్లో పెద్ద సంచలనం! టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్ ఓడిపోయింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ టాప్సీడ్కు కజకిస్థాన్ అన్సీడెడ్ ప్లేయర్ యూలియా పుటిన్సెవా చెక్ పెట్టింది. -
నేను ఆ తరహా కాదు
టీమ్ఇండియా కోచ్గా తాను కెప్టెన్ ప్రణాళికలను సమర్థంగా అమల్లో పెట్టడానికి తోడ్పడ్డానని.. అంతే తప్ప అంతా మార్చేయాలని, అంతకుముందున్నది ఆపేయాలని చూడలేదని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. -
వినేశ్కు స్వర్ణం
గ్రాండ్ప్రి రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది.
తాజా వార్తలు (Latest News)
-
మంజకోట్ ఆర్మీ క్యాంపు వద్ద కాల్పులు..గాయపడిన జవాన్
-
‘ఒలింపిక్స్లో వారిద్దరూ ఆడతారు’.. ద్రవిడ్ వ్యాఖ్యలకు కోహ్లీ ఫన్నీ రియాక్షన్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత
-
సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్ఆర్ ఆంజనేయులు చక్కర్లు
-
ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్ సేన్
-
కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు