- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ICC Rankings: సూర్య కంటే 2 పాయింట్లే ఎక్కువ.. అగ్రస్థానంలోకి ఆస్ట్రేలియా ఓపెనర్
ఒక్క ఇన్నింగ్స్తో ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ అగ్రస్థానం సాధించాడు. గతేడాది డిసెంబర్ నుంచి ఆ స్థానంలో ఉన్న సూర్యకుమార్ కాస్త ఒక ర్యాంక్ కిందికి పడిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) భారత్పై అర్ధశతకం సాధించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓ ఘనత సాధించాడు. తన జట్టు సెమీస్కు చేరడంలో విఫలమైనప్పటికీ తను మాత్రం ఐసీసీ ర్యాంకుల్లో టాప్నకు చేరాడు. దాదాపు ఏడు నెలల నుంచి ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ను (Suryakumar Yadav) హెడ్ వెనక్కి నెట్టాడు. వీరిద్దరికి కేవలం 2 పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉండటం గమనార్హం. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ 844 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 842 పాయింట్లతో రెండో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ (816), బాబర్ అజామ్ (755), మహమ్మద్ రిజ్వాన్ (746) తర్వాత ర్యాంకుల్లో నిలిచారు. టీ20 ప్రపంచకప్ సెమీస్కు భారత్ చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సూర్య రాణిస్తే మళ్లీ అగ్రస్థానంలోకి రావడం పెద్ద కష్టమేం కాదు. ఆసీస్పై కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు సాధించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ర్యాంక్ను మెరుగుపర్చుకున్నాడు. రోహిత్ (527) 13 స్థానాలను ఎగబాకి 38వ ర్యాంకులో నిలిచాడు.
కుల్దీప్ 20.. బుమ్రా 44 స్థానాలు ఎగబాకి
ఐసీసీ టీ20 ర్యాంకుల్లో భారత్ తరఫున అక్షర్ పటేల్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. ప్రస్తుతం అతడు 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్లో ఆడిన మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్ (641) ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్కు చేరాడు. పొట్టి కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్దీప్ సింగ్ (621) 17వ స్థానంలో నిలిచాడు. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 44 స్థానాలను మెరుగుపర్చుకోవడం గమనార్హం. దీంతో బుమ్రా (589) 24వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
టీ20 ప్రపంచ కప్ సంగ్రామం తుది పోరుకు వేళైంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టైటిల్ వేట జరగనుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. -
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. -
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
రెండోసారి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకొనే అద్భుతమైన అవకాశం టీమ్ఇండియాకు వచ్చింది. దక్షిణాఫ్రికాతో కీలక పోరు జరగనుంది. -
మ్యాచ్ను ‘బ్రాడ్కాస్టింగ్’ గెలిపించదు కదా..: మైకెల్ వాన్కు గంగూలీ కౌంటర్
టీ20 ప్రపంచ కప్లో భారత్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తట్టుకోలేకపోతున్నాడు. టీమ్ఇండియా విజయాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానికి మాజీ క్రికెటర్లు గట్టిగా బదులిచ్చారు. -
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
టీమ్ఇండియా సారథి రోహిత్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. స్టార్ పేసర్ బుమ్రా నుంచి మాజీ క్రికెటర్ల వరకు రోహిత్ నాయకత్వం గురించి ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. బార్బడోస్లో వాతావరణం ఎలా ఉందంటే?
టైటిల్ను దక్కించుకోవాలని రెండు జట్లు సిద్ధం.. కానీ, వరుణుడు కూడా ఆడేస్తానంటూ పలకరింపులు.. ఇప్పుడు బార్బడోస్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.. -
ఆ క్యాంపెయిన్ సరైంది కాదు.. జట్టు వాతావరణం దెబ్బతినే అవకాశం: అశ్విన్
రాహుల్ ద్రవిడ్ కోసం కప్ గెలవాలనే ట్రెండింగ్పై భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
టెస్టు క్రికెట్లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. -
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్ అడ్వాంటేజ్ అవుతుందా? ద్రవిడ్ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకొనేందుకు చక్కటి అవకాశం టీమ్ఇండియా ముంగిట ఉంది. తుది పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
వదలొద్దు ఇండియా
టీ20 ప్రపంచకప్లో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారమే అంతిమ సమరం. అజేయంగా ఫైనల్ చేరిన రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. -
ఒక్క రోజే 525 పరుగులు
టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. -
మెరిసిన ‘లక్ష్య’ అథ్లెట్లు
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ ‘లక్ష్య’ అథ్లెట్లు మెరిశారు. హరియాణాలో జరిగిన మహిళల 400 మీటర్ల పరుగులో దండి జ్యోతిక శ్రీ కాంస్యంతో సత్తాచాటింది. -
గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్లు డ్రా
గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సూపర్బెట్ క్లాసిక్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. -
డోపింగ్ వలలో మను
జావెలిన్ త్రోయర్ డి.పి.మను డోపింగ్ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్ రాష్ట్ర ఛాంపియన్షిప్కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) శుక్రవారం ఆదేశించింది. -
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా దూసుకుపోతోందని మాజీ కెప్టెన్ గంగూలీ కితాబిచ్చారు. -
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
-
భారత బ్యాటర్లు షంసీని టార్గెట్ చేస్తే చాలు: ఉతప్ప
-
వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్ యాప్’ మాయలో సివిల్స్ అభ్యర్థి
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ