IND vs BAN: అతిగా నిద్రపోయి.. భారత్‌తో మ్యాచ్‌కు దూరమై..

వరల్డ్‌ కప్‌లో మ్యాచ్‌ ఆడేందుకు ప్రతి ఆటగాడూ ఉత్సాహం చూపిస్తాడు. ఇక పెద్ద జట్టుతో మ్యాచ్‌ అంటే సిద్ధంగా ఉంటారు. కానీ, బంగ్లాదేశ్‌ బౌలర్‌  మాత్రం అతి నిద్రతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు.

Updated : 03 Jul 2024 10:02 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ వైస్‌కెప్టెన్‌ తస్కిన్‌ అహ్మద్‌ ఆడలేదు. కీలక మ్యాచ్‌లో అతడు దూరం కావడానికి కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతిగా నిద్రపోయి.. సమయానికి బస్సు అందుకోలేకపోవడం వల్లనే అతడు తుది జట్టులో ఆడలేదని ఓ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అధికారి చెప్పాడు. ‘‘జట్టు బస్సు అందుకోలేకపోయిన తస్కిన్‌ ఆ తర్వాత జట్టుతో చేరాడు’’ అని బీసీబీ అధికారి చెప్పాడు. ‘‘బస్సు అందుకోలేకపోయినందుకు తోటి ఆటగాళ్లతో పాటు అందరికీ తస్కిన్‌ క్షమాపణలు చెప్పాడు. దీన్నో సమస్యగా చూడాల్సిన అవసరం లేదు’’ అని బీసీబీ అధికారి అన్నాడు. అంటిగ్వాలో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 50 పరుగులు తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు