- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
t20 World Cup 2024: పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు.
టీమ్ఇండియా పదకొండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ను (T20 World Cup 2024) రెండోసారి గెలుచుకోవడంలో జట్టులోని ప్రతి ఒక్కరి శ్రమ ఉంది. హేమాహేమీ జట్లు తలపడే టోర్నీలో విజేతగా నిలవాలంటే ఏ ఒక్కరో.. ఇద్దరో రాణిస్తే చాలదు. పెద్ద టీమ్ను చూడగానే స్టార్ల పేర్లే గుర్తుకు రావడం సహజం. ఆ ప్లేయర్లు ఆడినా.. ఆడకపోయినా జట్టు గెలిస్తే వారే వార్తల్లో నిలుస్తుంటారు.
మ్యాచ్ పరిస్థితికి తగ్గట్టుగా ఫైనల్ 11లోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. కొందరిపై పెద్దగా అంచనాల్లేకుండానే అదరగొట్టేస్తారు. మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. ఇలాంటి వారినే ‘అన్సంగ్’ హీరోలుగా పిలుస్తుంటారు. భారత జట్టు (Team India) ఛాంపియన్గా నిలవడంలోనూ అలాంటి వారి కష్టం చాలా ఉంది. మరి వారెవరు..? ఏం సాధించారనేది తెలుసుకుందాం..
బుమ్రాకు సరైన ప్రత్యామ్నాయంగా అర్ష్దీప్!
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన సమయంలో జస్ప్రీత్ బుమ్రాకు (Jasprit Bumrah) తోడుగా సిరాజ్, అర్ష్దీప్ను ఎంపిక చేశారు. కుర్రాడిని పక్కన పెట్టేసి సిరాజ్నే టోర్నీ మొత్తం ఆడిస్తారని అంతా భావించారు. రోహిత్ ‘మాస్టర్మైండ్’ మాత్రం అర్ష్దీప్కే (Arshdeep Singh) అవకాశం ఇవ్వమని చెప్పినట్లు ఉంది. అమెరికా పిచ్లపై ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లను బరిలోకి దించిన భారత్.. విండీస్కొచ్చేసరికి ఇద్దరినే తీసుకోవాల్సి వచ్చింది. ఎలానూ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ ఉన్నాడు. దీంతో ఒక ఫాస్ట్బౌలర్ను పక్కన పెట్టి స్పిన్నర్ కుల్దీప్ను తీసుకొచ్చాడు కెప్టెన్. అనూహ్యంగా సిరాజ్ను తప్పించి.. యువ బౌలర్ను తీసుకున్నాడు.
సారథి నమ్మకాన్ని పోనీయకుండా టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అర్ష్దీప్ (17) నిలిచాడు. ఫరూఖితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఫైనల్లోనూ 4 ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. యూఎస్ఏపై నాలుగు వికెట్ల ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సూపర్-8 ఆసీస్పై ‘రివెంజ్’ పోరులో 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని చావు దెబ్బ కొట్టాడు.
తిరుగులేని రిషభ్ పంత్..
జాతీయ జట్టు తరఫున క్రికెట్ మ్యాచ్ ఆడి దాదాపు 15 నెలలైంది. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన రిషభ్ పంత్ (Rishabh Pant).. అంతర్జాతీయ క్రికెట్లోనూ పునరాగమనం ఘనంగా జరిగింది. బ్యాటర్గానే కాకుండా కీపింగ్లోనూ అద్భుతమైన మెరుపులతో అదరగొట్టాడు. సెమీస్లో మొయిన్ అలీని స్టంపౌట్ చేయడం ఎప్పటికీ నిలిచిపోతుంది. అంత ఎత్తుగా లేచే బంతులను సైతం అందుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. బ్యాటింగ్లో 8 మ్యాచులకుగాను 171 పరుగులు చేశాడు. ఫైనల్ మినహా.. మిగతా మ్యాచుల్లో వన్డౌన్లో వచ్చి విలువైన పరుగులు చేయడం గమనార్హం. దాదాపు ప్రతి మ్యాచ్లోనూ భారత ఓపెనర్లలో ఎవరో ఒకరు త్వరగా పెవిలియన్కు చేరడం.. పంత్ వచ్చి దూకుడు కొనసాగించడం చూశాం.
ఆల్రౌండర్ అక్షర్ పటేల్
ఆల్రౌండర్ అనే ట్యాగ్లైన్తోనే అక్షర్ పటేల్ (Axar Patel) వరల్డ్ కప్ జట్టులోకి వచ్చాడు. ప్రతి మ్యాచ్లోనూ చోటు దక్కించుకొని.. భారత విజయాల్లో తన భాగస్వామ్యం ఉందంటూ నిరూపించాడు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) పెద్దగా రాణించకపోయినా.. ఆ లోటును అక్షర్ అద్భుతంగా పూరించాడు. పాకిస్థాన్పై 20 పరుగులు చేసిన అక్షర్.. ఒక వికెట్ తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అఫ్గాన్పైనా ఆరు బంతుల్లో 12, ఇంగ్లాండ్పై 10 పరుగులతో పాటు డేంజరస్ బ్యాటర్లు బెయిర్స్టో, జోస్ బట్లర్, మొయిన్ అలీ వికెట్లను తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇప్పుడు ఫైనల్లోనూ 47 పరుగులు చేసి జట్టు మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఫీల్డింగ్ వెనుక దిలీప్ టీమ్ కృషి
భారత జట్టు విజయంలో క్రికెటర్లు ఎంత ముఖ్య భూమిక పోషించారో.. తెర వెనుక ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) టీమ్ కూడా అదేవిధమైన బాధ్యతలను మోసింది. మరీ ముఖ్యంగా మెగా టోర్నీల్లో ఫీల్డింగ్ అత్యంత కీలకం. దీనిని గుర్తించిన బీసీసీఐ దిలీప్ను (T Dilip) ద్రవిడ్కు సహాయక ఫీల్డింగ్ కోచ్గా ఎంపిక చేసింది. కుర్రాళ్లతోపాటు సీనియర్లను ఎలా రాటుదేల్చాలో తెలిసిన నేర్పరి దిలీప్.
ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ రోజు మైదానంలో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేశారనే దానిని బేరీజు వేసి ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ను అందజేయడం గత వన్డే ప్రపంచ కప్ నుంచి ప్రారంభించాడు. ఆ నిర్ణయం భారత జట్టులో పెను మార్పులే తీసుకొచ్చింది. అద్భుతమైన ఫీల్డింగ్తో కుర్రాళ్లతో సీనియర్లు పోటీపడిన సందర్భాలనూ మనం చూశాం. ఆసీస్పై అక్షర్ పటేల్.. ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ విన్యాసం చరిత్రలో నిలిచిపోతాయి. ప్రతి మ్యాచ్లోనూ దాదాపు 20 నుంచి 25 పరుగుల వరకు తన ఫీల్డింగ్తో రవీంద్ర జడేజా ఆపేశాడు.
భారత ఆటగాళ్లు ఫీల్డింగ్ మెరుపులు వెనుక దిలీప్తోపాటు సపోర్టింగ్ స్టాఫ్ కృషి వెలకట్టలేనిది. త్రో స్పెషలిస్ట్లు రఘు, నువాన్తో కలిసి దిలీప్ ఆటగాళ్లకు సాన పెట్టాడు. క్రికెటర్గా మారదామని వచ్చిన దిలీప్ హైదరాబాద్ అండర్-25 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బలమైన ఆర్థిక నేపథ్యమేమీ లేదు. పాఠశాల పిల్లలకు లెక్కల్లో ట్యూషన్లు చెబుతూ క్రికెట్ ఆడాడు. అండర్-25 జట్టుకు ఆడిన అనంతరం హెచ్సీఏ లీగ్స్లో క్లబ్ క్రికెట్ కొనసాగించాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు సహాయక ఫీల్డింగ్ కోచ్గా పనిచేశాడు. ఆ తర్వాత ఎన్సీఏలో పదేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన అమ్మాయిలూ గెలిచేశారు!
దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది -
ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Dravid: టీమ్ఇండియా కోచ్ పదవి నుంచి దిగిపోయిన రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇక నిరుద్యోగినన్నాడు. -
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
ఈ సీజన్ అనంతరం ఐపీఎల్కు వీడ్కోలు పలికిన దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) సరికొత్త అవతారంలో ఆర్సీబీకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. -
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
బెరిల్ హరికేన్ ఎఫెక్ట్ టీమ్ఇండియాపై పడింది. ఈ హరికేన్ కారణంగా భారత జట్టు స్వదేశానికి ఆలస్యంగా రానుంది. -
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
జులై నెలాఖరులో టీమ్ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు కొత్త హెడ్ కోచ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
ఈ టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. -
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్
అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు పలకడంపై అతడి సతీమణి ఎమోషనల్ అయ్యారు. అటు భార్య అనుష్కకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. -
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
T20 World Cup: తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్నకు సంబంధించిన వార్తను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత్ను కొనియాడుతూనే.. కీలక మ్యాచ్లో తడబడే అలవాటును దక్షిణాఫ్రికా కొనసాగించిందంటూ రాసుకొచ్చాయి. -
ఎందుకింత ఉద్వేగం!
దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఐసీసీ టోర్నీల్లో వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఎంతగా ప్రయత్నించినా.. ఎలా ఆడినా కప్ మాత్రం దక్కడం లేదు. సెమీస్లోనే నిష్క్రమణ లేదా ఫైనల్లో బోల్తా. చివరగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం. -
రూ.125 కోట్లు.. ఛాంపియన్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంతో దేశం ఉప్పొంగింది. సంబరాలు మిన్నంటాయి. అసాధారణ ప్రదర్శనతో కప్పు గెలిచిన రోహిత్సేనకు ఐసీసీ అందించిన ప్రైజ్మనీతో పాటు బీసీసీఐ నుంచి కూడా భారీ నజరానా అందనుంది. -
ఈ కప్ అందరిదీ
‘‘ఒక ఆటగాడు ఒక మ్యాచ్ని గెలిపించగలడు కానీ.. కప్పు సాధించిపెట్టలేడు.. అందుకే సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి’’ అన్న దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ మాటలను అక్షర సత్యం చేస్తూ భారత జట్టు కలసికట్టుగా చెలరేగి టీ20 ప్రపంచకప్ అందుకుంది. -
ఈ ప్రపంచకప్ వేరయా..
2007 నుంచి 2022 వరకు 8 టీ20 ప్రపంచకప్లు జరిగాయి. కానీ వీటిన్నిటిలోకెల్లా అత్యంత ప్రత్యేకమైన, విభిన్నమైన ప్రపంచకప్గా ప్రస్తుత టోర్నీని చెప్పుకోవచ్చు. -
జకోవిచ్ సాధిస్తాడా?
సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు అగసర నందిని (తెలంగాణ), నలుబోతు శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్) అదరగొట్టారు. జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నందిని స్వర్ణంతో సత్తాచాటగా.. శ్రీనివాస్ రజత పతకంతో మెరిశాడు. -
స్నేహ్కు 8 వికెట్లు
భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
జడేజా కూడా టాటా
భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్ బాటలో మరో సీనియర్ ఆటగాడు పొట్టి ఫార్మాట్కు టాటా చెప్పాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. -
సంక్షిప్తవార్తలు(6)
తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు డిస్నీ+హాట్స్టార్లో భారీస్థాయిలో వ్యూయర్షిప్ వచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!
-
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే..: మెలానియా ఏం చేయనున్నారు!
-
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్
-
ఆరోజు భయపడ్డాం.. ఈరోజు సాధించాం: వైరలవుతోన్న నాగ్ అశ్విన్ పోస్ట్..
-
దిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ.. బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
-
‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?