- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Sunil Gavaskar: భారత్ విజేతగా నిలవడంలో వారిద్దరి కంటే అతడిదే కీలక పాత్ర: గావస్కర్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ క్రెడిట్ జట్టులోని ప్రతి ఒక్కరికీ దక్కుతుందని చెబుతూనే సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. కానీ, వీరిద్దరి కంటే మరొక ప్లేయరే పొట్టి కప్లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడు ఎవరంటే? భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). అద్భుత నాయకత్వంతో టీమ్ఇండియాకు రెండోసారి టీ20 ప్రపంచ కప్ నెగ్గేందుకు కారణమయ్యాడని గావస్కర్ అభినందించాడు.
‘‘ఇక్కడ నేనెవరినీ తక్కువ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ జట్టు విజయంలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. బుమ్రా బౌలింగ్లో ఛాంపియన్. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఛాంపియన్. వీరందరినీ నడిపించి జట్టును గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన పాత్రధారి. అతడి నాయకత్వం అబ్బురపరిచింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమాత్రం నిస్పృహ దరిచేరనీయకుండా జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతడి బాడీ లాంగ్వేజ్ను చూస్తే అర్థమైపోతుంది. అందుకే, ఈ టోర్నీ ఆసాంతం రోహిత్ చూపించిన నాయకత్వ ప్రతిభ నన్ను ఆకట్టుకుంది’’ అని గావస్కర్ తెలిపాడు.
లండన్ వెళ్లిన కోహ్లీ!
వరల్డ్ కప్తో స్వదేశానికి చేరిన భారత జట్టు ముంబయిలో భారీ రోడ్ షో చేసిన సంగతి తెలిసిందే. అనంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అక్కడే అతడి సతీమణి అనుష్క శర్మ, కుమార్తె వామికా, కుమారుడు అకాయ్ ఉన్నారు. ఫైనల్ రోజు కూడా ఫోన్లోనే వారితో విరాట్ మాట్లాడాడు. సరైన సమయంలో ఫామ్ అందుకొన్న అతడు కీలకమైన ఇన్నింగ్స్తో (76 పరుగులు) భారత విజయానికి సహకరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వార్టర్స్లో అల్కరాస్
టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. జోరు కొనసాగిస్తూ ఈ మూడో సీడ్ ఆటగాడు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అల్కరాస్ 6-3, 6-4, 1-6, 7-5తో హాంబర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. -
రెండో టీ20 వరుణుడిది
భారత మహిళల జట్టుకు నిరాశ. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓడిన హర్మన్ప్రీత్ బృందం.. రెండో టీ20లో గెలిచి లెక్క సమం చేయాలని అనుకున్నా వరుణుడు అడ్డుపడ్డాడు. -
సెమీస్లో నెదర్లాండ్స్
నెదర్లాండ్స్ జట్టు యూరో 2024 సెమీఫైనల్కు దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో వెనుకబడ్డా పుంజుకున్న ఆ జట్టు.. 2-1తో తుర్కియేపై విజయం సాధించింది. పోరును నెదర్లాండ్స్ మెరుగ్గానే ఆరంభించింది. -
సంక్షిప్త వార్తలు (3)
కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. భారత వర్ధమాన ఆటగాడు ప్రియాన్షు రజావత్కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రజావత్ 17-21, 10-21తో అలెక్స్ లేనియెర్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. -
ఛాంపియన్ల వేదిక
చెరుకూరి రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అండర్-8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రేరణగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ బ్రాండ్ అంబాసిడర్ పుల్లెల గోపీచంద్ అన్నారు. -
102కు కూలిన జట్టే 100 తేడాతో..
ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. యువ భారత్ బలంగా పుంజుకుంది. జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన శుభ్మన్ బృందం.. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/07/24)
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
పేపర్ లీక్లతో యువత కలల్ని నాశనం చేసినోళ్లను వదిలేది లేదు.. సీఎం భజన్లాల్ శర్మ
-
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్