Ind W vs RSA W: మహిళల తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే విజయం
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ మహిళా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది.
చెన్నై: వరుసగా వన్డే సిరీస్ను 3-0, టెస్ట్ సిరీస్ను 1-0తేడాతో సొంతం చేసుకున్న భారత్ మహిళా జట్టుకు 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది. 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళలు భారత్కు 190 పరుగుల టార్గెట్ను నిర్దేశించారు. లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 177 పరుగులకు పరిమితమైంది. రోడ్రిగ్స్ (53; 30 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకంతో ఆకట్టుకుంది. స్మృతి మంధాన (46; 30 బంతుల్లో 7×4, 2×6), హర్మన్ ప్రీత్కౌర్ (35; 29 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడారు. షెఫాలీ వర్మ (18), హేమలత (14) నిరాశపరిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా, ట్రయాన్, డి క్లెర్క్, మ్లబా తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభం నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వోల్వార్ట్ (33), తజ్మిన్ బ్రిట్స్ (81) తొలి వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి డౌన్లోవచ్చిన మరిజన్నె (57)తో కలిసి బ్రిట్స్ కీలక ఇన్నింగ్స్ నిర్మించి.. ఇద్దరూ క్రీజులో నిలదొక్కుకుంటూ ఎడాపెడా బాదేశారు. 17వ ఓవర్ వరకు మరో వికెట్ పడలేదంటే.. వారిద్దరూ క్రీజులో ఎంతలా పాతుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. ఈ జోడీని రాధా యాదవ్ విడగొట్టింది. 16.3వ బంతికి శోభనాకు క్యాచ్ ఇచ్చి మరిజన్నె వెనుదిరిగింది. అప్పటికి జట్టు స్కోరు 146 పరుగులు. ఆ తర్వాత బ్రిట్స్కు, ట్రయాన్ (12) తోడుగా నిలవడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. భారత్ బౌలర్లలో పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో భారత్ సమష్టి ప్రదర్శన చేసినప్పటికీ.. లక్ష్యం భారీగా ఉన్న నేపథ్యంలో నిరాశ తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ ప్రజల కెప్టెన్... వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోలేదు: గావస్కర్
భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించిన రోహిత్ శర్మను క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. -
పారిస్ ఒలింపిక్స్ చెఫ్ దే మిషన్గా గగన్ నారంగ్..పతాకధారిగా సింధు
జులై 26న ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్కు వెళ్తున్న భారత్ బృందానికి చెఫ్ దే మిషన్గా షూటర్ గగన్ నారంగ్ నియమితులయ్యారు. -
డకౌట్ అయినా యువరాజ్ సంతోషించారు: అభిషేక్ శర్మ
అరంగేట్ర మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగినా తన మెంటార్ యువరాజ్ సంతోషించారని అభిషేక్ శర్మ అన్నాడు. -
మాల్దీవుల్లో సంబరాలు చేసుకోండి.. భారత క్రికెట్ జట్టుకు ఆహ్వానం
టీ20 ప్రపంచకప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మాల్దీవులను సందర్శించాలని భారత క్రికెట్ జట్టుకు అక్కడి పర్యటక సంస్థలు ఆహ్వానం పలికాయి. -
ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా!
బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah) ఐసీసీ ఛైర్మన్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రపంచ కప్ ఆటగాళ్లకు రూ.11 కోట్లు.. మహారాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది: చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చిరాగ్ మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు. -
‘‘నేను పొరపాటు చేశాను. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు’’ : అక్మల్
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh), పాక్ మాజీ వికెట్కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) ఎదురుపడ్డారు. -
రిలేషన్షిప్ను బయటపెట్టిన స్మృతీ మంధాన.. ఎవరీ పలాశ్ ముచ్చల్..?
మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్తో స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన (Smriti Mandhana) రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా వారి ఐదేళ్ల బంధం గురించి ఆమె బయటపెట్టారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) జరగనుంది. ఈ మెగా టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్ కూడా విడుదలైంది. -
టీమ్ఇండియాతో టీ20, వన్డే సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్గా జయసూర్య
శ్రీలంక, భారత్ (SL vs IND) మధ్య మరికొన్ని రోజుల్లో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ల్లో మాజీ ఆటగాడు సనత్ జయసూర్య శ్రీలంక జట్టుకు హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. -
టీమ్ఇండియాకు రూ. 125 కోట్ల నజరానా.. ఎవరికి ఎంతంటే?
టీమ్ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ సాధించడంతో బీసీసీఐ (BCCI) రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంలో స్పష్టత వచ్చింది. -
రెండో మ్యాచ్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో అభిషేక్ తన సొంత బ్యాట్ వాడలేదు. -
బాలీవుడ్ నటితో పెళ్లి.. స్పందించిన కుల్దీప్ యాదవ్
Kuldeep Yadav: తన పెళ్లి విషయంలో త్వరలో అందరికీ శుభవార్త చెప్పనున్నట్లు టీమ్ఇండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్ తెలిపాడు. కాన్పూర్లో ఆయనకు ఘన స్వాగతం లభించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. -
102కు కూలిన జట్టే 100 తేడాతో..
ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. యువ భారత్ బలంగా పుంజుకుంది. జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన శుభ్మన్ బృందం.. రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. -
ఛాంపియన్ల వేదిక
చెరుకూరి రామోజీరావు స్మారక తెలంగాణ రాష్ట్ర అండర్-8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రేరణగా తీసుకుని మరింత మంది ఛాంపియన్లు వస్తారని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ బ్రాండ్ అంబాసిడర్ పుల్లెల గోపీచంద్ అన్నారు. -
బ్రెజిల్ ఔట్.. సెమీఫైనల్లో ఉరుగ్వే
కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో బ్రెజిల్కు షాక్ తగిలింది. క్వార్టర్ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓటమితో ఆ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. నిర్ణీత సమయంలో 0-0తో స్కోరు సమమైన ఈ మ్యాచ్లో ఉరుగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-2తో గెలిచి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
క్వార్టర్స్లో అల్కరాస్
టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) వింబుల్డన్లో దూసుకెళ్తున్నాడు. జోరు కొనసాగిస్తూ ఈ మూడో సీడ్ ఆటగాడు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అల్కరాస్ 6-3, 6-4, 1-6, 7-5తో హాంబర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. -
రెండో టీ20 వరుణుడిది
భారత మహిళల జట్టుకు నిరాశ. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓడిన హర్మన్ప్రీత్ బృందం.. రెండో టీ20లో గెలిచి లెక్క సమం చేయాలని అనుకున్నా వరుణుడు అడ్డుపడ్డాడు. -
సెమీస్లో నెదర్లాండ్స్
నెదర్లాండ్స్ జట్టు యూరో 2024 సెమీఫైనల్కు దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో వెనుకబడ్డా పుంజుకున్న ఆ జట్టు.. 2-1తో తుర్కియేపై విజయం సాధించింది. పోరును నెదర్లాండ్స్ మెరుగ్గానే ఆరంభించింది. -
సంక్షిప్త వార్తలు (3)
కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. భారత వర్ధమాన ఆటగాడు ప్రియాన్షు రజావత్కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రజావత్ 17-21, 10-21తో అలెక్స్ లేనియెర్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హేమంత్ సోరెన్కు బెయిల్పై.. ‘సుప్రీం’కు ఈడీ
-
‘మిడతలు, పట్టుపురుగులు తినొచ్చు’ - సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ
-
కోర్లపహాడ్ వద్ద రూ.5 కోట్లతో ట్రామా సెంటర్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
-
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన మాదకద్రవ్యాలు ధ్వంసం
-
త్రిష వెబ్సిరీస్ ‘బృందా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆసక్తిగా టీజర్
-
రోహిత్ ప్రజల కెప్టెన్... వ్యక్తిగత మైలురాళ్లను పట్టించుకోలేదు: గావస్కర్