- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 world cup: ఈ కప్ అందరిదీ
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది.
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది. ఈ క్రమంలో ఏ ఒక్కరిపైనో ఆధారపడలేదు. ఒక మ్యాచ్లో ఒకరు ఆదుకుంటే.. ఇంకో మ్యాచ్ ఇంకొకరు నేనున్నా అంటూ ముందుకొచ్చారు. అందుకే ఈ కప్ అందరిది.
బ్యాటింగ్లో భారత్ను రోహిత్శర్మ ముందుండి నడిపించాడు. పవర్ప్లేలో వేగంగా ఆడి జట్టుకు శుభారంభాలను అందించాడు. ఒకవైపు కోహ్లి విఫలమవుతున్నా తాను మాత్రం ఏమాత్రం జోరు తగ్గించలేదు. ఆస్ట్రేలియా (92), ఇంగ్లాండ్ (57)పై ఆడిన ఇన్నింగ్స్లు ఇదే కోవలోకి వస్తాయి. అతడు 8 మ్యాచ్ల్లో 257 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఫైనల్ ముందు వరకు విఫలమైన కోహ్లి.. అసలు సమరంలో మాత్రం సత్తా చాటాడు. 76 పరుగులు చేసి భారత్కు పోరాడే స్కోరు అందించాడు. రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రిషబ్ పంత్.. కీలక మ్యాచ్ల్లో ఆడడనే ముద్ర పడ్డ సూర్యకుమార్ యాదవ్ భారత విజయాల్లో కీలకమయ్యారు. పాకిస్తాన్పై రిషబ్ (42).. అమెరికా, అఫ్గాన్లపై సూర్య (50, 53) వెలకట్టలేని ఇన్నింగ్స్ ఆడారు. 8 మ్యాచ్ల్లో 199 పరుగులు చేసిన సూర్య.. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి ఓవర్లో పట్టిన క్యాచ్ ఛాంపియన్ ఎవరో తేల్చేసింది. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, శివమ్ దూబె కూడా మెరుపు ఫినిషింగ్ ఇచ్చారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాపై ఫైనల్లో అక్షర్ (47) ఆడిన ఇన్నింగ్స్ అలాంటిదే. బంగ్లాదేశ్పై హార్దిక్ (50 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకమయ్యాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై దూబె (16 బంతుల్లో 27) సత్తా చాటాడు.
బంతితో కళ్లెం వేసి..: భారత్ అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది బ్యాటింగే.. కానీ ఈసారి ప్రపంచకప్లో బంతితో టీమ్ఇండియా అదరగొట్టింది. బుమ్రా నేతృత్వంలోని మన బౌలర్లు అవసరమైన ప్రతిసారీ జట్టును ఆదుకున్నారు. ఒకరు విఫలమైతే మరొకరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ముఖ్యంగా బుమ్రాను ఎంత పొగిడినా తక్కువే! ప్రత్యర్థి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ కెప్టెన్ రోహిత్ చూసింది బుమ్రా వైపే! ఈ ప్రపంచకప్లో కేవలం 4 ఎకానమీతో పరుగులు ఇవ్వడం అతడి సత్తాకు నిదర్శనం. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో ఫైనల్లో ఓటమి ఖాయమైన స్థితిలో అతడు వేసిన ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. 8 మ్యాచ్ల్లో కేవలం 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. ఇక బుమ్రాకు తోడుగా అర్ష్దీప్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భారత్కు పోటీ ఇచ్చేలా కనిపించిన అమెరికాపై 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసిన వైనం మాత్రం గుర్తుండిపోతుంది. సఫారీలతో తుదిపోరులో తీవ్ర ఒత్తిడిలోనూ అతడు గొప్పగా బంతులు వేసి బ్యాటర్లను కట్టడి చేశాడు. అర్ష్దీప్ 8 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఫారూఖీ (అఫ్గానిస్థాన్)తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు ముందు నాలుగు మ్యాచ్లే ఆడిన కుల్దీప్.. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లను నియంత్రించడమే కాక.. వికెట్లు తీసి బ్రేక్ ఇచ్చాడు. ఓవరాల్గా అతడు 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ బౌలింగ్లోనూ సత్తా చాటాడు. 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్తో 144 పరుగులు కూడా సాధించాడు. తీవ్ర ఒత్తిడి మధ్య ఆఖరి ఓవర్ను గొప్పగా వేసి భారత్కు కప్ అందించాడు. తనను విమర్శించిన వాళ్లకు ఆల్రౌండ్ ప్రదర్శనతో అతడు దీటుగా బదులిచ్చాడు. అక్షర్ (8 మ్యాచ్ల్లో 9 వికెట్లు) కూడా బంతితో రాణించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచ కప్ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత
2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2026) స్వరూపాన్ని ఐసీసీ ప్రకటించింది. -
ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్
Rahul Dravid: ఆ రోజు రోహిత్ శర్మ నుంచి తనకు ఫోన్కాల్ రాకపోయి ఉంటే.. ఇంతటి ఘన చరిత్రలో తాను భాగం కాకపోయేవాడినని అన్నాడు రాహుల్ ద్రవిడ్. హెడ్ కోచ్గా తన చివరి ప్రసంగంలో ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. అందుకే పిచ్పై ఉన్న మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పిచ్పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. ఆ మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు. -
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
టీ20 ప్రపంచకప్ ట్రోఫీ పట్టుకుని రోహిత్ శర్మతో కలిసి ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) వెల్లడించాడు. -
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
కోచ్గా ఇన్నింగ్స్ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. -
అమ్మాయిలూ చుట్టేశారు
భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి.. అనంతరం స్వల్ప ఛేదనను కొట్టేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమ్ఇండియాదే పైచేయి. -
అల్కరాస్ శుభారంభం
మూడో సీడ్ అల్కరాస్ వింబుల్డన్లో శుభారంభం చేశాడు. అయిదోసీడ్ మెద్వెదెవ్, ఎనిమిదో సీడ్ రూడ్ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తొమ్మిదో సీడ్ సకారి ముందంజ వేసింది. -
గుకేశ్ పోరు సింగపూర్లో
సొంతగడ్డపై డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్ ఆశలు ఫలించలేదు. -
కోహ్లి లేకుండా ఐసీసీ ప్రపంచకప్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సత్తా చాటినప్పటికీ అంతకుముందు విఫలమవడంతో కోహ్లీని 12 మంది సభ్యుల జట్టుకు ఐసీసీ ఎంపిక చేయలేదు. -
ఆర్సీబీతోనే కార్తీక్.. కానీ కొత్తగా
వచ్చే ఏడాది ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జట్టుతో కలిసి దినేశ్ కార్తీక్ కనిపించనున్నాడు. అదేంటీ.. ఈ సీజన్ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలికాడు కదా. -
నా కెరీర్ ముగించాలనే కుట్ర
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లోని లోపాలు ఎత్తి చూపినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని, రెజ్లింగ్లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారని భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ఆరోపించాడు. -
క్వార్టర్స్లో ఇంగ్లాండ్, స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్ క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్తో ఇంగ్లాండ్ త్రుటిలో పరాజయం తప్పించుకుంది. -
శ్రీలంకతో సిరీస్లో కొత్త కోచ్ బాధ్యతలు
శ్రీలంకతో సిరీస్లో భారత జట్టు కొత్త చీఫ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ నెలలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తాడని చెప్పాడు. -
పారిస్ డైమైండ్ లీగ్ నుంచి నీరజ్ ఔట్
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ డైమండ్ లీగ్కు దూరమయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బందిపడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. -
కోర్టులోనే కుప్పకూలిన 17 ఏళ్ల షట్లర్
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్ జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. -
‘లక్ష్య’ అథ్లెట్లకు గోపీచంద్ అభినందనలు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాలు సాధించిన ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లను బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ గోపీచంద్ అభినందించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత
-
ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
-
రెవెన్యూ రికవరీ యాక్ట్తో ‘వైకాపా’ అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
-
ఆ యాప్స్లో కరెంట్ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!