- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
T20 World Cup: సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
T20 World Cup: 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం దిల్లీలో అడుగు పెట్టిన రోహిత్ సేన.. అక్కడే ప్రధానితో సమావేశం కాబోతోంది.
దిల్లీ: టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన రోహిత్ సేన సగర్వంగా భారత్కు చేరుకుంది. గురువారం ఉదయం జట్టు సభ్యుల ప్రత్యేక విమానం దిల్లీలో దిగింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు (Team India) స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు రోహిత్ సేన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానుంది.
అది ముగిశాక ప్రత్యేక విమానంలోనే ముంబయికి బయల్దేరుతుంది. అక్కడ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రోడ్ షో మొదలవుతుంది. రెండు గంటల పాటు సాగే ఊరేగింపులో రోహిత్ (Rohit Sharma) బృందం ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో (T20 World Cup) అభిమానులకు అభివాదం చేస్తూ సాగుతుంది. రాత్రి వాంఖడె స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
టీమ్ఇండియాకు (Team India స్వాగతం పలికేందుకు అభిమానులు గురువారం వేకువజామునే పెద్ద ఎత్తున విమానాశ్రయ పరిసరాలకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయటంతో ఆటగాళ్లను దూరం నుంచే చూడాల్సి వచ్చింది. దిల్లీలో వర్షం కురుస్తున్నప్పటికీ.. టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ వందలాది మంది ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ జెండాలతో వారికి స్వాగతం పలికారు. ‘‘ఈ క్షణాల కోసం 13 ఏళ్లుగా వేచిచూశాం. టీమ్ఇండియా కప్పు గెలిచి మమ్మల్ని గర్వపడేలా చేసింది’’ అని ఓ అభిమాని ఆనందం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4:30 గంటలకే ఎయిర్పోర్టుకు చేరుకున్నట్లు తెలిపారు. కొంతమందైతే బుధవారం రాత్రి నుంచే వేచి చూస్తున్నట్లు వెల్లడించారు.
ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి కప్పు గెలిచిన టీమ్ఇండియా భీకర హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో బుధవారం ఉదయం వారు అక్కడి నుంచి బయల్దేరారు. ఇండియన్ టీమ్, సహాయక సిబ్బంది, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, బీసీసీఐ అధికారులంతా కలిసి గురువారం ఉదయం దిల్లీలో దిగారు. ముందస్తుగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. టెర్మినల్-3లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వారు హోటళ్లకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ నివాసానికి వెళ్లనున్నారు.
అభిమానుల కేరింతల మధ్య ఆటగాళ్లు ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తూ చిరునవ్వులు చిందించారు. ఫైనల్లో డేవిడ్ మిల్లర్ క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పిన సూర్యకుమార్ యాదవ్ అభిమానుల కేరింతలకు ఉత్సాహంగా స్పందించాడు. వికెట్కీపర్ రిషభ్ పంత్ జన సమూహానికి సెల్యూట్ చేయగా.. పేసర్ సిరాజ్ ఫ్లయింగ్ కిస్సెస్ ఇచ్చాడు. చివరగా వచ్చిన రోహిత్ తన చేతిలో ఉన్న కప్పు అభిమానులకు చూపుతూ బస్సు ఎక్కాడు. విరాట్ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు.
ముంబయిలో జరిగే రోడ్షోకు పెద్ద ఎత్తున తరలిరావాలని బీసీసీఐ సెక్రటరీ జైషా అభిమానులను ఎక్స్ వేదికగా కోరారు. 2007లో తొలి టీ20 కప్ సాధించిన సమయంలోనూ అప్పటి ధోనీ బృందానికి ముంబయిలో ఘన స్వాగతం లభించింది. టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పిన రోహిత్ శర్మకు ఇది ప్రత్యేక సందర్భం కావడం విశేషం. స్వయంగా ముంబయికి చెందిన ఆయనకు సొంతగడ్డపై పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ కూడా అందరిలాంటోడే..’
తన సోదరుడు హార్దిక్ పాండ్య టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్ పాండ్య ఉద్వేగానికి గురయ్యాడు. -
ఇక కుర్రాళ్ల సమయం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జట్టు పూర్తిగా యువ రక్తంతో నిండిపోనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాలో చోటు ఆశిస్తున్న కుర్రాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం. -
చరిత్ర మారలేదు
గత 36 ఏళ్లలో ప్రపంచకప్ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు. -
భారత్ జోరుకు కళ్లెం
దక్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్ఇండియాను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్లో బదోసా
స్పెయిన్ అమ్మాయి పౌలాబదోసా వింబుల్డన్లో దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా నిలిచిన ఆమె ఈ టోర్నీలో ప్రిక్వార్టర్స్లో ప్రవేశించింది. -
సెమీస్లో అర్జెంటీనా
కోపా అమెరికా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో పెనాల్టీ షూటౌట్లో మెస్సి బృందం 4-2 గోల్స్తో ఈక్వెడార్ను ఓడించింది. -
టీమ్ఇండియాకు ఇంకో రూ.11 కోట్లు
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే బీసీసీఐ రూ.125 కోట్ల నజరానాను అందించగా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. -
భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రెడిట్ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లి వారసులతో ముకేశ్-నీతా అంబానీ కారు షికారు: వీడియో చూశారా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా
-
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
-
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు
-
కోర్ బ్రాంచీల్లో చేరితే స్కాలర్షిప్
-
పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్పై విచారణ