- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
SuryaKumar-Virat: కోహ్లీ ‘ఫిట్నెస్’ చూశాక.. పోటీపడలేమనుకున్నా: సూర్యకుమార్
ఫిట్నెస్ విషయంలో విరాట్ను అందుకోవడం చాలా కష్టమని భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ఫైనల్లో అద్భుతమైన క్యాచ్తో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సంచలనంగా మారిపోయాడు. పొట్టి కప్ను అందించిన ఆ క్యాచ్ను అందుకోవడానికి పరోక్షంగా విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా నిలిచాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఫిట్నెస్ విషయంలో విరాట్ను అందుకోవడం చాలా కష్టమని సూర్య వ్యాఖ్యానించాడు. టీ20ల్లో అరంగేట్రం చేసిన తర్వాత కోహ్లీతో కలిసి ఆడిన అనుభవం చాలా ఉపయోగపడిందని తెలిపాడు.
‘‘విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుతమైన నాయకుడు. ఒక్కసారి మైదానంలోకి అడుగుపెడితే అతడి ఎనర్జీ మొత్తం బయటకొచ్చేస్తుంది. పవర్హౌస్లాంటోడు. ప్రదర్శనతో సంబంధం లేకుండా దూకుడుగా ఉంటాడు. నేను డెబ్యూ చేసిన తర్వాత.. ఎక్కువగా కోహ్లీతో ఆడే అవకాశం లభించింది. ద్వైపాక్షిక సిరీస్లతోపాటు వరల్డ్ కప్లోనూ ఆడా. అతడితో ఆడేటప్పుడు ఫిట్నెస్ను పోల్చుకుంటూ ఉంటా. కానీ, ఏ దశలోనూ కోహ్లీ స్థాయికి రాలేనని అర్థమైంది. ఎందుకంటే ఖాళీ ప్రదేశంలోకి బంతిని పంపించి అత్యంత వేగంగా రెండు పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఒక్కోసారి నాలుగుగా మార్చాలని చూస్తుంటాడు. అందుకే జట్టు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్కు ఒకే మాట చెప్పా. నా ట్రైనింగ్ టైమ్ను ఎక్కువగా విరాట్తో ఉండేలా చూడమని కోరా. కొన్ని రోజులు ట్రైనింగ్ లేకపోతే నా శరీరం అలసిపోయినట్లుగా లేదా మానసికంగా సిద్ధంగా లేనట్లు అనిపిస్తుంది. కనీసం శిక్షణ సమయంలో 40 నిమిషాలపాటు అతడిని చూస్తూ జిమ్లో గడపడం ద్వారా మళ్లీ ఎనర్జీ వచ్చేస్తుంది’’ అని సూర్యకుమార్ (Suryakumar Yadav) వ్యాఖ్యానించాడు.
రెండో స్టార్ వచ్చేసింది: సంజూ శాంసన్
టీ20 ప్రపంచ కప్ 2024ను టీమ్ఇండియా సొంతం చేసుకుని 17 ఏళ్ల నిరీక్షణకు తెరతీసింది. రెండోసారి కప్ను దక్కించుకోవడంతో భారత జట్టు జెర్సీపై ‘రెండు స్టార్లు’ చేరాయంటూ సంజూ శాంసన్ (Sanju తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టాడు. ‘భారత్ ఛాంపియన్స్’ అని టీమ్ఇండియా జెర్సీని ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకొన్నాడు. విండీస్ నుంచి దిల్లీకి వచ్చిన భారత క్రికెటర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత ముంబయికి బయల్దేరారు. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ టాప్ బస్పై రోడ్షో జరగనుంది. అనంతరం ప్లేయర్లను బీసీసీఐ సన్మానించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య
గత ఆరు నెలల కాలంలో ఎన్నో హెచ్చుతగ్గులను చవిచూశానని ప్రధాని మోదీతో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్య (Hardik Pandya) వెల్లడించారు. -
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
Shubman Gill: అంతర్జాతీయ టీ20ల్లో తాను ఓపెనర్గా ఉండాలనుకుంటున్నట్లు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ చెప్పారు. జింబాబ్వేతో మ్యాచ్లోనూ తాను ఓపెనింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
‘హార్దిక్ కూడా అందరిలాంటోడే..’
తన సోదరుడు హార్దిక్ పాండ్య టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. -
ఇక కుర్రాళ్ల సమయం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. -
చరిత్ర మారలేదు
గత 36 ఏళ్లలో ప్రపంచకప్ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు. -
భారత్ జోరుకు కళ్లెం
దక్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్ఇండియాను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్లో బదోసా
స్పెయిన్ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్లో ప్రవేశించింది. -
సెమీస్లో అర్జెంటీనా
కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్తో ఈక్వెడార్ను ఓడించింది. -
టీమ్ఇండియాకు ఇంకో రూ.11 కోట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. -
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రెడిట్ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.