- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Team India: బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్.. బార్బడోస్ నుంచి భారత్కు రానున్న టీమ్ఇండియా
హరికేన్ కారణంగా బార్బడోస్లో చిక్కుకున్న టీమ్ఇండియా బుధవారం భారత్కు చేరుకోనుంది. బీసీసీఐ ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు ప్రయాణించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: 17 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ టీమ్ఇండియా (Team India) టీ20 ప్రపంచ కప్ (T20 World Cup)ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. బెరిల్ హరికేన్ ప్రభావంతో రెండు రోజులుగా బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా జట్టు స్వదేశానికి పయనం కానుంది. ప్లేయర్ల కోసం బీసీసీఐ (BCCI) ప్రత్యేక విమానం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. బుధవారం టీమ్ఇండియా జట్టు భారత్కు బయలుదేరనుంది. ఆటగాళ్లకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త ఊరటనిచ్చినటయ్యింది.
హరికేన్ విజృంభణతో బార్బడోస్లో రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి ఎయిర్పోర్ట్ను మూసేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రెండు రోజులుగా భారత ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్కే పరిమితమయ్యారు. పరిస్థితి కాస్త మెరుగుపడడంతో భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు బార్బడోస్ నుంచి భారత్కు ప్రత్యేక విమానం బయలుదేరనుంది. అదేరోజు సాయంత్రం 7.45 గంటలకు దిల్లీకి ఆటగాళ్లు చేరుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జింబాబ్వేతో టీ20 సిరీస్కు ఎంపికైన యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ఖలీల్ అహ్మద్, రింకుసింగ్ కూడా అందులోనే ఉన్నారు.
ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్
జింబాబ్వేకు టీమ్ఇండియా..
జింబాబ్వే వేదికగా జులై 6 నుంచి 14 వరకు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం టీమ్ఇండియా బయలుదేరింది. అయితే.. బార్బడోస్లో ఉన్న కొందరు ఆటగాళ్లు నేరుగా జింబాబ్వేకి వెళుతున్న జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ ‘ఫిట్నెస్’ చూశాక.. పోటీపడలేమనుకున్నా: సూర్యకుమార్
ఫిట్నెస్ విషయంలో విరాట్ను అందుకోవడం చాలా కష్టమని భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. -
ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ
వరల్డ్ కప్తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు అపూర్వ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
వరల్డ్ కప్తో కెప్టెన్ రోహిత్ డ్యాన్స్ అదుర్స్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డ్యాన్స్తో అలరించాడు. వరల్డ్ కప్తో టీమ్ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయం బయట అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ వేశాడు.
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
పొట్టి కప్ను నెగ్గిన భారత ఆటగాళ్లు ఎట్టకేలకు స్వదేశానికి చేరారు. వారికి ఘనస్వాగతం లభించింది. దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు, అధికారుల మధ్య ప్లేయర్లు డ్యాన్సులతో కాసేపు హంగామా చేశారు. -
1983 TO 2024.. టీమ్ఇండియా ‘ప్రపంచ కప్’ల సంబురం
తొలిసారి 1983లో వన్డే ప్రపంచ కప్ను గెలిచిన టీమ్ఇండియా.. తాజాగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేసి సగర్వంగా ఇంటికి తిరిగొచ్చింది.
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
T20 World Cup: 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం దిల్లీలో అడుగు పెట్టిన రోహిత్ సేన.. అక్కడే ప్రధానితో సమావేశం కాబోతోంది. -
ఆల్రౌండర్ నం.1 హార్దిక్
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. -
అదరగొట్టిన అల్కరాస్
టైటిల్ ఫేవరెట్ మూడో సీడ్ కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. అతను అలవోకగా మూడో రౌండ్ చేరాడు. అయిదో సీడ్ మెద్వెదెవ్ రెండో రౌండ్ను అధిగమించగా.. ఎనిమిదో సీడ్ రూడ్కు ఫోగ్నిని షాకిచ్చాడు. -
క్వార్టర్స్లో తుర్కియే
తొలి నిమిషంలో గోల్.. ఆఖరి సెకన్లలో అద్భుత సేవ్తో తుర్కియే యూరో కప్ ఫుట్బాల్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఆ జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. -
కొత్త సవాల్ను అధిగమించాం
ప్రపంచ బ్యాడ్మింటన్లో ఎదురవుతున్న కొత్త సవాల్ను అధిగమించినట్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం తెలిపింది. -
మార్చి 1న భారత్, పాక్ పోరు!
అసలు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందో లేదో తెలియదు, జరిగితే టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్థాన్లో భారత్ పర్యటిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు గానీ.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ముహూర్తం ఖరారైపోయింది. -
అది తప్పుకోవడం కాదు
పారిస్ డైమండ్ లీగ్ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్పష్టత ఇచ్చాడు. -
బాయ్కాట్కు మళ్లీ క్యాన్సర్
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ రెండోసారి గొంతు క్యాన్సర్ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
8 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు.. వెల్లడించిన సీఎంఐఈ
-
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె.కేశవరావు
-
పవిత్రా గౌడను నా భర్త పెళ్లి చేసుకోలేదు: పోలీసులకు దర్శన్ భార్య లేఖ
-
12GB ర్యామ్తో మోటో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. ధర, ఫీచర్లివే..
-
కృష్ణా కరకట్టపై ఫైళ్ల దహనం ఘటన.. ఓఎస్డీ రామారావు పాత్రపై చర్చ!
-
బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. రిలీజ్కు ముందే వివరాలు లీక్!