- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kuldeep Yadav: బౌండరీలు బాదుతున్నా.. ఆ సూత్రానికే కట్టుబడి ఉంటా: కుల్దీప్
Kuldeep Yadav: కరీబియన్ పిచ్లకు అనుగుణంగా కుల్దీప్ను జట్టులోకి తీసుకోవడం భారత జట్టుకు కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో తాను అనుసరిస్తున్న వ్యూహంపై తాజాగా స్పందించాడు.
Kuldeep Yadav | గ్రాస్ఐలెట్: టీ20 ప్రపంచకప్లో (T20 World Cup) టోర్నీ ముందుకు సాగేకొద్దీ కరీబియన్ పిచ్లు స్పిన్నర్లకు సహకరిస్తాయని భారత జట్టు అంచనా వేసింది. అందుకు అనుగుణంగా వ్యూహాలు మార్చింది. పేసర్ సిరాజ్ను తప్పించి అక్షర్, జడేజాలకు తోడు మూడో స్పిన్నర్గా కుల్దీప్ను (Kuldeep Yadav) తుది జట్టులోకి తీసుకుంది. ఈ ప్రయోగం ఫలితాన్నిస్తోంది. కుల్దీప్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు సూపర్-8 మ్యాచ్లలో అంచనాలకు అనుగుణంగా రాణించాడు. దీనిపై స్పందిస్తూ.. దూకుడుగా ఆడడమే తన విజయానికి కారణమని తాజాగా కుల్దీప్ వెల్లడించాడు.
గత 12 నెలలుగా అన్ని ఫార్మాట్లలో స్పిన్నర్గా కుల్దీప్ (Kuldeep) రాణించాడు. అయినా, అమెరికా పిచ్లు పేసర్లకు సహకరిస్తాయన్న అంచనాల మధ్య అతణ్ని గ్రూప్ దశలో ఒక్క మ్యాచూ ఆడించలేదు. కరీబియన్లోని స్పిన్ పిచ్లకు అనుగుణంగా అతణ్ని జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఐదు వికెట్లు తీశాడు. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడు అనుసరిస్తున్న వైఖరే విజయానికి కారణం. బ్యాటర్లు బౌండరీలు బాదుతున్నా లెంగ్త్ విషయంలో మాత్రం అతడు రాజీపడకుండా బౌలింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్పై ఇదే వ్యూహాన్ని అనుసరించాడు. గూగ్లీతో ఓపెనర్ తంజిద్ను ఔట్ చేసిన అతడు తర్వాత స్ట్రెయిటర్ బాల్తో తౌహిద్ను వెనక్కి పంపాడు. హసన్ కూడా అతనికే చిక్కడంతో బంగ్లా ఓటమి ఖరారైంది.
అడుగు పడినట్లే..బంగ్లాపై భారత్ ఘనవిజయం
తన ఆటతీరు, వ్యూహాలపై మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో ఏ స్పిన్నర్ అయినా సరే.. లెంగ్త్ చాలా ముఖ్యం. ప్రత్యేకంగా ఈ ఫార్మాట్లో అసలు బ్యాటర్ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి. అతడు దూకుడుగా ఆడుతుంటే.. స్పిన్ బౌలర్ మరింత దూకుడుగా ఉండాలి. అదే ఐపీఎల్లోగానీ, టీ20 ప్రపంచకప్లోగానీ నాకు పనికొస్తోంది’’ అని బంగ్లాతో మ్యాచ్ అనంతరం కుల్దీప్ (Kuldeep Yadav) వివరించాడు. సోమవారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ అతనికి కీలకంగా మారనుంది.
బ్యాటర్లు బౌండరీలు బాదుతున్నప్పుడు మీ వ్యూహం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు కుల్దీప్ (Kuldeep) బదులిచ్చాడు. ‘‘ప్రత్యర్థి జట్టుకు ఓవర్కు 10 లేదా 12 పరుగులు కావాల్సినప్పుడు బ్యాటర్లు దూకుడుగా ఆడుతుంటారు. అలాంటప్పుడు లెంగ్త్కు కట్టుబడి ఉండడమే నా ప్లాన్. వాళ్లు అటాక్ చేస్తున్నప్పుడు.. సరైన లెంగ్త్లో బంతులను సంధిస్తే చాలు. వారు ఔటవ్వడానికి అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. నా ఆలోచనంతా దానిపైనే ఉంటుంది. ఔట్ చేయాలనే లక్ష్యంపై కాకుండా కేవలం లెంగ్త్పైనే దృష్టి సారిస్తా’’ అని కుల్దీప్ వివరించాడు.
కరీబియన్లో జరిగే మ్యాచ్లలో జట్టు కూర్పు ఎలా ఉంటుందో తనకు ముందే అవగాహన ఉందని కుల్దీప్ వెల్లడించాడు. పరోక్షంగా పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే గ్రూప్ దశలో తనని జట్టులోకి తీసుకోలేదని చెప్పాడు. సూపర్-8లో తమపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశాడు. అక్కడ కూడా లెంగ్త్కు కట్టుబడి ఉంటూ పేస్ను మార్చడమే తన వ్యూహమని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీకి టీమ్ఇండియా ‘జెర్సీ’ బహూకరణ.. నంబర్ ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీని పొట్టి కప్ విజేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు భారత జెర్సీని అందించారు. మోదీతో భేటీ కావడంపై క్రికెటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
స్వదేశానికి టీమ్ఇండియా.. భారత స్టార్లు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారంటే?
టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమ్ఇండియా స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నారు. -
మొన్న ఆర్మీ ట్రైనింగ్.. ఇప్పుడు పాత పరుపులపై ప్రాక్టీస్.. పాక్పై ట్రోలింగ్
పాకిస్థాన్ క్రికెట్ మేనేజ్మెంట్ తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆర్మీ ట్రైనింగ్ అంటూ హంగామా చేసి పొట్టి కప్లో దారుణ పరాభవంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. -
కోహ్లీ ‘ఫిట్నెస్’ చూశాక.. పోటీపడలేమనుకున్నా: సూర్యకుమార్
ఫిట్నెస్ విషయంలో విరాట్ను అందుకోవడం చాలా కష్టమని భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. -
ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ
వరల్డ్ కప్తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు అపూర్వ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
వరల్డ్ కప్తో కెప్టెన్ రోహిత్ డ్యాన్స్ అదుర్స్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డ్యాన్స్తో అలరించాడు. వరల్డ్ కప్తో టీమ్ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయం బయట అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ వేశాడు.
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
పొట్టి కప్ను నెగ్గిన భారత ఆటగాళ్లు ఎట్టకేలకు స్వదేశానికి చేరారు. వారికి ఘనస్వాగతం లభించింది. దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు, అధికారుల మధ్య ప్లేయర్లు డ్యాన్సులతో కాసేపు హంగామా చేశారు. -
1983 TO 2024.. టీమ్ఇండియా ‘ప్రపంచ కప్’ల సంబురం
తొలిసారి 1983లో వన్డే ప్రపంచ కప్ను గెలిచిన టీమ్ఇండియా.. తాజాగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేసి సగర్వంగా ఇంటికి తిరిగొచ్చింది.
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
T20 World Cup: 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం దిల్లీలో అడుగు పెట్టిన రోహిత్ సేన.. అక్కడే ప్రధానితో సమావేశం కాబోతోంది. -
ఆల్రౌండర్ నం.1 హార్దిక్
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. -
అదరగొట్టిన అల్కరాస్
టైటిల్ ఫేవరెట్ మూడో సీడ్ కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. అతను అలవోకగా మూడో రౌండ్ చేరాడు. అయిదో సీడ్ మెద్వెదెవ్ రెండో రౌండ్ను అధిగమించగా.. ఎనిమిదో సీడ్ రూడ్కు ఫోగ్నిని షాకిచ్చాడు. -
క్వార్టర్స్లో తుర్కియే
తొలి నిమిషంలో గోల్.. ఆఖరి సెకన్లలో అద్భుత సేవ్తో తుర్కియే యూరో కప్ ఫుట్బాల్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఆ జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. -
కొత్త సవాల్ను అధిగమించాం
ప్రపంచ బ్యాడ్మింటన్లో ఎదురవుతున్న కొత్త సవాల్ను అధిగమించినట్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం తెలిపింది. -
మార్చి 1న భారత్, పాక్ పోరు!
అసలు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందో లేదో తెలియదు, జరిగితే టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్థాన్లో భారత్ పర్యటిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు గానీ.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ముహూర్తం ఖరారైపోయింది. -
అది తప్పుకోవడం కాదు
పారిస్ డైమండ్ లీగ్ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్పష్టత ఇచ్చాడు. -
బాయ్కాట్కు మళ్లీ క్యాన్సర్
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ రెండోసారి గొంతు క్యాన్సర్ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడాకుల రూమర్స్ వేళ.. పాండ్యా సతీమణి పోస్టు వైరల్
-
టీడీఆర్ బాండ్లలో అక్రమాలపై విచారణ.. నివేదికలు వచ్చాకే చర్యలు: మంత్రి నారాయణ
-
ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్లివే.. ‘మీర్జాపూర్ 3’ వచ్చేస్తోంది!
-
విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలి: సీఎం రేవంత్
-
ప్రధాని మోదీకి టీమ్ఇండియా ‘జెర్సీ’ బహూకరణ.. నంబర్ ఎంతంటే?
-
జుడియో, మింత్రాకు పోటీగా.. భారత్లోకి షీయెన్ బ్రాండ్ రీఎంట్రీ!