- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Team India: భారత ఆటగాళ్లతో ఓపెన్ బస్ పరేడ్.. ఎక్కడంటే?
టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్ను సాధించింది. దీంతో భారీ ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) 2024 టీ20 ప్రపంచ కప్ సాధించిన సందర్భంగా ముంబయిలో మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఈ సంబరాలు మొదలవుతాయని తెలుపుతూ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ధోనీ సారథ్యంలో భారత్ 2007 టీ20 ప్రపంచ కప్ సాధించినప్పుడు కూడా ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లతో ముంబయిలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. వేలాది అభిమానులు టీమ్ఇండియా ఆటగాళ్లున్న బస్సు వెంట నడిచి గెలుపు సంబరాల్లో భాగమయ్యారు. తాజాగా అప్పటి ఫొటోను బీసీసీఐ కార్యదర్శి జై షా సామాజిక మాధ్యమాల్లో పంచుకుని ఇప్పుడు అదే విధంగా విజయోత్సవ సంబరాల్లో అభిమానులు భాగం కావాలని పిలుపునిచ్చారు. భారత్ 2011 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన ఐదు రోజులకే ఐపీఎల్ ప్రారంభమైంది. దీంతో అప్పుడు ప్రపంచ కప్ జట్టుతో బస్ పరేడ్ నిర్వహించలేదు.
ప్రస్తుతం టీమ్ఇండియా ఆటగాళ్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి స్వదేశానికి బయల్దేరారు. ఈ విమానం గురువారం ఉదయం దిల్లీలో ల్యాండ్ కానుంది. తర్వాత భారత ఆటగాళ్లు ప్రధాని మోదీని కలుస్తారు. అనంతరం భారత ప్రపంచ కప్ జట్టు ముంబయికి చేరుకుని విజయోత్సవ సంబరాల్లో పాల్గొంటుంది. సాయంత్రం భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు పయనవుతారు.
జై షా ఎక్స్లో పోస్టు చేసిన ఫొటో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 190
మూడు టీ20ల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా భారత మహిళల జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. -
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకొని స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియా గురువారం ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ఆ విశేషాలతో కూడిన వీడియోను పీఎంవో తాజాగా విడుదల చేసింది. -
ఇప్పుడు 140+ కోట్ల మంది ఛాంపియన్లే: హార్దిక్ పాండ్య
టీమ్ఇండియా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా అందుకొంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్!
చివరిసారిగా 1991-92 సీజన్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. ఆ తర్వాత నాలుగు లేదా మూడు టెస్టుల్లోనే తలపడుతూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో ఢీకొట్టుకోనున్నాయి. -
2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు స్వదేశంలో అపూర్వ ఘన స్వాగతం లభించింది. ముంబయి వీధులు నినాదాలతో హోరెత్తిపోయాయి. -
‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ముంబయిలో జరిగిన భారత క్రికెట్ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. -
హార్దిక్కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. -
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
ఇటీవల టీమ్ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్ అనుభవించారు. -
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
టీ20 ప్రపంచ కప్తో ముంబయికి చేరిన క్రికెట్ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై.. జయహో భారత్.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. -
పండగలా దిగి వచ్చారు
ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! -
వీరులారా.. వందనం
ఎటు చూసినా జనమే.. అందరి కళ్లలో అభిమానమే. రోడ్లు కిక్కిరిసిపోయాయి..కేరింతలు, చప్పట్లతో పరిసరాలు దద్ధరిల్లిపోయాయి. -
రోహిత్.. మట్టి రుచి ఎలా ఉంది?
టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. -
భారత్ గర్వించేలా చేస్తారు
పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
భారత ఒలింపిక్స్ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టులో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్)కి చోటు దక్కింది. -
జకోవిచ్ జోరు.. ఒసాకా ఔట్
వింబుల్డన్లో టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) జోరు కొనసాగుతోంది. ఈ రెండోసీడ్ మూడో రౌండ్ చేరాడు. -
స్పెయిన్తో జర్మనీ ఢీ
యూరో కప్లో కీలక సమరం! శుక్రవారం క్వార్టర్ఫైనల్లో స్టార్ జట్లు స్పెయిన్-జర్మనీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
క్లీన్స్వీప్పై భారత్ గురి
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ను వైట్వాష్తో ముగించాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. -
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
టీ20 ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియాకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 190
-
పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్