T20 World Cup: అంతా కలలాగే..

టీ20 ప్రపంచకప్‌ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు.

Published : 03 Jul 2024 02:34 IST

బ్రిడ్జ్‌టౌన్‌: టీ20 ప్రపంచకప్‌ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు. విజయానంతరం కలిగిన భావోద్వేగాల గురించి అతను బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. ‘‘ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదు. కలలాగే ఉంది. ఇది నిజంగా జరిగినా సరే.. జరగనట్లే అనిపిస్తోంది. ఈ విజయాన్ని సహచరులతో కలిసి ఎంతో ఆస్వాదించాను. కప్పు గెలిచాక నాకు నిద్రే పట్టలేదు. కానీ అదేం సమస్య కాదు. ఇంటికెళ్లాక పడుకోవడానికి బోలెడంత సమయం దొరుకుతుంది. ఈ విజయం తాలూకు అనుభూతులను ప్రతి క్షణం ఇలాగే ఆస్వాదిస్తూ ఉండాలనుకుంటున్నా. మ్యాచ్‌ ముగిసిన దగ్గర్నుంచి ప్రతి క్షణం గొప్పగా సాగుతోంది. ఆ గెలుపు కోసం చాన్నాళ్ల పాటు కలలు కన్నాం. జట్టుగా ఎంతో శ్రమించాం. ఇప్పుడు దాన్ని అందుకోవడం గొప్ప ఉపశమనంగా అనిపిస్తోంది. ఒక దాని కోసం మనం ఎక్కువ శ్రమిస్తే ఏదో ఒక రోజు అది అందుతుందనడానికి ఇది రుజువు. విజయానంతరం మేం ఏం చేసినా అదంతా ఆ సమయానికి వచ్చిన స్పందన మాత్రమే. మా కల నెరవేరింది అక్కడే కాబట్టి, మాకు ట్రోఫీ ఇచ్చింది పిచ్‌యే కాబట్టి అందులోంచి చిన్న గడ్డి పరక తీసుకున్నా. కానీ ఇదేదీ ప్రణాళిక ప్రకారం జరిగింది కాదు’’ అని రోహిత్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని