- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 World Cup: ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దిల్లీలో ప్రధానితో సమావేశం
వాంఖడెలో సన్మానం కూడా
నేడు ముంబయిలో టీమ్ఇండియా రోడ్ షో
ముంబయి
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం దిల్లీలో అడుగు పెట్టబోతున్న రోహిత్ సేన.. అక్కడే ప్రధానితో సమావేశం కాబోతోంది. ఆ తర్వాత ముంబయి చేరుకోనున్న జట్టు రోడ్ షోలో పాల్గొనబోతోంది. అనంతరం ప్రఖ్యాత వాంఖడె స్టేడియంలో అభిమానుల మధ్య టీమ్ఇండియాను బీసీసీఐ సన్మానించబోతోంది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ శనివారమే పూర్తయినా.. బార్బడోస్లో తుపాను కారణంగా తర్వాతి మూడు రోజుల్లో విమానం ఎక్కలేకపోయింది రోహిత్సేన. ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున 4.50 గంటలకు ప్రత్యేక విమానంలో జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది భారత్కు బయల్దేరారు. గురువారం ఉదయం 6 గంటలకు విమానం దిల్లీకి చేరుకుంటుంది. 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని రోహిత్ బృందం కలుస్తుంది. ఆ సమావేశం ముగిశాక ప్రత్యేక విమానంలోనే ముంబయికి బయల్దేరుతుంది. అక్కడికి చేరుకున్నాక సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రోడ్ షో మొదలవుతుంది. రెండు గంటల పాటు సాగే ఊరేగింపులో రోహిత్ బృందం ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగుతుంది. రాత్రి వాంఖడె స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తారు.
‘‘బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి భారత జట్టు బయల్దేరింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షాలతో పాటు బార్బడోస్లో చిక్కుకుపోయిన మన జర్నలిస్టులు కూడా అదే విమానంలో వస్తున్నారు. ఉదయం జట్టు సభ్యులు దిల్లీలో దిగాక.. 11 గంటలకు ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలుస్తారు. తర్వాత ముంబయికి బయల్దేరుతారు. అక్కడ నారిమన్ పాయింట్ నుంచి ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు ఉంటుంది. వాంఖడెలో సన్మానం అనంతరం బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నగదు బహుమతిని జట్టు సభ్యులకు అందిస్తారు’’ అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. రోడ్ షోలో పాల్గొనాలని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ‘ఎక్స్’లో పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచకప్ విజయోత్సవ ఊరేగింపులో మాతో కలవండి. గుర్తుంచుకోండి.. జులై 4న 5 గంటలకు రోడ్ షో మొదలవుతుంది’’ అని జై షా పేర్కొన్నాడు. ‘‘ఈ ప్రత్యేక సందర్భాన్ని మీరు కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. విజయాన్ని ఆస్వాదిద్దాం రండి’’ అని రోహిత్ కోరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..! -
భారత్ సుదీర్ఘ నిరీక్షణకు తెర పడనుందా?.. సఫారీలకు తొలి టైటిలా..?
టీ20 ప్రపంచకప్ ముగింపు దశకు వచ్చేసింది. సూపర్-8, సెమీస్లను దాటేసి ఫైనల్ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. -
విరాట్ - రోహిత్లకు ముప్పు పొంచి ఉందిలా..!
టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ - విరాట్ మన బ్యాటింగ్ లైనప్కు దిశానిర్దేశం చేయనున్నారు. వీరిలో ఒక్కరు రెచ్చిపోయినా జట్టు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంగ్లాండ్ అమ్ముల పొదిలో వీరిపై ప్రయోగించడానికి ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చదవండి. -
చిన్న జట్టు పెద్ద ఆట... అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్
టీ20 ప్రపంచకప్లో సెమీస్కి చేరి అఫ్గానిస్థాన్ అద్భుతం సృష్టించింది. గతంలో కెన్యా కూడా ఇలానే సంచలనం సృష్టించింది. -
ఈ ఒక్క గండం గట్టెక్కితే చాలు..!
టీ20 ప్రపంచ కప్ సెమీస్లో భారత్ - ఇంగ్లాండ్ (IND vs ENG) జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. గయానా వేదికగా గురువారం రాత్రి మ్యాచ్ జరగనుంది. -
అఫ్గాన్ సెమీస్కు రిజర్వ్ డే.. భారత్కు మాత్రం లేదు.. ఎందుకలా..?
పొట్టి ప్రపంచకప్లో సెమీస్ దశలో పలు నిబంధనలు మారాయి. ఒక జట్టుకు రిజర్వ్ డే లభించగా.. మరో జట్టుకు దక్కలేదు. అదే సమయంలో ఫలితం తేల్చే ఓవర్ల సంఖ్య కూడా మారింది. ఇవి టీమ్ ఇండియాకు లాభమా.. నష్టమా..? -
తాలిబన్లను మెప్పించి.. తలరాతకు ఎదురీది.. అఫ్గాన్ క్రికెట్ ప్రయాణం..!
అఫ్గాన్లో క్రికెట్ అంటే కష్టమే. కానీ, తాలిబన్ల నుంచి గ్రీన్సిగ్నల్ పొందారు. మెల్లగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ వచ్చారు. ఇప్పడు ఏకంగా భారీ జట్లకు షాకిచ్చి టీ20 ప్రపంచకప్ సెమీస్కు చేరారు. వారి క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర ఘటనలు ఉన్నాయి. -
టీ20 వరల్డ్ కప్ ‘2022 సీన్ 2024లో రిపీట్’.. ఈసారి రివెంజ్ చూస్తామా?
టీ20 ప్రపంచ కప్లో మరోసారి పాత ప్రత్యర్థులు తలపడేందుకు సిద్ధమయ్యారు. గత ఎడిషన్ సెమీస్లో ఈ జట్లే ఢీకొట్టుకోగా.. ఇప్పుడు మళ్లీ ఎదురుపడటం గమనార్హం. -
భారత్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా.. పొట్టి కప్పులో నేడు స్టార్స్ వార్!
ప్రపంచకప్లో బిగ్ఫైట్కు సెయింట్ లూసియా వేదికైంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్స్కు ప్రతీకారం తీర్చుకొనేందుకు భారత్ బృందానికి లభించిన అరుదైన అవకాశంగా అభిమానులు దీనిని భావిస్తున్నారు. -
బంగ్లాతో పోరు.. గెలిస్తే భారత్ సెమీస్కే..!
టీ20 ప్రపంచ కప్ సూపర్-8 పోరులో భారత్ మరో మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఆంటిగ్వా వేదికగా శనివారం బంగ్లాదేశ్తో టీమ్ఇండియా తలపడనుంది.