- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rahul Dravid: ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్
Rahul Dravid: ఆ రోజు రోహిత్ శర్మ నుంచి తనకు ఫోన్కాల్ రాకపోయి ఉంటే.. ఇంతటి ఘన చరిత్రలో తాను భాగం కాకపోయేవాడినని అన్నాడు రాహుల్ ద్రవిడ్. హెడ్ కోచ్గా తన చివరి ప్రసంగంలో ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు.
బ్రిడ్జ్టౌన్ (బార్బడోస్): సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ను అందించి హెడ్ కోచ్ పదవిని ఘనంగా ముగించాడు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid). ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై గెలిచి రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో వీడ్కోలు ప్రసంగం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. గతేడాది కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఫోన్ చేయకపోయి ఉంటే.. ఈ రోజు తాను ఈ ఘన చరిత్ర (T20 World cup 2024)లో భాగం కాకపోయేవాడినని ద్రవిడ్ అన్నాడు.
గతేడాది నవంబరులో భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ను టీమ్ఇండియా (Team India) చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఓటమి తర్వాత ద్రవిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగాలనుకున్నారట. అప్పుడు రోహిత్ శర్మ (Rohit Sharma) ఫోన్ చేసి.. కనీసం టీ20 ప్రపంచకప్ వరకైనా కొనసాగాలని ఒప్పించాడు. ఈ విషయాన్ని ద్రవిడ్ గుర్తుచేసుకుంటూ కెప్టెన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘రో.. గతేడాది నవంబరులో నువ్వు నాకు ఫోన్ చేసి కోచ్గా కొనసాగమని అడిగావు. అందుకు థ్యాంక్యూ సో మచ్’’ అని అన్నాడు.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. అందుకే పిచ్పై ఉన్న మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
ఇక.. జట్టు సభ్యులతో తన అనుబంధాన్ని ద్రవిడ్ గుర్తుచేసుకున్నాడు. ‘‘నాకు మాటలు రావట్లేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. జట్టులోని ప్రతి ఒక్కరితో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మనమంతా కొన్నిసార్లు మాట్లాడుకున్నాం. మరికొన్నిసార్లు చర్చించుకున్నాం. పరస్పరం వాదించుకున్నాం. ఈ టోర్నీ ఆసాంతం ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. మీరు కోరుకున్నవిధంగా ఈ విజయాన్ని ఆస్వాదించండి. ఈ క్షణాలు మీకు చిరకాలం గుర్తుండిపోతాయి. పరుగులు, వికెట్లను పక్కనబెట్టండి. మీ కెరీర్ను మీరు మర్చిపోవచ్చు.. కానీ ఇలాంటి మధురమైన క్షణాలు మదిలో నిలిచిపోతాయి’’ అని ద్రవిడ్ (Rahul Dravid) తెలిపాడు. ప్రతి గొప్ప టీమ్ వెనక.. ఓ విజయవంతమైన సంస్థ ఉంటుందని, బీసీసీఐ అధికారులు టీమ్ఇండియాకు ప్రతిక్షణం వెన్నంటి నిలిచారని కొనియాడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూర్య క్యాచ్ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా
దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ను భారత్ రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో చివరి ఓవర్లో అద్భుతమైన క్యాచ్తో సూర్య టీమ్ఇండియాకు కప్ను అందించాడు. -
కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
ఫామ్ కోల్పోయినప్పుడు ఆటగాడికి కెప్టెన్ నుంచి మద్దతు లభిస్తే.. తిరిగి పుంజుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో ధోనీ, రోహిత్ సక్సెస్ కావడం గమనార్హం. -
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
పదకొండేళ్లప్పుడు భారత్ ఓడిపోవడం చూసిన ఓ కుర్రాడు.. రెండు ప్రపంచ కప్లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్. -
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
వరల్డ్ కప్లో మ్యాచ్ ఆడేందుకు ప్రతి ఆటగాడూ ఉత్సాహం చూపిస్తాడు. ఇక పెద్ద జట్టుతో మ్యాచ్ అంటే సిద్ధంగా ఉంటారు. కానీ, బంగ్లాదేశ్ బౌలర్ మాత్రం అతి నిద్రతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. -
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. -
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
రోహిత్ వారసుడెవరు?
ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్.. మళ్లీ ఇప్పుడు భారత్ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్బై చెప్పాడు రోహిత్ శర్మ. -
అంతా కలలాగే..
టీ20 ప్రపంచకప్ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు. -
వింబుల్డన్ ఛాంపియన్కు చెక్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది. -
క్వార్టర్స్లో ఫ్రాన్స్
ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు యూరో 2024 క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. -
భారత జట్టులో సాయి, జితేష్
యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. -
పారిస్ ఒలింపిక్స్లో జ్యోతి!
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్ కోటాలో జ్యోతి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
-
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే