Ind W vs RSA W: ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌.. భారత్‌ లక్ష్యం 190

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా భారత మహిళల జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసింది.

Updated : 05 Jul 2024 20:58 IST

చెన్నై: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా భారత మహిళల జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ తజ్మిన్‌ బ్రిట్స్‌ (81; 56 బంతుల్లో 10×4, 3×6), మారిజన్నె (57; 33 బంతుల్లో 8×4, 1×6) అర్ధ శతకాలతో అదరగొట్టారు. కెప్టెన్‌ వోల్వార్ట్ (33; 22 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ట్రయాన్‌ 12 పరుగులు చేసింది. చివర్లో వచ్చిన డి.క్లెర్క్‌ (1*) నాటౌట్‌గా మిగిలింది. భారత్‌ బౌలర్లలో పూజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌ చెరో 2 వికెట్లు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని