- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
IND vs ENG: ఇంగ్లాండ్పై రివెంజ్ అదిరింది.. టీమ్ఇండియా ఫైనల్కు చేరింది
టీ20 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్లో భారత్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
గయానా: రెండేళ్ల కిందట జరిగిన ఘోర పరాభవానికి అద్భుతమైన రివెంజ్. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఈసారి కూడా హాట్ ఫేవరెట్. కానీ, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ఇండియా ముందు ఈసారి ఆ జట్టు విన్యాసాలు సరిపోలేదు. దీంతో ఇంగ్లిష్ జట్టును చిత్తు చేసిన భారత్.. మూడోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. వరుసగా విజయాలు సాధించిన రెండు టీమ్లు ఫైనల్లో తలపడనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బౌలర్లు విజృంభిన వేళ రెండో సెమీస్లో ఇంగ్లాండ్ను భారత్ 68 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఈ మెగాటోర్నీలో ఓటమి అన్నదే ఎరుగకుండా జైత్రయాత్ర చేస్తున్న టీమ్ఇండియా.. టైటిల్ కోసం ఫైనల్కు చేరింది. ఇంగ్లాండ్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57: 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో విరుచుకుపడగా, సూర్యకుమార్ యాదవ్ (47: 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగాడు. హార్దిక్ పాండ్య (23: 13 బంతుల్లో 2 సిక్స్లు, 1 ఫోర్), జడేజా (17*: 9 బంతుల్లో 2 ఫోర్లు) పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (4) నిరాశ పరిచారు. ఇంగ్లిష్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీశాడు. టోప్లే, జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, ఆదిల్ రషీద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 3, కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అక్షర్ బౌలింగ్లో ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీని రిషభ్ పంత్ స్టంపౌట్ చేయడం ఆటకే హైలైట్గా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
టీమ్ఇండియా సారథి రోహిత్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రా నుంచి మాజీ క్రికెటర్ల వరకు రోహిత్ నాయకత్వం గురించి ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
టైటిల్ను దక్కించుకోవాలని రెండు జట్లు సిద్ధం.. కానీ, వరుణుడు కూడా ఆడేస్తానంటూ పలకరింపులు.. ఇప్పుడు బార్బడోస్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. -
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
రాహుల్ ద్రవిడ్ కోసం కప్ గెలవాలనే ట్రెండింగ్పై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
టెస్టు క్రికెట్లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం
-
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
-
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
-
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం